అనంతపురం: హెడ్మాస్టర్ దాష్టీకం...
విద్యార్థుల కాళ్లు కట్టేసి..
స్కూల్లో అల్లరి చేస్తున్నారన్న కారణంతో ఇద్దరు చిన్నారుల పట్ల హెడ్ మాస్టర్ అమానుషంగా ప్రవర్తించాడు. చిన్నారులను క్లాస్రూమ్లో బెంచీలకు కట్టేశాడు.
అనంతపురంలో ఓ స్కూల్ హెడ్ మాస్టర్ రెచ్చిపోయాడు. విద్యార్థుల కాళ్లు, చేతులు కట్టేసి చిత్ర హింసలు పెట్టాడు. కదిరి పట్టణలోని మశానంపేట స్కూల్లో ఈ ఘటన జరిగింది. స్కూల్లో అల్లరి చేస్తున్నారన్న కారణంతో ఇద్దరు చిన్నారుల పట్ల హెడ్ మాస్టర్ అమానుషంగా ప్రవర్తించాడు. చిన్నారులను క్లాస్రూమ్లో బెంచీలకు కట్టేశాడు. మళ్లీ అల్లరి చేయబోమని.. వదిలేయమని వేడుకున్నా ఆ టీచర్ వినలేదు. తోటి విద్యార్థుల ద్వారా విషయం బయటకు తెలియడంతో తల్లిదండ్రులు స్కూల్కు వెళ్లి హెడ్మాస్టర్తో వాగ్వాదానికి దిగారు. అతడి తీరుపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశాయి. ఆయన్ను విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment