Skip to main content

పిసిబి AEE కి 6000 జరిమానా విధించిన రాష్ట్ర సమాచార కమీషన్


పిసిబి AEE కి 6000  జరిమానా విధించిన  రాష్ట్ర  సమాచార కమీషన్


నల్గొండ: గతంలో   కొత్తగూడెంలోనీ కాలుష్య నియంత్రణ మండలి  నందు  సమాచార హక్కు చట్టం  ప్రజా సమాచార అధికారిగా  విధులు  నిర్వర్తించిన  అసిస్టెంట్ ఎన్విరాన్మంటల్ ఇంజనీర్ కు తెలంగాణ రాష్ట్ర  సమాచార కమీషన్. 6000  రూపాయల జరిమానా విధించింది.  ఓ ధరకాస్తు దారుడు సమాచారం కోరుతూ సదరు  అధికారి కి దరఖాస్తు చేశాడు. ఆ దరఖాస్తుకు పూర్తి  సమాచారం ఇవ్వకపోవడం తో   దరఖాస్తు దారుడు  తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఫిర్యాదు చేశాడు.  దీనితో రాష్ట్ర  సమాచార  కమీషన్  సదరు అధికారికి  రెండు సార్లు షో కాజ్ నోటీసు ఇచ్చింది. కేసు విచారణకు వ్యక్తి గతంగా హాజరు కమ్మని  నోటీసు పంపింది. షో కాజ నోటీసు లకు స్పందించకుండా,  కేసు హియరింగ్ కూడ హాజరు కాక పోవడం తో తిరిగి మరో షో కాజు నోటీసు ఇస్తు సెక్షన్ 20 (1) ప్రకారంగా  చర్యలు ఎందుకు తీసుకోకూడదని వ్యక్తి గతంగా హాజరై వ్రాత పూర్వకంగా  సంజాయిషీ  ఇవ్వమని కోరింది.  సదరు అధికారి హాజరై వ్రాతపూర్వకంగా సంజాయిషి ఇచ్చాడు. అయన ఇచ్చిన సంజయిషి కి సంతృప్తి చెందని రాష్ట్ర సమాచార కమీషన్ 6000 రూపాయల జరిమానా విధిస్తూ ఆర్డర్ ఇచ్చింది.   ప్రతి నెల 1000 రూపాయలు ఆ అధికారి  డిసెంబర్ 2022 జీతం నుండి  2023 జనవరి నుండి  డ్రాయింగ్ ఆఫీసర్  6 నెలలు కట్ చేసి సమాచార హక్కు చట్టం  హెడ్స్ కు జమచేయాలని  పేర్కొంది.  ఇప్పుడు ఆ అధికారి నల్గొండ కాలుష్య నియంత్రణ మండలి  అసిస్టెంట్ ఎన్విరాన్మంటల్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం పై  ఆ కార్యాలయ డ్రాయింగ్ ఆఫీసర్ ను వివరాల కొరకు సంప్రదించగా ఆ విషయాలు నాకు తెలియవని అయన వివరణ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్