Skip to main content

కమల కదనంతో గులాబీ తోటలో ప్రకంపనలు.., ఆనాడు కొలువుల కోసం ఉద్యమం.. నేడు హక్కుల సాధనకు పోరాటం.. 


ఆనాడు కొలువుల కోసం ఉద్యమం.. నేడు హక్కుల సాధనకు పోరాటం.. 



ఆర్టీసీ కార్మికులపై అణచివేతతో ఆగిన రథచక్రాలు.. సమ్మె సైరన్ తో స్తంభించిన కార్యకలాపాలు.. నియంత పోకడతో కేసీఆర్ సర్కార్ విచ్చుకత్తి.. ఉద్యమ ద్రోహుల రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఆగిన కార్మికుల జీవిత చక్రం. కార్మికుల పక్షాన నిలిచిన కమలదళం.. రాక్షసపాలనకు వ్యతిరేకంగా పోరు సాగిస్తున్న లక్ష్మణ సైన్యం. కమల కదనంతో గులాబీ తోటలో ప్రకంపనలు.. ఆగిన బస్సు చక్రాలతో కారు టైర్ పంక్చర్.. కమలసేన ఎంట్రీతో కేసీఆర్ గుండెల్లో వణుకు.. ఇదీ 'సమ్మె'ట దెబ్బ.


చట్టబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆగిన ప్రగతి రథ చక్రాలు.. వారి సమస్యల పరిష్కారం కోసం సైరన్ మోగించిన ఆర్టీసీ కార్మికులు.. సీఎం కేసీఆర్ నిరంకుశ వైఖరితో విసుగుచెందిన కార్మిక సంఘాలు. సాదాసీదాగా ప్రారంభమైన సమ్మెపై నియంత కేసీఆర్ సర్కార్ మొండివైఖరి ప్రదర్శించి ఉక్కుపాదం మోపింది. హక్కుల సాధన కోసం పోరు సాగిస్తున్న వారిపై దమనకాండ సాగించింది. సమ్మెను నీరుగార్చేందకు సర్వశక్తులూ ఒడ్డింది. ఉద్యమానికి దిగిన ఆర్టీసీ ఉద్యోగులకు డెడ్ లైన్ పెట్టి.. నిరంకుశంగా, రాజ్యాంగ విరుద్ధంగా సెల్ఫ్ డిస్మిస్ అంటూ కొలువుల నుంచి తీసేసింది. ఆఖరుకు ఆర్టీసీ కార్మికులకు వైద్యాన్ని కూడా నిలిపివేయడంతో పరిణామాలు తీవ్రంగా మారాయి. పుండుమీద కారం చల్లినట్లు ఉద్యమంలో లేని మంత్రులు.. ఆర్టీసీ సమ్మెపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఆవేదన చెందారు కార్మికులు. దీంతో అగ్నిజ్వాలలను అలుముకుని ఆత్మబలిదానం చేసుకున్నారు.


కేసీఆర్ ప్రభుత్వం దమనకాండతో అప్పుడే అలసిసొలసిన కార్మికుల చక్రాల వేగం పెంచేందుకు కమలనాథులు కదనరంగంలోకి దూకారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీజేపీ పూర్తి స్థాయిలో పోరాటం ప్రారంభించింది. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ పై పోరు ఉధృతం చేసింది. డ్రైవర్, కండక్టర్ అన్నలకు తెలంగాణ బీజేపీ నేతలు బాసటగా నిలిచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిరసనలు, బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికీ పోరు అంటూ లక్ష్మణ్ కన్నెర్రజేశారు. కేసీఆర్ అగ్గితో తలగోక్కొని.. ఒళ్లు కాల్చుకునే పరిస్థితి తెచ్చుకున్నారని చురకలు అంటించారు. టీచర్లు, రెవెన్యూ ఉద్యోగులు, ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగు లు అందర్నీ అణచివేసేందుకు జరుపుతున్న రాష్ట్ర సర్కారు కుట్రలను ప్రజలకు వివరించారు. అటు యాబైవేల మంది ఆర్టీసీ కుటుంబాలకు అండగా నిలిచింది కమలం పార్టీ.


బస్ భవన్ ముందు ఆందోళన కార్యక్రమంతో కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ . దీంతో గులాబీ తోటలో కమలం సెగలు రాజుకున్నాయి. నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ.. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీ.. ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి అండగా నిలిచింది. సకల జనుల సమ్మె తరహాలో నిరసనలు, ఆందోళనలు చేపట్టి కార్మికుల వాణిని వినిపించేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తోంది. 


ఆర్టీసీ భూముల కబ్జాపర్వంను వెలుగులోకి తెచ్చి.. కేసీఆర్ సర్కారుకు గుబులు పుట్టించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్. కార్మికుల బలిదానాలకు కారణమైన టీఆర్ఎస్ మంత్రుల వైఖరిని ఎండగట్టారు. తెలంగాణలో రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు.. ప్రజల పక్షాన నిలిచారు. ఆర్టీసీ సమ్మెపై దురహంకార పోకడ పోతున్న సీఎం కేసీఆర్ ఆగడాలను ప్రశ్నిస్తూ, ఆర్టీసీ భూములను కేసీఆర్.. తనవారికి అప్పనంగా కట్టబెట్టుకున్న తీరుపై  గవర్నర్ తమిళిసైకి ఎప్పటికప్పుడు రిపోర్ట్ అందజేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలను గవర్నర్ వద్దకు తీసుకెళ్లి తమ వాదన వినిపించే అవకాశం కల్పించారు. బిజెపి నేతలు కూడా గవర్నర్ కు ప్రత్యేకంగా వినతి పత్రం ఇచ్చారు. 
తెలంగాణలో బీజేపీ సేనాని లక్ష్మణ గర్జనతో కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి.. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ అనేలా చేశారు. తెలంగాణలో రక్కసి పాలనను గాడిలో పెట్టడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ సైతం సమాయత్తమైంది. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికులకు కొండంత ధైర్యాన్నిచ్చి అండా నిలిచింది. మొత్తానికి తెలంగాణలో నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు బీజేపీ ప్రజాపక్షాన పోరు కొనసాగిస్తోంది.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్