Skip to main content

**ప్రమాదాల నివారణలో ప్రజలు తమతో బాగస్వామ్యులు కావాలి : ఎస్పీ రంగనాధ్**


*ప్రమాదాల నివారణలో ప్రజలు తమతో బాగస్వామ్యులు కావాలి : ఎస్పీ రంగనాధ్*


- - చెర్వుగట్టు వద్ద మూసివేసిన వ్యాపారస్థుల విజ్ఞప్తి మేరకు తిరిగి తెరుస్తామని హామీ
- - వ్యాపారస్థుల ఇబ్బందులను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి


నల్గొండ : కార్తీకమాసం దృష్ట్యా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రజలు, వ్యాపారస్థులు భాగస్వామ్యం వహించాలని అప్పుడే సత్ఫలితాలు సాధ్యమని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు.


బుధవారం నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న క్రమంలో మూసివేసిన రోడ్డును తిరిగి తెరవాలని వ్యాపారస్తులు జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ద్వారా జిల్లా ఎస్పీ రంగనాధ్ దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం చెర్వుగట్టును సందర్శించిన ఎస్పీతో వ్యాపారస్తులు మాట్లాడుతూ కార్తీకమాసం దృష్ట్యా చెర్వుగట్టు క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని రోడ్డును మూసివేయడం వల్ల తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని తమ కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని వారు ఎస్పీకి విన్నవించారు. రోడ్డును తెరిచేందుకు తమకు అభ్యంతరం లేదని అయితే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందువల్లే రోడ్డును మూసివేయడం జరిగిందని, ప్రజలు, వ్యాపారస్తులు తమతో సహకరించి ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం వహించాలని ఆయన కోరారు. వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేయడం తమ ఉద్దేశ్యం కాదని, ప్రమాదాలలో ప్రయాణికుల ప్రాణాలు కాపాడడం, గాయాల బారిన పడకుండా చేసేందుకే రోడ్డును మూసివేశామని ఆయన వారితో చెప్పారు. ప్రమాదాలు జరగకుండా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అయితే తాము తీసుకునే చర్యల వల్ల సత్ఫలితాలు రావాలంటే అందరి భాగస్వామ్యం అవసరమని అన్నారు.


వ్యాపారస్తులు విజ్ఞప్తి మేరకు, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి వారి సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని అందరి అభ్యర్ధన మేరకు మూసివేసిన రోడ్డును తిరిగి తెరుస్తామని ఎస్పీ వ్యాపారస్తులకు హామీ ఇచ్చారు.


అనంతరం రోడ్డు పరిస్థితి, మూసివేసిన రోడ్డు ప్రాంతాన్ని ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ నరేందర్ రెడ్డి, వ్యాపారస్తులతో కలిసి పరిశీలించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు ఎస్పీని కలిశారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్