Skip to main content

**మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తులకు జైలు శిక్ష, 16,500 జరిమానా**


*మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తులకు జైలు శిక్ష, 16,500 జరిమానా*


నల్గొండ : మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తులపై ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించడంతో పాటు మోతాదుకు మించి సేవించిన వారిని కోర్టులో హాజరుపరిచాడు. సోమవారం ట్రాఫిక్ సి.ఐ. సురేష్ బాబు, ఎస్.ఐ. కొండల్ రెడ్డిల ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాలలో బ్రీత్ ఎనలైజర్లతో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి పరీక్షలు నిర్వహించారు. పోలీసుల తనిఖీలో భాగంగా మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన నల్గొండ పట్టణానికి చెందిన సైదులు, కట్టంగూరు మండలం బొల్లేపల్లికి చెందిన జి..కృష్ణయ్య లకు రెండు రోజుల జైలు శిక్షతో పాటు 2000 రూపాయల జరిమానా, నల్గొండ పట్టణం బొట్టుగూడకు చెందిన ఎం.డి.లతీఫ్ కు ఒక రోజు జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ సురేష్ తెలిపారు. అదే విధంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన మరో ఎనిమిది వ్యక్తులకు 10,500 రూపాయల జరిమానా విధించారని మొత్తం 16,500 జరిమానా విధించునట్లు ఆయన తెలిపారు. మొత్తం 14 కేసులకు గాను 11 మందికి జరిమానాలు విధించగా, ముగ్గురికి జైలు శిక్షతో పాటు జరిమానాలు విధించారని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానా, జైలు శిక్షలు తప్పవని ట్రాఫిక్ సిఐ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజలు, వాహనదారులలో అవగాహన కల్పించడం లక్ష్యంగా కృషి చేస్తున్నామని, ప్రజలంతా పోలీసులతో సహకరించాలని ఆయన కోరారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్