సూర్యాపేటలో ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మందికిపైగా గాయాలు

 


సూర్యాపేటలో ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మందికిపైగా గాయాలు


దురాజ్‌పల్లిలో ఘటన


ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడిన బస్సు


క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు


సూర్యాపేటలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడిన ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. 


పట్టణ శివారులోని దురాజ్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. 


వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. 


ఈ ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్టు సమాచారం. 


వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*