Skip to main content

**త్రాగునీటి పనులలో అలసత్వం వలదు అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి మందలింపు **


త్రాగునీటి పనులలో అలసత్వం వలదు
అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి మందలింపు 
#ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకం కార్యక్రమం ఇది 
#నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై పైప్ లైన్లు వేస్తే చర్యలు కఠినం 
#భగీరథ పనుల పూర్తికి 100 రోజుల ప్రణాళిక 
#డిసెంబర్ 25 నాటికి ఓ హెచ్ యస్ ఆర్ లు పూర్తి కావాలి 
#2,277 కోట్లకు గాను 1,564 కోట్లు గ్రిడ్ పనులకు వ్యయం 
#ఇంట్రా పనులకు 590.57 కోట్లు 
#యం.యస్ పైప్ లైన్ 90.90 కిలోమీటర్లు పూర్తి 
#హెచ్.డి.పి.ఈ 2247 కిలో మీటర్లు, డి ఐ 928.22కిలో మీటర్ల పూర్తి 
#1534 కు గాను 1433 ఓ హెచ్ యస్ ఆర్ ట్యాన్క్ లు పూర్తి 
#4214.17 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ పూర్తి 
#పట్టణప్రాంతాలతో కలుపుకుని 1710 అవాస ప్రాంతాల్లో ఇంట్రా పూర్తి 
#13,18,945 జనాభా కు గాను 3,81,372 ఇండ్ల గుర్తింపు 


త్రాగునీటి పనులలో అలసత్వం వలదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నిర్ణిత గడువు తేదీ లోపే మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 
ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులలో జరుగుతున్న జాప్యం పై ఆయన అధికారులను నిలదీశారు.
మిషన్ భగీరథ, నీటిపారుదల, ఎన్ యస్ పి ,కాళేశ్వరం, డిండి ఎత్తిపోతల పథకం, బ్రాహ్మణవెళ్ళేం ల ప్రాజెక్ట్ ల పై సోమవారం సాయంత్రం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. 
శాసనసభ్యులు గాధారి కిశోర్ కుమార్,కంచర్ల భూపాల్ రెడ్డి,చిరుమర్తి లింగయ్య, భాస్కర్ రావు లతో పాటు రవీంద్ర నాయక్ ,నోముల నర్సిమయ్య ఇంచార్జ్ కలెక్టర్ వి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామాల వారీగా అటు గ్రిడ్ ఇటు ఇంట్రా పనులను సమీక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఏ ఆడపడుచు నీటి కోసం బారులు నడిచి పోకుండా ఉండేందుకు గాను ఇంటింటికీ నల్లా పేరుతో చేపట్టిన బృహత్ ప్రణాళిక మిషన్ భగీరథ పధకం అన్నారు .అటువంటి పధకం అమలు కోసం ఒక్క నల్గొండ జిల్లాలోనే గ్రిడ్ పనుల కోసం గ్రిడ్ ఇంట్రా పనులకు కలిపి 2,867.57 కోట్లు ఖర్చు పెడుతున్నప్పటికి పనులు పూర్తి చెయ్యడం లో జరుగుతున్న జాప్యం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.డిసెంబర్ 25 నాటికి ఓ హెచ్ యస్ ఆర్ లు పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దేవరకొండ నియోజకవర్గంలో ఎక్కడ కూడ పనులు పూర్తి కాలేదని శాసనసభ్యులు రవీంద్ర నాయక్ అధికారుల మీద మండిపడ్డారు.
నల్గొండలో ఆర్ డబ్ల్యూ యస్ పబ్లిక్ హెల్త్ శాఖ లకు సమన్వయం లోపించడం పై స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకరాగా మంత్రి జగదీష్ రెడ్డి ఆర్ డబ్ల్యూ యస్ అధికారులను తీవ్రంగా మందలించారు. రోడ్ల ను తవ్వి ద్వంసం చేస్తే కాంట్రాక్టర్లు పై చర్యలు కఠినంగా తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మిర్యాలగూడ శాసనసభ్యులు భాస్కర్ రావు మాట్లాడుతూ ఏజెన్సీ కాగితాలమీదనే పనులు చూపిస్తున్నారని క్షేత్రస్థాయిలో అందుకు బిన్నంగా పనులు జరుగుతున్నాయన్నారు.తుంగతుర్తి శాసనసభ్యులు గాధారి కిశోర్ కుమార్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాన్ని వివరించాలన్నారు.అందుకు స్పందించిన అధికారులు మిషన్ భగీరథ పనులను పూర్తి చేసేందుకే ఆర్ డబ్ల్యూ యస్ 100 రోజుల ప్రణాళిక రూపొందించుకుందన్నారు.ఇప్పటికే  1564.06 కోట్లు ఖర్చుతో నల్లగొండ జిల్లాలో మూడు సెగ్మెంట్ లలో 2,247 కిలోమీటర్లు హెచ్ డి పి ఈ పైప్ లైన్ 928.22 కిలో మీటర్లు డి ఐ పైప్ లైన్ 90.90 కిలోమీటర్లు యం యస్ గ్రిడ్ పైప్ లైన్  పనులుపూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. అంతే గాకుండా ఇంట్రా విలేజీ పనులలో మొదట గుర్తించిన 1534 ఓ హెచ్ యస్ ఆర్ లకు గాను 1433 పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు.మిగిలిన ట్యాన్క్ ల నిర్మాణాలు డిసెంబర్ మాసంతానికి పూర్తి చేయనున్నట్లు అధికారులు మంత్రి జగదీష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం గా వివరించారు. మొత్తం 31 మండలాలకు గాను 13 లక్షల 18 వేల 945 మంది జనాభా కు గాను 3,81,372 గృహాలకు నీటి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంతే గాకుండా 4214.57 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ పనులకు గాను 4090.30 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్