బిల్లులు లేకుండా భారీగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబయి నుంచి విజయవాడకు రూ.3.18కోట్ల విలువైన 8.86 కిలోల బంగారం తరలిస్తుండగా ఇబ్రహీంపట్నం వద్ద వారిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముంబయిలోని అంధేరికి చెందిన జయేష్ జైన్.. విజయవాడలోని ఇస్లాంపేటకు చెందిన పాగోలు శ్రీనివాసరావు ముంబయి నుంచి బంగారు ఆభరణాలు తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. వారిని విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. బిల్లులు లేకుండా బంగారాన్ని తరలిస్తున్న పోలీసు అధికారులను విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు అభినందించారు.

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment