Skip to main content

**డిసెంబ‌రు రెండో వారం నుండి అందుబాటులోకి తితిదే డైరీలు, క్యాలెండ‌ర్లు **


డిసెంబ‌రు రెండో వారం నుండి అందుబాటులోకి తితిదే డైరీలు, క్యాలెండ‌ర్లు 



* తితిదే స‌మాచార కేంద్రాలు, క‌ల్యాణ‌మండ‌పాల్లో విక్ర‌యాలు
తిరుప‌తి: టిటిడి రూపొందించిన 2020 క్యాలెండ‌ర్ల‌ను టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ శుక్ర‌వారం తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూ.100 విలువ‌గ‌ల 12 పేజీల క్యాలెండర్లు 12 లక్షలు, రూ.15 విలువ‌గ‌ల శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.50 లక్షలు, రూ.15 విలువ‌గ‌ల శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, రూ.10 విలువ‌గ‌ల శ్రీవారు మ‌రియు శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, అదేవిధంగా రూ.20 విలువ‌గ‌ల తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2 లక్షలు, రూ.60 విలువ‌గ‌ల టేబుల్ టాప్ క్యాలెండ‌ర్లు 75 వేలు ముద్రించామ‌ని వివ‌రించారు. వీటితో పాటు రూ.130 విలువ‌గ‌ల పెద్ద‌ డైరీలు 6 లక్షలు, రూ.100 విలువ గ‌ల చిన్నడైరీలు 1.50 లక్షలు ఉన్నాయ‌ని తెలిపారు. డిసెంబరు మొదటి వారం నుండి తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్త‌క విక్ర‌య‌శాల‌లు, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌, న్యూఢిల్లీ, ముంబయిలోని టిటిడి సమాచార కేంద్రాల్లో, టిటిడి కల్యాణ మండపాల్లో క్యాలెండ‌ర్లు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు. డిసెంబరు రెండో వారం నుండి డైరీలను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు. కార్య‌క్ర‌మంలో జెఈవో పి.బ‌సంత్‌కుమార్‌, టిటిడి బోర్డు స‌భ్యులు మోరంశెట్టి రాములు, శివ‌కుమార్‌, ప్ర‌త్యేక ఆహ్వానితులు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, గోవింద‌హ‌రి, ప్రెస్ డెప్యూటీ ఈవో విజ‌య‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్