కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కగేరి


బెంగళూరు: 


కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 


స్పీకర్‌ పదవికి మరెవరూ నామినేషన్‌


బెంగళూరు: 


కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 


స్పీకర్‌ పదవికి మరెవరూ నామినేషన్‌ వేయకపోవడంతో కర్ణాటక విధానసభకు నూతన సభపతిగా విశ్వేశ్వర ఎన్నికైనట్లు స్పీకర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. 


విశ్వేశ్వర వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు పార్టీకి నమ్మకమైన నేతగా ఎదిగారు. 


రాజ్యాంగం, శాసనసభా వ్యవహారాలపై పరిజ్ఞానం, భాషపై పట్టు, అందరితో కలిసే తత్వం ఆయన సొంతం. గతంలో కర్ణాటక విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 


ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆయనవైపు మొగ్గు చూపారు. 


పార్టీ నాపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విలువలతో కూడిన సేవలందిస్తానని ఈ సందర్భంగా విశ్వేశ్వర అభిప్రాయపడ్డారు. 


సిర్సి నియోజవకర్గానికి చెందిన కగెరి మంగళవారం యెడియూరప్ప, పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. 


తొలి మంత్రివర్గంలో దాదాపు 10 నుంచి 12 మందిని చేర్చుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


 


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్