Skip to main content

సమాచార భారతి ఆధ్వర్యంలో వైభవోపేతంగా సోషల్ మీడియా సంగమం


 సమాచార భారతి ఆధ్వర్యంలో వైభవోపేతంగా సోషల్ మీడియా సంగమం 


హైదరాబాద్: సమాచార భారతి ఆధ్వర్యంలో  ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబద్ లోని కేశవ మెమోరియల్ విద్యాసంస్ధల ఆవరణంలో సర్దార్ పటేల్ హాల్ లో సోషల్ మీడియా సంగమం 5వ సంచిక వైభవోపేతంగా జరిగింది. సమాచార భారతి అధ్యక్షులు గోపాల్ రెడ్డి స్వాగతోపన్యాసంలో భారతీయ మూలాలు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సోషల్ మీడియా సంగమం ద్వారా ఏ ఫలితాలు ఆశించామో ఆ దిశగానే ఈ సంచిక కూడా జరుగుతోందని తెలిపారు. మూడు అంశాలు ప్రాతిపదికగా సదస్సులు నిర్వహించారు. ఆత్మ నిర్భరత అంశంపై జి .ఎన్ . రావు, శ్రీమతి కాశీనాథుని శిరీష విలువైన విషయాలు తెలియజేశారు . ప్రాధాన్యత రంగాల్లో ఆత్మ నిర్భరత యొక్క ఆవశ్యకతని  జి .ఎన్ . రావు వివరిస్తూ .. భారతదేశం రక్షణ రంగంలో సాధించిన విషయాలను వివరంగా తెలియజేశారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రంగంలో పరిశోధన చేసిన శ్రీమతి కాశీనాథుని శిరీష మాట్లాడుతూ సోషల్ మీడియాను అవసరమైన అంశాలలో ఎలా ఉపయోగించుకోవాలో , అనవసరమైన సమాచారాన్ని ఎలా నిరసించాలో వివరించారు. నారేటివ్ సదస్సులో  దేవగిరి ప్రాంతంలోని బంజారా కుంభమేళా నిర్వహణ ఏ విధంగా బంజారాలను ఐక్యం చేసిందో భారతీయ  ధార్మిక మూలాలను ఎలా కలిపిందో కల్పేష్ వివరించారు. పాంచజన్య పత్రిక సంపాదకులు హితేష్ మాట్లాడుతూ .. వార్తా కథనాలతో అనేక కోణాల గురించి వివరించారు. తప్పుడు వార్తలను ఎలా ఎదుర్కోవాలో , సరైన వార్తలను ఎలా అర్థం చేసుకోవాలో వివరించారు. మూడవ సదస్సులో రాజగోపాల్ గారు సమాచార భారతి యొక్క వార్త విభాగాలైన vsktelangana.org , నిజం మొదలైన ఇన్ఫర్మేషన్ బేస్ గురించి వివరించారు. ముగింపు సమావేశంలో మాట్లాడిన క్షేత్ర ప్రచార ప్రముఖ్ ఆయుష్ సమాజం ముఖ్యమైన సంస్కృతి స్వరూపమనీ , ప్రపంచం యావత్తు భారతదేశ సంస్కృతి యొక్క గొప్పదనాన్ని గౌరవించిందని, విశ్వ వ్యాప్తమైన ఆలోచనకు భారతీయ జ్ఞానధార తగిన బలాన్ని అందిస్తోందని కనుక విషయాన్నీ గమనించి సోషల్ మీడియాలో తగిన జాగ్రత్తలో  ఉండాలని కోరారు. దాదాపు 200 మందికి పైగా యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తగిన దిశానిర్దేశం పొందారు. ఈ సదస్సును ప్రదీప్,  అమర్నాథ్ రెడ్డి గారు , సురేందర్ గారు నిర్వహించారు. రమేష్ వందన సమర్పణతో ఈ కార్యక్రమాన్ని ముగించారు. 



Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్