**కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న దైద శివాలయం ఈవో అనిత**

కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న దైద శివాలయం ఈవో అనిత



పొందుగల వద్ద కృష్ణానదిలో దూకిన అనిత
ఇటీవలే అనితపై అవినీతి ఆరోపణలు
భర్తతోనూ విభేదాలు!


గుంటూరు జిల్లా పొందుగల వద్ద విషాదం చోటుచేసుకుంది. దైద శివాలయం ఈవో అనిత పొందుగల వద్ద కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తొలుత స్థానికులు ఆమెను గుర్తుతెలియని వ్యక్తిగా భావించారు. అనంతరం పోలీసుల రాకతో ఆమె శివాలయం ఈవో అని తెలిసింది. ఇటీవలే అనితపై అవినీతి ఆరోపణలు రాగా అధికారులు సస్పెండ్ చేసినట్టు వెల్లడైంది. అటు, వైవాహిక జీవితంలోనూ కలతలు రావడంతో కొన్నినెలలుగా ఆమె భర్త నుంచి దూరంగా ఉంటున్నట్టు చెబుతున్నారు. అయితే అనిత ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఇవేనా, లేక మరేదైనా కోణం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్