ధనా..ధన్ రఘునందన్ ప్రజా పంపిణీ బియ్యం తో దందా చేస్తే అరదండాలే
ధనా..ధన్ రఘునందన్
ప్రజా పంపిణీ బియ్యం తో దందా చేస్తే అరదండాలేనని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. సోమవారం నాడు మాల్ నుంచి చింతపల్లి వరకు విస్తృత ఆకస్మిక తనిఖీ లు నిర్వహించారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..
కిరాణా దుకాణాలు,రైస్ మిల్లుల ను రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయన్న అనుమానం తో చెక్ చేసినట్టు చెప్పారు.రేషన్ ఎక్కడ దాచి పెట్టినా వెలికి తీసి కేసు నమోదు చేయడం ఖాయం అని
మార్వాడి లకు గట్టి వార్నింగ్ ఇచ్చానన్నారు.రేషన్ బియ్యం దందా చేస్తే అరదండాలే అని హెచ్చరించారు.ఆయా రైస్ మిల్లు ల్లో ఉన్న బియ్యం నిల్వలను చెక్ చేశారు.రైస్ మిల్లు ల్లో ధాన్యం మర పట్టిన వివరాలు పొందుపరచాలని సూచించారు.

Comments
Post a Comment