Posts

కళ్యాణదుర్గం చరిత్రలో అతిపెద్ద అవినీతి తిమింగలం..

Image
 కళ్యాణదుర్గం చరిత్రలో అతిపెద్ద అవినీతి తిమింగలం..   ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఐదు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్టర్ నారాయణస్వామి..  సబ్ రిజిస్టర్ కార్యాలయానికి నారాయణ స్వామి తీసుకొని వచ్చి విచారణ జరుపుతున్న ఏసిబీ అధికారులు... ఇంకా భారీ స్థాయిలో జరిగిన అవినీతిపై విచారణ..  జిల్లాలో దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉందని వినికిడి..

TGPCB పై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కమిషన్

Image
 TGPCB పై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కమిషన్  హైద్రాబాద్: గూఢచారి: 25.07.2025. మల్కాజిగిరి, హైదరాబాద్‌లోని 'M/s. మాత కేటరర్స్' అనే అనధికారిక వాణిజ్య కాంటీన్ కార్యకలాపాలు పర్యావరణ కాలుష్యానికి, ఆరోగ్య హానికీ కారణమవుతున్నాయని, పలు మార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చెర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ PVN కాలనీవాసులు దాఖలు చేసిన కేసులో(HRC నెం. 635/2025) తేదీ 08 జులై 2025న గౌరవ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ ఆధ్వర్యంలో) తుది తీర్పు ద్వారా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వం వారికి ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలమేరకు మెంబెర్ సెక్రటరీ, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) వారి స్పందన (చట్టబద్ధ బాధ్యతను నిర్వర్తించకుండ, కేవలం సంబంధిత EE వారి నివేదికను పంపడం)పై, కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. Hyderabad, dt.25.07.2025. Hon'ble Telangana Human Rights Commission (presided by Justice Dr. Shamim Akhtar) has issued directions to the Chief Secretary, Government of Telangana through its final judgment dated 08 July 202...

ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడానికి జర్నలిజం వారధి - సమాచార ప్రత్యేక కమిషనర్ ప్రియాంక

Image
  ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడానికి జర్నలిజం వారధి - సమాచార ప్రత్యేక కమిషనర్ ప్రియాంక  ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడానికి జర్నలిజం వారధి అని, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సమాచార ప్రత్యేక కమిషనర్ ప్రియాంక అన్నారు.  గురువారం నాంపల్లి మీడియా అకాడమీలో రంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జర్నలిస్టుల ప్రయోజనం కోసం అవసరమైన సౌకర్యాలను అందించడంలో మీడియా అకాడమీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని, అకాడమీకి అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని ఆమె అన్నారు. పాత రోజుల్లో వార్తలను అందించే పద్ధతి చాలా కష్టంగా ఉండేదని, కానీ ఇప్పుడు వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వార్తల సమాచారం అందరికీ సెకన్లలో చేరుతుందని ఆమె అన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల మధ్య జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు అందించడంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైనదని ఆమె అన్నారు. ఈ సమాజంలో ఏమి జరిగిందో ప్రజలకు నిజచిగా నిక్కచ్చితంగా, నిజాయితీగా తెలియజేయాలని, మీరు అందించే సమాచారం ఆధారంగానే ప్రజల...

జీహెచ్ఎంసీ టిడిఆర్, బిల్డ్ నౌ విధానాలను ప్రశంసించిన జైపూర్ అభివృద్ధి సంస్థ అధికారులు

Image
జీహెచ్ఎంసీ టిడిఆర్, బిల్డ్ నౌ విధానాలను ప్రశంసించిన జైపూర్ అభివృద్ధి సంస్థ అధికారులు* – హెడ్ ఆఫీస్ లో టిడిఆర్ పాలసీ, ‘బిల్డ్ నౌ’, లేఅవుట్ అనుమతి వ్యవస్థలపై GHMC కమిషనర్ బృంద సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హైదరాబాద్, జూలై 24, 2025: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేస్తున్న టిడిఆర్, బిల్డ్ నౌ విధానాలను జైపూర్ అభివృద్ధి సంస్థ కమిషనర్, అధికారులు ప్రశంసించారు. గురువారం జైపూర్ అభివృద్ధి సంస్థ (JDA) కమిషనర్ ఆనంది నేతృత్వంలోని ప్రణాళిక డైరెక్టర్ ప్రీతి గుప్తా, ఐటీ సలహాదారు ఆర్.కె. శర్మా, అసిస్టెంట్ టౌన్ ప్లానర్ రుషికేష్ కొల్టే, ఐటీ డిప్యూటీ డైరెక్టర్ పంకజ్ శర్మ లతో కూడిన ప్రతినిధి బృందం ట్రాన్స్ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR) పాలసీ, బిల్డ్ నౌ (Build Now) అనే ఏకీకృత భవన మరియు లేఅవుట్ అనుమతి వ్యవస్థ ల అధ్యయనం కోసం GHMC ను సందర్శించారు .  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో బృందానికి అధికారులు స్వాగతం పలికారు.  ప్రధాన కార్యాలయంలో కమిషనర్ శ్రీ ఆర్.వి. కర్ణన్ TDR పాలసీ ,2017 లో ప్రవేశపెట్టిన నూతన టిడిఆర్ పాలసీ ముఖ్యాంశాలు, పాలసీ ప్రయోజనాలు,  భవన, లేఅవుట...

ఏ నిమిషం కూడా జర్నలిస్టులను మర్చిపోను... విస్మరించను- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Image
 ఏ నిమిషం కూడా  జర్నలిస్టులను మర్చిపోను... విస్మరించను- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* - *వచ్చే సోమ, మంగళ వారాల్లో నూతన అక్రిడేషన్ జారీ విధివిధానాలపై చర్చిద్దాం* - *ఇండ్ల స్థలాల జారీ ప్రక్రియ కోర్టు పరిధిలోని అంశం* - *ఎలా చేస్తే జర్నలిస్టులకు మేలు చేకూరుతుందో... న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాం* - *టీయూడబ్ల్యూజే (ఐజేయూ) 4వ జిల్లా మహాసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* *వైరా : ఏ నిమిషం కూడా జర్నలిస్టులను మర్చిపోను... విస్మరించనని... ఇందిరమ్మ ప్రభుత్వ ఏర్పడ్డంలో జర్నలిస్టుల పాత్ర కూడా కీలకమని.... గత 18నెలలుగా ప్రజాపాలన సజావుగా సాగడంలో వారి సహకరం ఉందని... వారి న్యాయపరమైన కోరికలు తీర్చడానికి ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. వైరాలోని శబరి గార్డెన్స్లో గురువారం జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) 4వ జిల్లా మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... రంగ రంగ వైభవంగా వైరా పట్టణంలో ఏర్పాటు చేసుకున్న ఐజేయూ మహాసభకు నేను రావ...

వరద నీరు నిల్వకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సత్వర చర్యలు చేపట్టాలి - జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్

Image
 వరద నీరు నిల్వకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సత్వర చర్యలు చేపట్టాలి - జీహెచ్‌ఎంసీ కమిషనర్  ఆర్..వి. కర్ణన్  *–నగరంలోని వరద ముప్పు ప్రాంతాల్లో కమిషనర్ క్షేత్ర పర్యటన, అధికారులకు సూచనలు* హైదరాబాద్ 23, జులై,2025: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వర్షపు నీరు నిలుస్తూ తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే క్లియర్ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్  ఆర్.వి. కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్  ఆర్.వి. కర్ణన్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్  గజరావు భూపాల్, జోనల్ కమిషనర్ (సెరిలింగంపల్లి జోన్)  భోర్ఖడే హేమంత్ సహదేవరావు,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ , సిబ్బందితో కలిసి సెరిలింగంపల్లి జోన్ లో క్షేత్ర పరిశీలన చేశారు. మెడికవర్ హాస్పిటల్ సమీపంలోని జూబ్లీ ఎన్‌క్లేవ్ కమాన్ వద్ద వరద నీటి డ్రైనేజీని కమిషనర్ పరిశీలించారు. ఆ తర్వాత, శిల్పరామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంట లేక్స్ ఔట్‌లెట్ పాయింట్‌ను సందర్శించారు. తదుపరి, హై-టెక్ సిటీలోని యశోద హాస్పిటల్ రోడ్డుపై స్మైలైన్ డెంటల్ వద్ద నీటి నిల్వ పాయింట్‌ను పరిశీలించారు. స్మైలైన్ డెంటల్...

ఆగస్టు 3న జరిగే వైశ్య రాజకీయ రణభేరి నీ విజయవంతం చేద్దాం: కాచం సత్యనారాయణ గుప్త.

Image
 స్థానిక సంస్థల్లో వైశ్యులకు వాటా తేల్చాల్సిందే  .  ఆగస్టు 3న జరిగే వైశ్య రాజకీయ రణభేరి నీ విజయవంతం చేద్దాం:  కాచం సత్యనారాయణ గుప్త. హైద్రాబాద్, గూఢచారి:  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల వాటా తేల్చాల్సిందేనని, ఆగస్టు 3 వ తేదీన హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వైశ్య రాజకీయ రణభేరి నీ విజయవంతం చేద్దామని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కాచం సత్యనారాయణ గుప్త అన్నారు. మంగళవారం చైతన్యపురిలోని వైశ్య వికాస వేదిక కార్యాలయంలో వైశ్య జర్నలిస్టు లతో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైశ్య వికాస వేదిక స్థాపించి దాదాపు ఏడు సంవత్సరాల అయిందని తెలిపారు. ఏడు సంవత్సరాల కాలంలో ఈ వేదిక ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించమని, కరోనా సమయంలో ఎంతోమంది నిరుపేదలకు నిత్యవసర వస్తువులు అందచేయడం జరిగిందన్నారు. వైశ్య పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో 90 శాతం దాటిన విద్యార్థినీ, విద్యార్థులకు మెమొంటో , సర్టిఫికెట్ , శాలువాతో సన్మానించడం జరిగిందని తెలిపారు.   రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల వాటా తేల్చాలని అన్నారు. వైశ్యు...