సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి


సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి



అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని అగ్ర కథానాయకుడు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన చిరంజీవి.. సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పారు. జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్‌ భారతి కూడా అక్కడే ఉన్నారు. తాను కథానాయకుడిగా నటించిన 'సైరా:నరసింహారెడ్డి' చిత్రాన్ని వీక్షించాల్సిందిగా జగన్‌ను కోరారు. అనంతరం ఇరువురు కలిసి భోజనం చేశారు. చిరు ఇటీవల తెలంగాణ గవర్నర్‌ తమిళసైను కూడా కలిసి 'సైరా' చూడాల్సిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*