Posts

టిజి పి సి బి ద్వారా 3.24 లక్షలకు పైగా మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ

Image
  టిజి పి సి బి ద్వారా 3.24 లక్షలకు పైగా మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ *పర్యావరణ అనుకూలమైన మట్టి గణేష్ విగ్రహాలను ప్రోత్సహించే ప్రచార పోస్టర్లు  తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టిజిపిసిబి) ఆవిష్కరణ. *మట్టి గణేష్ విగ్రహాలపై మంత్రి శ్రీమతి కొండా సురేఖ పోస్టర్లను ఆవిష్కరించారు. హైదరాబాద్: 27-8-2025 నుండి ప్రారంభమయ్యే గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ప్రజలు మట్టి గణపతులను మాత్రమే పూజించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నుండి మట్టి విగ్రహాలకు మారాలని ఆమె ప్రజలను గట్టిగా కోరారు. ”మట్టి గణేష్ విగ్రహాలను తయారు చేసి ఇంట్లో మరియు మన నివాస ప్రాంతాలలో మట్టి గణేష్ విగ్రహాలకు పూజలు చేద్దాం. నీటి వనరులలో నుండి మట్టిని ఉపయోగిo చి మట్టి విగ్రహాలను తయారు చేసి పూజ చేసిన తర్వాత నీటి వనరులలోవాటిని తిరిగి నిమజ్జనం చేయలని” తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టిజిపిసిబి) మట్టి గణేష్ విగ్రహాలపై ప్రచార పోస్టర్లను శనివారం సచివాలయంలో విడుదల చేస్తూ మంత్రి సురేఖ అన్నారు. పూజలలో ఉపయోగించే పూలు మరియు మూలికలను కంపోస్ట్ చేయాలని మ...

ACB కి చిక్కిన ఒకే రోజు ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ లు

Image
  ACB కి చిక్కిన ఒకే రోజు ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ లు  ACB నెట్‌లో సబ్-రిజిస్ట్రార్, వనస్తలి పురం, రంగారెడ్డి జిల్లా  22.08.2025న AO-1 S. రాజేష్ కుమార్ సబ్ రిజిస్ట్రార్, వనస్తలిపురం రంగారెడ్డి జిల్లా, తెలంగాణ ACB, రంగారెడ్డి యూనిట్ వారు రూ. 1,00,000/- లంచం డిమాండ్ చేసి, ఫిర్యాదుదారుడి ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు A-2 K. రమేష్ r/o నాగోల్ ద్వారా ఫిర్యాదుదారుడి నుండి రూ. 70,000/- తీసుకున్నప్పుడు పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని A-2 నుండి అతని తరపున తిరిగి పొందారు. AO-1 S. రాజేష్ కుమార్ సబ్ రిజిస్ట్రార్, వనస్తలిపురం రంగారెడ్డి జిల్లా మరియు A-2 కె. రమేష్ r/o నాగోల్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. ************************************************ ఆదిలాబాద్ జిల్లా, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల విభాగం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జాయింట్-సబ్ రిజిస్ట్రార్-II ACB నెట్‌లో ఉన్నారు. 22.08.2025న, ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖలోని జాయింట్ సబ్-రిజిస్ట్రార్-II (AO) కె. శ్రీనివాస్ ర...

జాతీయ రక్తవీర్ పురస్కారాలు తెలంగాణ కి 4 అవార్డ్ రావడం సంతోషకరం - ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
 జాతీయ రక్తవీర్ పురస్కారాలు తెలంగాణ కి 4 అవార్డ్ రావడం సంతోషకరం - ఉప్పల శ్రీనివాస్ గుప్త అవార్డులను అందజేసిన లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్త ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని అశోక హోటల్ లో నిర్వహించిన జాతీయ రక్తవీర్ పురస్కారాల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ నుండి 4 గురుకి అవార్డ్ అందజేయడం జరిగింది. 1 ) Dr బాలు  2 ) గంప ప్రసాద్,పర్శ  3) వెంకటరమణ,  4 ) శివ కుమార్ లు ఈ అవార్డులను పొందడం జరిగింది. ఈ సందర్భగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ  తలసేమియా చిన్నారుల కోసం నాలుగు వేలకు పైగా రక్తాన్ని సేకరించి అందజేసినందుకు గాను జాతీయ రక్తవీర్ పురస్కారాన్ని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్త,ఐవిఎఫ్ అంతర్జాతీయ అధ్యకులు అశోక్ అగర్వాల్ చేతుల మీదుగా 4 గురికి అందజేయడం జరిగింది అని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైశ్యులు అందరిని ఏకం చేయడం కోసం ఐవిఎఫ్ పనిచేస్తున్నదని, ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఆనంద నిలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని దానికి ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చే...

రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్

Image
 *రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్* రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో తన అమ్మమ్మకు చెందిన భూమిని నమోదు చేసేందుకు, రికార్డుల్లో తప్పులను సవరించేందుకు ఒక వ్యక్తి వద్ద రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసిన *తహసీల్దార్ చింతకింది లలిత, సర్వేయర్ కోట రవి* బాధితుడి ఫిర్యాదు మేరకు రూ.50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Image
 నేడు జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షుడు తేలు కుంట్ల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది . ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి శెట్టి శ్రీనివాస్ కోశాధికారి జైని రాములు అదనపు ప్రధాన కార్యదర్శి నాళ్ల వెంకటేశ్వర్లు జిల్లా మహిళా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య జిల్లా ఎన్నికల అధికారి నల్లగొండ శ్రీనివాస్ బెస్ట్ సేవా సమితి వ్యవస్థాపకులు బుక్కా ఈశ్వరయ్య సీనియర్ జర్నలిస్టు కోటగిరి దైవాదినం పట్టణ అధ్యక్షులు యామ మురళి తేలుకుంట్ల జానయ్య సముద్రాల వెంకటేశ్వర్లువీరెళ్లి కృష్ణయ్య నాంపల్లి నరసింహా రేపాల భద్రాద్రి రాములు వీరెల్లి సతీష్ కోటగిరి రామకృష్ణపారపెల్లీ శ్రీనివాస్ బోనగిరి ప్రభాకర్ గుబ్బా శ్రీనివాస్ బోనగిరి కిరణ్ కుమార్ బోనగిరి కిరణ్ కుమార్ చెరుకు జానయ్య నూనె కిషోర్ కొత్త మాస్ ప్రభాకర్ కొత్త మాస్ నవీన్ కుకడం శ్రీనివాస్ వనమ రమేష్ పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో నల్లగొండ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి నాళ్ల శ్రీనివాస్ గారిని సన్మానించడం జరిగినది

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

Image
మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా హైద్రాబాద్: ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా పది సంవత్సరాల నుండి చెప్పుకుంటూ అప్రజాస్వామికంగా అరాచకంగా ఆ స్థానంలో ఉంటూ ఇటీవల కోర్టు తీర్పును సైతం ధిక్కరించి ఇప్పటికీ నేనే అధ్యక్షుడుని అని చింతల్ బస్తీలోని కార్యాలయంలో జాతీయ జెండా ని ఎగురవేయడానికి సిద్ధమైన అమరవాది లక్ష్మీ నారాయణ.    ఆర్యవైశ్య మహాసభ ప్రక్షలన కమిటీ నిరసనలతో జెండా ఆవిష్కరించకుండా పక్కకు తప్పుకున్న అమరవాది లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ గుప్తా జెండా ఆవిష్కరించారు.   ఆర్యవైశ్య మహాసభ ప్రక్షలన కమిటీ ఆధ్వర్యంలో అమరావతి వెంటనే ఎన్నికలు పెట్టాలని కోర్టు తీర్పులు అమలు పరచాలని కోరుతూ నిరసన తెలపడంతో అమరవాది జాతీయ జండా ఆవిష్కరించకుండా తప్పుకున్నారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీ గణేష్ గుప్తా జెండా ఆవిష్కరించారు. ఈరోజు ఉదయం  ప్రక్షణల కమిటీ ఆధ్వర్యంలో అమరవాది దిగిపోవాలి, కోర్టు తీర్పును వెంటనే అమలు పరచి ఎన్నికలు పెట్టాలని అమరవాది అధ్యక్షుడు కాదని నిరసనలు తెలపడంతో...

టీజీపీసీబీలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Image
  టీజీపీసీబీలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హైదరాబాద్, ఆగస్టు 15: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ)లో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సభ్య కార్యదర్శి  జి. రవి బోర్డు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మనకు లభించిన స్వేచ్ఛ అనేకమంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం, కృషి ఫలితం. వారి అంకితభావం, నిబద్ధత భవిష్యత్ తరాలకు మార్గదర్శకం. యువత వారు చూపిన దారిలో నడవాలి” అని అన్నారు. అలాగే, ఆరోగ్యవంతమైన, సమృద్ధి చెందిన సమాజ నిర్మాణం కోసం పర్యావరణ పరిరక్షణ అత్యంత కీలకమని ఆయన చెప్పారు. వ్యర్థాలను తగ్గించడం, నీటి సంరక్షణ, పర్యావరణానుకూల పద్ధతుల అమలు వంటి చర్యల్లో టీజీపీసీబీ పరిశ్రమలు, సంఘాలు, ప్రభుత్వ సంస్థలతో కలిసి చేస్తున్న కృషి పచ్చటి తెలంగాణ లక్ష్యానికి దోహదం చేస్తోందని వివరించారు. “స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తున్న ఈ సందర్భంలో, పర్యావరణాన్ని కూడా కాపాడటానికి మనం ప్రతిజ్ఞ చేద్దాం” అని పిలుపునిచ్చారు. మండలి సభ్యులు  సత్యనారాయణ, చీఫ్ ఇంజనీర్ బి. రఘు, అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు.