ఆత్మహత్య చేసుకున్న మరో ఆర్టీసీ కార్మికుడు

ఆత్మహత్య చేసుకున్న మరో ఆర్టీసీ కార్మికుడు


మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కార్వాన్‌ ప్రాంతంలో నివసించే సురేందర్‌ గౌడ్‌, రాణిగంజ్‌ డిపోలో గత 15 సంవత్సరాలుగా కండక్టరుగా పనిచేస్తున్నాడు. తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఉద్యోగం పోయిందన్న మనస్తాపంతో సురేందర్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు.  


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ