Skip to main content

విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో లోని అధికారులు సమన్వయంతో నివారణ చర్యలు తీసుకోవాలి


నల్గొండ, ఆక్టోబర్ 30.జిల్లాలో విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నప్పుడు జిల్లా లోని వివిధ శాఖల అధికారులు సమన్వయం,సహకారంతో విపత్తు,ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని విపత్తుల నివారణ నిపుణులు డా.కె.ఆర్.కె శాస్త్రి  అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో విపత్తుల నిర్వహణ పై వివిధ శాఖల అధికారులకు నిర్వహించిన ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో ఆయన వివిధ విపత్తులు, ముందు జాగ్రత్త చర్యలు,విపత్తు నివారణ,పునరావాసం,విపత్తు లు తగ్గించేందుకు ,విపత్తు తర్వాత చేపట్ట వలిసిన చర్యలు,జిల్లా విపత్తుల నిర్వహణ ప్రణాళిక పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూలంకషంగా వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ విపత్తుల నివారణ అథారిటీ,జిల్లా విపత్తుల నివారణ ప్రణాళిక రూపకల్పన అంశాలపై వివరించారు. విపత్తులు ,ప్రకృతి వైపరీత్యాలు,వరదలు, తుపాన్ లు సంభవించి నప్పుడు పొంచి ఉన్న ప్రమాదం,ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు, పునరావాస చర్యలు, విపత్తు తర్వాత చేపట్టవలసిన చర్యలు,నష్ట తీవ్రత ఇతర అంశాలు,వివిధ శాఖలు నిర్వహించ వలసిన చేపట్ట వలసిన చర్యలు శిక్షణ నిచ్చారు.జిల్లాలో జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ కి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా,జిల్లా పరిషత్ సి.ఈ. ఓ.వైస్ చైర్మన్ గా,ఎస్.పి.,జె.సి.,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి,ఇతర అధికారులు సభ్యులు గా ఉంటారని అన్నారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,సాగు నీటి శాఖ, రెవెన్యూశాఖ ముఖ్యమైన పాత్ర పోషించ వలసి ఉంటుందని అన్నారు.ముఖ్యంగా ఇటీవల కేరళలో సంభవించిన వరదల లో సోషల్ మీడియా ను ప్రభావిత ప్రాంతాలు, బాధితులు గురించి తేలుసు కోవడానికి ,సమాచారంపంచుకోవడానికి,సమన్వయం, ఆహార పంపిణీ,ఇతర విషయాలకు ప్లాట్ పామ్ గా ఉపయోగించుకున్నారని తెలిపారు. 
జిల్లా రెవెన్యూ అధికారి  రవీంద్రనాథ్ మాట్లాడుతూ జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక వివిధ శాఖల నుండి తగిన సమాచారంతో రూపొందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ,ఆంధ్ర స్టేట్ సోషల్ సర్వీస్ ఫోరమ్ యం. సుధాకర్ డేవిడ్ జిల్లా అగ్నిమాపక ఆధికారి  యజ్ఞ నారాయణ,జిల్లా పౌర సంబంధాల అధికారి పి. శ్రీనివాస్,జిల్లా విద్యా శాఖ ఆధికారి బిక్షపతి, జిల్లా మత్స్య శాఖ అధికారిణి చరిత,జిల్లా గ్రామీణ నీటి పారుదల శాఖ ఈ ఈ పాపా రావు ,ఆరోగ్య విస్తరణ అధికారి సయ్యద్ రఫీ అహ్మద్ ,ప్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుబాష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్