Skip to main content

*బలహీనుడి పక్షాన నిలిచినప్పుడే అమరులకు నిజమైన నివాళి : ఎస్పీ రంగనాధ్*


*బలహీనుడి పక్షాన నిలిచినప్పుడే అమరులకు నిజమైన నివాళి : ఎస్పీ రంగనాధ్*


నల్గొండ : బలహీనుడి పక్షాన నిలిచి వారికి న్యాయం చేసినప్పుడే అమరులకు నిజమైన నివాళి అని నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు.


పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా 12వ బెటాలియన్ పోలీసులు, జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని  జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. అనంతరం క్లాక్ టవర్ వద్ద ఎస్పీ మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా పోలీస్ అమరుల వారోత్సవాలు నిర్వహించు కుంటున్నామని గుర్తు చేశారు. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకుంటూ పేదలు, బలహీనుడి పక్షాన నిలిచి వారికి న్యాయం అందించినప్పుడే అమరవీరులకు నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని అన్నారు. అమరుల త్యాగాల సాక్షిగా పేద ప్రజలకు అండగా ఉంటామని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం న్యాయం పక్షాన నిలబడతామని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. హీరోలు చనిపోవచ్చు కానీ హీరోయిజం చనిపోదని అదే విధంగా అమరుల త్యాగాలు ఎన్నటికీ నిలిచే ఉంటాయని, వారి త్యాగం శాశ్వతని ఎస్పీ అన్నారు.


జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ క్లాక్ టవర్ నుండి తిరిగి జిల్లా పోలీసు కార్యాలయం వరకు నిర్వహించారు.


కార్యక్రమంలో అదనపు ఎస్పీ పద్మనాభ రెడ్డి, 12వ బెటాలియన్ అదనపు కమాండెంట్ వీరయ్య, అసిస్టెంట్ కమాండెంట్లు అంజయ్య, పార్థసారధి రెడ్డి, డిఎస్పీలు గంగారాం, రమణారెడ్డి,  ఆర్.ఐ.లు వెంకన్న, వెంకట రమణ, వై.వి. ప్రతాప్, నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, శంకర్, డిపిఓ ఏ.ఓ. నాగరాజన్, ఆర్.ఎస్.ఐ.లు లియాఖత్, హసన్ అలీ, 12వ బెటాలియన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్