Skip to main content

**సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న *తెలంగాణ ఆర్టీసీ కేంద్రం చేతుల్లోకి…?*

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న


*తెలంగాణ ఆర్టీసీ కేంద్రం చేతుల్లోకి…?* 


సీఎం కేసీఆర్ ఎత్తులకు కేంద్రం పై ఎత్తులు వేసిందా…? తెలంగాణ ఆర్టీసీ కేంద్రం పరం కాబోతుందా…? ప్రైవేటు ఆలోచనలో ఉన్న కేసీఆర్‌కు కేంద్రం షాక్ ఇవ్వబోతుందా…? కోర్టులు చేతులెత్తేయటంతో బీజేపీ ఇటు నుండి గేమ్ ప్లాన్ మొదలుపెట్టిందా…?


ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో… 


కేంద్రం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 31శాతం వాటాదారుగా ఉన్న కేంద్రం, మరో 25శాతం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆర్టీసీ పూర్తిగా కేంద్రం పరిధిలోకి వెళ్లబోతుందని, ఇటు ఉద్యోగులను కాపాడటమే కాకుండా… కేసీఆర్‌కు చెక్‌పెట్టవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే రాష్ట్ర బీజేపీ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. ఆర్టీసీలో సీఎం కేసీఆర్ బంధువులు దూరిపోయారని… దాదాపు 45 పెట్రోల్‌ బంకులు అత్యధిక లాభాలు వచ్చే వాటిని సీఎం కేసీఆర్ బంధువు, రాజ్యసభ సభ్యునికి కట్టబెట్టినట్లు తెలుస్తోంది. 


ఇక టీఆర్ఎస్ మాజీ ఎంపీ, సీఎం బంధువు.. అత్యంత సన్నిహితుడైన మరొకరికి చెందిన NETXCELL అనే సంస్థకు కట్టబెట్టేశారు. 2015 నుండి ఈ సంస్థ తమ ఉద్యోగులతోనే టికెట్ల అమ్మకాలు, ప్రయాణికుల సంఖ్య, లాభదాయక రూట్లపై పూర్తి సమాచారం తీసుకుంది. ఇక టీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేల్లో సీఎంతో సన్నిహితంగా ఉండే 12 మంది ఎమ్మెల్యేలకు కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యే బస్టాండ్లను లీజ్‌కు కట్టబెట్టగా…


 కొన్ని చోట్ల ఆర్టీసీ భూములను లీజ్‌కు ఇచ్చినట్లు కేంద్రానికి సాక్ష్యాలతో సహా సమాచారం అందినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ కూడా ఈ అంశాలను బీజేపీ కేంద్ర నాయకత్వానికి, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు పంపించినట్లు ప్రకటించాయి.


అయితే, నష్టాల్లో ఉన్నాయన్న కారణంతో ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తున్నారు. కానీ అక్కడ ఇంత పెద్దఎత్తున ఆర్టీసీకి ఏ రాష్ట్రంలోనూ భూములు, ఆస్తులు లేవు. పైగా కేంద్రం రాబోయే రెండేండ్లలో 90శాతం సబ్సిడీతో బస్సులు రాష్ట్రాలకు ఇస్తోంది. 


పైగా ఎలక్ట్రిక్ బస్సులు కూడా కావటంతో డీజీల్ భారం ఉండదు. ఆక్యూపెన్సీ పెంచటం కోసం ప్రతి గ్రామానికి ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించే అవకాశం ఉంటుంది. ప్రైవేటు పరం అయితే జరిగే బస్‌పాస్‌, వికలాంగులు, మహిళలకు ఇచ్చే రాయితీలు ఉండవు. కానీ కేంద్రమే నడిపితే అవి అలాగే కొనసాగే అవకాశం ఉంటుంది.


మీరు చస్తే చావండి… మాకు ఆర్టీసీ ఆస్తులు మాత్రం కావాలి అన్న చందంగా ప్రభుత్వ వైఖరి ఉందని, ప్రభుత్వంలో విలీనం చేస్తే… మీరు ఇష్టమొచ్చినట్లు చేసుకున్నా ఎవరూ అడగకపోయేవారు కదా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ అనుకూల మీడియాలో కార్మికులపై వ్యతిరేక కథనాలు రాసి ఆత్మహత్యలకు పురిగొల్పేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్