నల్గొండ బీజేపీ ఆధ్వర్యంలో భారత సైన్యానికి మద్దతుగా తిరంగా యాత్ర
నల్గొండ బీజేపీ ఆధ్వర్యంలో భారత సైన్యానికి మద్దతుగా తిరంగా యాత్ర
నల్గొండ: (గూఢచారి) : ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో నల్గొండ జిల్లా బిజేపీ పార్టీ అధ్వర్యంలో నాగార్జున కాలేజ్ నుండి నల్గొండ పట్టణంలో ప్రధాన కూడళ్లు గుండా పెద్ద గడియారం సెంటర్ వరకు భారత్ మాతాకి జై అంటూ, వందేమాతరం నినాదాలతో భారీ ఎత్తున తిరంగా యాత్ర నల్గొండ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ యాత్రను ఉద్దేశించి బీజేపి జిల్లా అధ్యక్షులు నాగం వర్శిత్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్ము కాశ్మీర్ లోని పహల్గాంలో అమాయకులైన హిందువులను మతం పేరుతో విచక్షణ రహితంగా కాల్చి చంపి మహిళల నుదుటన సింధూరం తుడిచివేసే చర్యగా మగవారిని హతమార్చి మీ మోడీకి చెప్పుకోండి అని దుర్మార్గంగా ప్రవర్తించిన తీరుకు చర్యగా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి వందకు పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టిన భారత సైన్యానికి మద్దతుగా దేశ వ్యాప్తంగా చేపట్టిన తిరంగ యాత్రలో భాగంగా నల్గొండలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అని తెలిపారు..
కేవలం నాలుగు రోజుల్లోనే పాకిస్తాన్ ప్రభుత్వం భారత దేశ ప్రభుత్వ కాళ్ళ బేరానికి రావడం మన త్రివిధ దళాల ధైర్య సాహసాలు అని వర్షిత్ రెడ్డి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు, బీజేపీ రాష్ట్ర నాయకులు సాదినేని శ్రీనివాస్ రావు,లాలు నాయక్, కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, పల్లెబోయిన శ్యామ్ సుందర్, బిజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవిగౌడ్,జిల్లా నాయకులు,పట్టణ, మండల నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు..
Comments
Post a Comment