Posts

ఏసీబీకి చెక్కిన కాకతీయ యూనివర్సిటీ ఎస్ఐ

Image
 ఏసీబీకి చెక్కిన కాకతీయ యూనివర్సిటీ ఎస్ఐ హన్మకొండ, గూఢచారి, జనవరి 8: హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శ్రీకాంత్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పేకాట కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోకుండా.. కేసును తేలిక చేసి, అతనికి అనుకూలంగా వ్యవహరించేందుకు ఎస్సై శ్రీకాంత్ రూ. 15వేల నగదును డిమాండ్ చేశారు. బాధితుడిని పదేపదే వేధిస్తూ డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో చేసేదేం లేక సదరు వ్యక్తి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్ని గురువారం బాధితుడి నుంచి ఎస్సై శ్రీకాంత్ 15 వేల లంచం తీసుకుంటున్న సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. కేయూ ఎస్సై శ్రీకాంత్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం జి...

జర్నలిస్టు వద్ద లంచం తీసుకొని ఏసీబీ కి చిక్కిన పంచాయతీ అధికారులు

Image
జర్నలిస్టు వద్ద లంచం తీసుకొని  ఏసీబీ కి చిక్కిన పంచాయతీ అధికారులు గూఢచారి, షాద్నగర్:   ఈదులపల్లి వద్ద నిర్మాణం పనులకు లంచం 2.50 లక్షల లక్ష్యం, లక్షన్నర చెల్లించినా అందని అనుమతులు, ఏసీబీని ఆశ్రయించిన జర్నలిస్ట్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్న జిల్లా ఏసీబీ శాఖ డిఎస్పి ఆనంద్.   *షాద్ నగర్ లో సంచలనం*  సింహం పడుకుంది కదా అని దాని తలను దువ్వెనతో దువ్వాలని చూడకూడదు.. తొక్కుతున్నది తోకే కదా అని పాము జోలికి వెళ్ళకూడదు.. అలాంటిది షాద్ నగర్ లో ఒక దిన పత్రికకు పాత్రికేయుడుగా పనిచేస్తున్న వ్యక్తిని నిర్భయంగా లంచం అడిగి, కాగితాలు ఇవ్వకుండా వేధించి చివరికి ఏసీబీ అధికారులకు బుక్ అయ్యారు.. షాద్ నగర్ నియోజకవర్గంలో నందిగామలో సంచలనం ఇది. జర్నలిస్ట్ దెబ్బకు రంగంలోకి దిగిన ఎసిపి శాఖ డిఎస్పి ఆనంద్ లంచం ఆశించిన నందిగామ ఎంపీడీవో సుమతి, ఎంపీఓ ధీర్ సింగ్, వీఆర్వో చెన్నయ్యలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి లంచావతారాలకు తెరదించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..  *జరిగిన కథ..*  షాద్ నగర్ పరిధిలో ఓ ప్రముఖ దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్న జర్నలిస్టు నందిగామ మండలం ఈదులపల్లి పరిధ...

ACB నెట్ లో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్

Image
ACB నెట్ లో  ఎండోమెంట్ ఇన్స్పెక్టర్  గూఢచారి, హైద్రాబాద్ 7 జనవరి :  07.01.2026న, ఎండోమెంట్ శాఖ కమిషనర్ బొగ్గులకుంట హైదరాబాద్‌లోని 2వ అంతస్తులో ఉన్న ఎండోమెంట్ శాఖ అసిస్టెంట్ కమిషనర్, హైదరాబాద్ తెలంగాణ కార్యాలయం వద్ద నిందితుడైన అధికారి ఆకవరం కిరణ్ కుమార్, ఇన్‌స్పెక్టర్. ఎండోమెంట్ తన కార్యాలయ ప్రాంగణం పక్కన సిటీ రేంజ్-1లోని ACB సిబ్బందికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు, అంటే RC నంబర్ E/944/2021 ప్రకారం, బాగ్ అంబర్‌పేట్‌లోని భూమికి సంబంధించి ఫిర్యాదుదారునికి సర్వే నివేదికను జారీ చేయడానికి, ఫిర్యాదుదారుని నుండి రూ. 1.50,000/- లంచం మొత్తాన్ని చెల్లించమని డిమాండ్ చేసి, లంచం మొత్తాన్ని రూ. 50,000/- చెల్లించమని అతను డిమాండ్ చేశాడు. AO వద్ద నుండి తీసుకున్న కళంకిత లంచం మొత్తం రూ. 50,000/- అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.  అందువల్ల, AO ని అరెస్టు చేసి, గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తి SPE & ACB కేసుల ముందు హాజరుపరుస్తున్నారు . కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచారు .

అందరివాడు' కు ఆత్మీయ సన్మానం*

Image
  *'అందరివాడు' కు  ఆత్మీయ సన్మానం* -ఆర్యవైశ్య మహాసభ వేదికగా సేవా సంకల్పం -టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తికి సత్కారం ఖమ్మం, జనవరి 5 ఖమ్మం గుట్టల బజార్‌ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవ్యాలయం ప్రాంగణంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యవర్గ సమావేశం, అధ్యక్షులు పసుమర్తి చంద్రరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి ఆర్యవైశ్య సమాజానికి చెందిన నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడంతో సభకు విశేష ప్రాధాన్యత లభించింది. ఐక్యతే బలమనే భావన సమావేశమంతా ప్రతిధ్వనించింది. సమావేశంలో ఇటీవల ఎన్నికైన గ్రామపంచాయతీ ఆర్యవైశ్య చైర్మన్లు, వార్డు సభ్యులు, చాంబర్ ఆఫ్ కామర్స్, జూబ్లీ క్లబ్, వివిధ దేవాలయాల పాలకవర్గాలకు ఎన్నికైన ఆర్యవైశ్య ప్రతినిధులను వేదికపై ఘనంగా సత్కరించారు. బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రయోజనాలకంటే సమాజ హితానికే ప్రాధాన్యం ఇవ్వాలని, సమిష్టి కృషితోనే ఆర్యవైశ్య సమాజానికి గౌరవం పెరుగుతుందని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా తెలంగాణ వర్...

మా ఉద్యమంలో సమాజం కలిసి రావాలి.- టి. సంతోష్ చక్రవర్తి, జిల్లా అధ్యక్షులు, టిడబ్ల్యూజేఎఫ్

Image
  *మా ఉద్యమంలో  సమాజం కలిసి రావాలి.- టి. సంతోష్ చక్రవర్తి, జిల్లా అధ్యక్షులు, టిడబ్ల్యూజేఎఫ్ *జర్నలిస్టుల నివాస హక్కు కోసం  ఖమ్మంలో టిడబ్ల్యుజెఎఫ్ మోటార్ సైకిల్ ర్యాలీ..* *జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి బర్త్ డే సందర్భంగా అన్నం సేవ ఫౌండేషన్ లో పండ్లు పంపిణీ.* ఖమ్మం | జనవరి 2 అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల ఇండ్ల సాధన లక్ష్యంగా సమాజం జర్నలిస్టులకు తోడుగా  కలిసి రావాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్– హెచ్ 2843) ఖమ్మం జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి  పిలుపు నిచ్చారు. శుక్రవారం టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి, అన్నం సేవా ఫౌండేషన్ లో అనాధ, అభాగ్యులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ సమాజం జర్నలిస్టులకు తోడుగా నిలబడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేవలం సానుభూతిగా మాత్రమే కాదని, అది సమాజ స్వీయరక్షణ కోసం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో సత్యాన్ని వెలికి తీయడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, పాలకులకు బాధ్యతను గుర్తుచ...

కలెక్టర్ ను కలిసిన జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు బండారు యాదగిరి

Image
  కలెక్టర్ ను కలిసిన జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు బండారు యాదగిరి *అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలి*  సంగారెడ్డి:  ఆంగ్ల నూతన సంవత్సరాది ని పురస్కరించుకొని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టి యు డబ్ల్యూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి గురువారం నాడు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కొత్త సంవత్సరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మరింత స్పూర్తివంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. జిల్లాలో జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు జిల్లా యంత్రాంగానికి సంపూర్ణంగా సహకరిస్తున్నామని అందువల్ల జిల్లా యంత్రాంగం కూడా జర్నలిస్టుల పట్ల అదేవిధంగా సానుకూలంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు ఇటీవల కొత్త అక్రిడిటేషన్ పాలసీ వచ్చిందని దానిలో కూడా అనేక మార్పులు చేయాల్సిందిగా తమ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ జిల్లాకు చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైసల్.  ఆధ్వర్య...

అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ద్రుష్టి పెడతానని ఎంప్లాయిస్ జాయింట్ ఆక్షన్ కమిటీ కి హామీ ఇచ్చిన సీఎం

Image
   అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ద్రుష్టి పెడతానని  ఎంప్లాయిస్ జాయింట్ ఆక్షన్ కమిటీ కి హామీ ఇచ్చిన సీఎం గూఢచారి, హైదరాబాద్ జనవరి 1:     ప్రస్తతం జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ద్రుష్టి పెడతానని హామీ ఇచ్చినట్లు తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ ఆక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ , సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి <A . రేవంత్ రెడ్డి గారిని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపడానికి కల్సిన సందర్భలో ,ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి TGEJAC నాయకత్వం తీసుకురాగా అయన సానుకూలంగా స్పందించారు.       ఈ సంధర్భంగా తెలంగాణ గజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బి. శ్యామ్ ను ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాల నేతలు పరిచయం చేయగా ఆయనను అభినందించడం జరిగింది . అలాగే పదవి విరమణ చేసిన ప్రధాన కార్యదర్శి A . సత్యనారాయణను ముఖ్యమంత్రి శాలువ తో సత్కరించి ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమములో పాల్గొన్నవా...