Skip to main content

**ఆర్టీసీ కార్మికుల సమ్మెను తక్షణమే విరమించాలని సూచించిన తెలంగాణ హైకోర్టు **

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నఆర్టీసీ కార్మికుల సమ్మెను తక్షణమే విరమించాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సమ్మెపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 


పండుగలు, స్కూళ్ల సెలవుల సమయాల్లో సమ్మె చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది. ప్రభుత్వంతో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని సూచించింది. 


ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల మధ్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని అయితే సమ్మె ఎంచుకోవడం సరికాదని అభిప్రాయపడింది. 


తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆర్టీసీ జేఏసీ తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. చాలా కాలంగా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకుండా పోయాయన్నారు. 


సమ్మె అనేది కార్మికుల ఆఖరి అస్త్రమని చెప్పుకొచ్చారు. సమ్మె చేయకపోతే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావని, సమ్మె విరమిస్తే తమ సమస్యలు పరిష్కారం కావని తేల్చి చెప్పారు. 


సమ్మె ఆఖరి అస్త్రం అయితే ఫలితం రాలేదు కదా అని హైకోర్టు నిలదీసింది. సమ్మె చట్ట విరుద్ధమని విరమించాలని సూచించింది. ఒకవేళ ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తే ఎలా అంటూ నిలదీసింది. 


తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని అయితే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం లేదని ఆర్టీసీ జేఏసీ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదని ఆహ్వానిస్తే చర్చలు సఫలమైతే సమ్మెను విరమిస్తామని తెలిపారు. 


అంతేకాదు తమ సమస్యలు తెలిపేందుకు ఆర్టీసీ సంస్థకు పూర్తి స్థాయి ఎండీ లేదరని చెప్పుకొచ్చారు. అందువల్లే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ఎవరికి చెప్పుకోవాలో తెలపాలని జేఏసీ తరపు న్యాయవాది ప్రశ్నించారు. 


ఈ సందర్భంగా ఆర్టీసీకి ఎండీని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని తెలిపారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 


సమ్మె విరమించి ఇకనైనా చర్చలకు వెళ్లాలని ప్రజల పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది హైకోర్టు. ఇరువాదనలు విన్న హైకోర్టు విచారణను ఈనెల 18కు విచారణను వాయిదా వేసింది.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్