Posts

ACB వలలో ఇద్దరు అధికారులు

Image
  ACB వలలో ఇద్దరు అధికారులు ACB వలలో మిషన్ భగీరథ , సూర్యాపేట ఉప విభాగం,   సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ సూర్యాపేట, ( గూఢచారి):  20.05.2025న సుమారు 1700 గంటల సమయంలో నిందితుడు ఇస్లవత్ వినోద్, సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ల కార్యాలయం, మిషన్ భగీరథ ఇన్ట్రా, సూర్యాపేట ఉప విభాగం, సూర్యాపేట జిల్లా, అధికారిక అనుకూలత కోసం రూ. 1,00,000/-ను ఫిర్యాదుదారుడి నుండి లంచంగా డిమాండ్ చేసి స్వీకరించాడు "ఎం బుక్స్ను నమోదు చేయడం మరియు ఫిర్యాదుదారుడు మక్తల్ మండలంలో చేసిన పనులకు రూ. 20,00,000/-కి బిల్లులను తయారు చేయడం". నిందిత అధికారి 19.07.2024న సూర్యాపేటకు బదిలీ చేయబడినాడు మరియు ఫిర్యాదుదారుడి పనుల ఎం.బుక్ను తన వద్ద ఉంచుకొని లంచం డిమాండ్ చేశాడు. నిందిత అధికారి యొక్క సూచనల ప్రకారం, ఫిర్యాదుదారుడు కోడాద్ బైపాస్ రోడ్డులో ఫుడ్-కోర్టుకు వెళ్లాడు మరియు నిందిత అధికారి తన కారు నంబర్ TS 29 K 2564తో అక్కడ చేరాడు, అతని బంధువుల కుమారుడు ఇస్లవత్ మూర్తి, 37 సంవత్సరాలు మరియు అతని 3 సంవత్సరాల కుమారుడు ఉన్నారు, అక్కడ ఫిర్యాదుదారుడు నిందిత అధికారి యొక్క కారు లోకి ప్రవేశించాడు మరియు ని...

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా TGPCB సనత్నగర్ & జవహర్ బాలభవన్లో డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు.

Image
  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా TGPCB సనత్నగర్ &  జవహర్ బాలభవన్లో డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు. హైద్రాబాద్,(గూఢచారి): జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవం  ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ సంవత్సరం  'ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం' అనేది ప్రధాన అంశం. మన పర్యావరణం ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం అవకాశాన్ని అందిస్తుంది. ఈ సంవత్సరం కూడా (టీ జి పి సి బీ).ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.. (టీ జి పి సి బీ)21 మే 2025న ఉదయం 10 గంటల నుండి (టీ జి పి సి బీ), జవహర్ బాలభవన్ ఆడిటోరియంలలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల అనే మూడు గ్రూపుల కింద పాఠశాల పిల్లలకు డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలను నిర్వహించింది. 250 మందికి పైగా విద్యార్థులు తమ సృజనాత్మకతను ఉపయోగించి వివిధ చిత్రాలను చిత్రీకరించారు, భూమి, నీరు, గాలి, ప్లాస్టిక్ కాలుష్యం, శక్తి సంరక్షణ, నీటి సంరక్షణ, మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపు, కాలుష్యం నుండి భూమిని రక్షించే అనేక అంశాలపై చిత్రాలను గీశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ...

మీడియా లో వస్తున్న రాజభవన్ లో చోరీ కి సంబంధించి ఏసిపి పంజాగుట్ట ఎస్. మోహన్ కుమార్ వివరణ:

Image
   మీడియా లో వస్తున్న రాజభవన్ లో చోరీ కి సంబంధించి ఏసిపి పంజాగుట్ట ఎస్. మోహన్ కుమార్ వివరణ:  యధాతథంగా చదవండి తేదీ 10/5/2025 నాడు రాజభవన్ లో పనిచేసే ఒక మహిళ ఉద్యోగి తన ఫోటోలను ఎవరో అసభ్యంగా మార్పింగ్ చేసారని, అట్టి మార్ఫింగ్ చేసిన ఫోటోలను శ్రీనివాస్ అనే సహోద్యోగికి పంపించారు, మరియు ఈ విషయం అదే శ్రీనివాస్ అనే సహోద్యోగి ద్వారానే తనకు తెలిసిందనే పిర్యాదు పై కేసు నమోదు చేసి, అట్టి మార్పింగ్ చేసినది ఆ కార్యాలయంలో పనిచేసే ఆమెయొక్క సహోద్యోగి శ్రీనివాస్ ,age:45 years,occ: ఐటీ హార్డ్వేర్, గా గుర్తించి తేదీ 12/05/2025 నాడు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించగా, అతను బెయిల్ పైన బయటకు వచ్చినాడు. అట్టి నేరంలో పాల్పడ్డ ఉద్యోగిని రాజ్ భవన్ వారు చట్ట ప్రకారంగా సస్పెండ్ చేశారు.  అట్టి ఉద్యోగి సస్పెన్శన్ లో ఉండగా, తను పనిచేసే రాజభవన్ కార్యాలయంలోకి వచ్చి తను ఉపయోగించే సిస్టం లో మార్పింగ్ ఫోటోలు ఉన్న హార్డ్ డిస్క్ ను తీసుకుని వెళ్ళిపోయాడు. తేదీ14/05/2025 నాడు రాజ్ భవన్ IT manager గారు ఇచ్చిన పిర్యాదు పై, మరో కేసు నమోదు చేసి సస్పెన్షన్ లో ఉన్న ఆ ఉద్యోగిని విచారించి, అట్టి హార్డిస్క్ రికవరీ...

నల్గొండ బీజేపీ ఆధ్వర్యంలో భారత సైన్యానికి మద్దతుగా తిరంగా యాత్ర

Image
  నల్గొండ బీజేపీ ఆధ్వర్యంలో భారత సైన్యానికి మద్దతుగా  తిరంగా యాత్ర నల్గొండ: (గూఢచారి) : ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో నల్గొండ జిల్లా బిజేపీ పార్టీ అధ్వర్యంలో నాగార్జున కాలేజ్ నుండి నల్గొండ పట్టణంలో ప్రధాన కూడళ్లు గుండా పెద్ద గడియారం సెంటర్ వరకు భారత్ మాతాకి జై అంటూ, వందేమాతరం నినాదాలతో భారీ ఎత్తున తిరంగా యాత్ర నల్గొండ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈ యాత్రను ఉద్దేశించి బీజేపి జిల్లా అధ్యక్షులు నాగం వర్శిత్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్ము కాశ్మీర్ లోని పహల్గాంలో అమాయకులైన హిందువులను మతం పేరుతో విచక్షణ రహితంగా కాల్చి చంపి మహిళల నుదుటన సింధూరం తుడిచివేసే చర్యగా మగవారిని హతమార్చి మీ మోడీకి చెప్పుకోండి అని దుర్మార్గంగా ప్రవర్తించిన తీరుకు చర్యగా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి వందకు పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టిన భారత సైన్యానికి మద్దతుగా దేశ వ్యాప్తంగా చేపట్టిన తిరంగ యాత్రలో భాగంగా నల్గొండలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అని తెలిపారు.. కేవలం నాలుగు రోజుల్లోనే పాకిస్తాన్ ప్రభుత్వం భారత దేశ ప్రభుత్వ కాళ్ళ బేరానికి రావడం మన త్రివిధ దళాల ధైర్య సాహ...

రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే మా సంకల్పం - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Image
 రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే మా సంకల్పం - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఆరోగ్య భద్రత కల్పిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.  మహిళా సంఘాల సభ్యులకు యూనిక్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ కలిగిన ఒక గుర్తింపు కార్డు జారీ చేసే విధానం అమలులోకి తేవాలని అధికారులకు సూచించారు.  ఆరోగ్య, ఆర్థిక పరమైన వివరాలతో కూడిన డేటా బేస్ తయారు చేసి అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని చెప్పారు.  వి హబ్ (We Hub Hyderabad) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి “విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం”ను ప్రారంభించారు. కార్యక్రమం ఆవరణలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.  మహిళా సంఘాలతో కలిసి పనిచేయడానికి సంబంధించి వివిధ సంస్థలకు మధ్య కుదిరిన అవగాహనా ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రి సమక్షంలో మార్చుకున్నారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. “రాష్ట్రంలో మహిళలను ప్రోత్సహించాలి. వారిని ఆర్థికంగా నిలబెట్టాలి. ఆర్థిక క్రమ శిక్షణతో ముందుకు వెళుతున్నార...

నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ అంతా గందరగోళం - జిల్లా కిసాన్ మోర్ఛ అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి

Image
 నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ అంతా గందరగోళం - జిల్లా కిసాన్ మోర్ఛ అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి  నల్గొండ: నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ అంతా గందరగోళంగా తయారు అయ్యిందని మా ప్రతినిధికి తెలుపుతూ రాష్ట్ర జిల్లా ఉన్నత అధికారులు దృష్టి పెట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన కిసాన్ మోర్ఛ అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతు తెచ్చిన ధాన్యం కంటే ట్రక్ షీట్స్ తక్కువ రాసి మిల్లర్లకు లాభం చేకూరుస్తున్నారని, ఒక్క మిల్ కు పోవలసిన ధాన్యం ఇంకో మిల్లు కు పంపుతున్నారని ఆయన విమర్శించారు. క్వింటాలుకు 2 రూపాయలు రైతుల దగ్గర వసూలు చేస్తున్నారనీ, గన్ని బ్యాగ్స్ కు కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికి దూరపు మిల్లులకు టాగ్ చేస్తు ప్రభుత్వానికి నష్టం చేకూర్చడమే కాకుండా, క్వింటాలుకు 5 కిలోలు కన్నా ఎక్కువ కట్ చేసి సెంటర్ నిర్వాహకులు మిల్లర్లు పంచుకుంటూ రైతులకు నష్టం చేస్తున్నారని, అధికారులు ఉద్యోగులు ప్యాడ్ అల్టిమెంట్ కు కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆలాట్ మెంట్ చూస్తే అర్ధం అవుతుందనీ అన్నారు. ప్రతి ట్రక్ చిట...

సరస్వతి నది పుష్కరాలు- 2025 పోస్టర్ విడుదల చేసిన మంత్రి శ్రీమతి కొండా సురేఖ

Image
 సరస్వతి నది పుష్కరాలు- 2025 పోస్టర్ విడుదల చేసిన మంత్రి శ్రీమతి కొండా సురేఖ తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15 నుండి 26- వరకు జరగనున్న సరస్వతి నది పుష్కరాలు కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారిక పోస్టర్ను అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా పర్యవరణ పరిరక్షణ ఆవశక్యతని సూచిస్తూ తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారిక పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ, నదులను పరిరక్షించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు (SUP) నిషేదించడం, బట్టలు ఉతకడం, వ్యర్థాలను సరిగ్గా నిర్వహణ నీటి కాలుష్యం నుండి చర్మ వ్యాధులను నివారించడానికి పరిసరాలను శుభ్రంగా ఉంచడం అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రజా రవాణాను ఉపయోగించడం వల్ల వాహన కాలుష్యం మరియు రద్దీ తగ్గుతుంది అని తెలిపారు. మనం సమిష్టి బాధ్యత తీసుకొని మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పుష్కరాల పవిత్రతను కాపాడుకోవడానికి చేతులు కలపాలని మంత్రి కొండా సురేఖ అన్నారు.