Skip to main content

చిన్న పత్రికలకు చేయూత తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

 



చిన్న పత్రికలకు చేయూత 

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి


హైదరాబాద్ :


చిన్న పత్రికలతో పాటుజర్నలిస్టుల సమస్యలపై 

పూర్తి అవగాహన 

ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన పిదప తెలంగాణ చిన్న మధ్య తరహా దిన, మాస పత్రికల సంఘం ఆధ్వర్యంలో శాలువా కప్పి, బొకే అందించి సత్కరించారు. అనంతరం చిన్న పత్రికల సమస్యల పరిష్కారం కోరుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అక్షిత చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి, గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవాదీనం, ప్రధాన కార్యదర్శి అహమ్మద్ అలీలతో కూడిన బృందం వినతి పత్రాన్ని సమర్పించారు. చిన్న పత్రికలకు చేయుత నందించాలని కోరారు.జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు అవసరమైన శిక్షణ, గత కొంతకాలంగా చిన్న, మధ్య తరహా పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఆఫ్ గ్రేడ్ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని, ఏడాదిన్నర కాలంగా ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, దిన పత్రికలతో పాటు మ్యాగజైన్ లకు కూడా ప్రకటనలు జారీ చేసేలా తగు సూచనలు ఇవ్వాలని కోరగా అందుకు సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ అక్రిడిటేషన్ కార్డులు కల్గిన చిన్న మధ్య తరహా పత్రికల ఎడిటర్లు, జర్నలిస్టులకు హైదరాబాద్ లోనే ఇళ్ళ స్థలాలు, ఇళ్ళను కేటాయించేలా చొరవ చూపాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమవరపు యాదయ్య , కోటగిరి చంద్ర శేఖర్, చిట్యాల శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి కొమ్మరాజు శ్రీనివాసులు, నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎండి మక్సుద్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్ల వెంకటయ్య, జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, సంధ్యాల విద్యాసాగర్, జిల్లా కార్యదర్శి మొహమ్మద్ అఫ్జల్ ఖాన్, జిల్లా కమిటీ సభ్యులు వీరెల్లి వెంకటరమణ, శ్రీరంగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


 *కార్యవర్గంలో మార్పులు* 

తెలంగాణ చిన్న మధ్య తరహా దిన, మాస పత్రికల సంఘం రాష్ట్రఉపాధ్యక్షులుగా కోటగిరి చంద్ర శేఖర్, రాష్ట్ర కోశాధికారి కొమ్మరాజు శ్రీనివాసులు, నల్గొండ జిల్లా అధ్యక్షులుగా ఎండి మక్సుద్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్ల వెంకటయ్యలనునియమించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాస్ మాతంగి ప్రకటించారు. మిగిలిన కార్యవర్గం అంతా యధావిధిగా ఉంటుందన్నారు. సంఘ పటిష్ఠతకు మరింత కృషి చేయాలని ఆయన కోరారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్