ఢిల్లీ: భాజపాలో చేరిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే , రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు,మరియు ఓ.వి.రమణ,మాజీ టిటిడి మెంబెర్,ప్రధాన కార్యదర్శి థర్డ్ ఫ్రంట్, కౌశల్, సినీ ఆర్టిస్ట్,బిగ్ బొస్స్ 2 విన్నర్, ఆయన భార్య నీలిమ, మరియు డా.సభారి .ఎం.డి,ప్రముఖ రేడియోలాజిస్ట్. బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె, మరియు గోపాగాని సులోచన యాదవ్ అనగాని, రైల్వే కోడూరు వైఎస్సార్సీపీ ఇంచార్జి వీరు ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భాజపా ప్రధాన కార్యాలయం ఢిల్లీలో భాజపాలో చేరారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్తో రాష్ట్ర సహా ఇంచార్జి సునీల్ దేమోదర్, జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ మరియు రాష్ట్ర ముఖ్య నేతలు తురగా నాగభూషణం, రాష్ట్ర కార్యదర్సులు అడపా శివంగేంద్రరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్, ఐ హబ్ కన్వీనర్ కానూరి బాలకృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మోడీ సంక్షేమ పథకాలు పట్ల మరియు దేశ భద్రతా ప్రపంచంలో భారత్ను అగ్రగామిగా నిలిపిన ఎలా అనేక విషయాల్లో పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అందరికి భాజపా స్వాగతం పలుకుతుంది అని అన్నారు.

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment