Skip to main content

** ' రాజ్యాంగ దినోత్సవం ' & ' వరకట్న నిషేద దినోత్సవం '**

 ' రాజ్యాంగ దినోత్సవం ' & ' వరకట్న నిషేద దినోత్సవం ' సందర్బముగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, నల్లగొండ మరియు విధ్యాశాఖ ఆద్వర్యములో    1. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో  మంగళవారం ఉ. 9.00 గం.లకు  న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యాక్రమంలొ ఉమ్మడి నల్లగొండ  జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.వేణు మాట్లాడుతూ    రాజ్యాంగ బద్దుడే నిజమైన పౌరుడని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అనుభవించటమే కాదు, విధులు పాటించాలని, లౌకిక రాజ్యంలొ రాజ్యాంగం ఆపాదించిన హక్కులతొ భారతదేశం స్వేచ్చా, సౌభాతృత్వముతొ వెలుగుందుతుందని, చట్టం ముందు అందరం సమానులమేనని తెలిపారు. నేటి సమాజంలొ అందరూ అక్షరాస్యతతొ, ఆధునిక విజ్ఞానాన్ని ఆపాదించుకొని సంఘ పరిస్థితులను తెలుసుకుంటూ జీవనం సాగిస్తున్న మానవజీవితంలొ ఇంకా వరకట్నం కోసం ఆశ పడుతున్న  జనాలు  సభ్య సమాజంలొ ఉన్నారని , చట్టాలున్నా మనుషులు మారటం లేదని తెలుపుతూ రాజ్యాంగ ప్రవేశిక విధ్యార్థులతో చదివించారు. నల్లగొండ అదనపు ఎస్.పి. నర్మద మాట్లాడుతూ విధ్యార్థినులు రాజ్యాంగాన్ని చదివి అవగతం చేసుకోవాలని , ప్రాధమిక విధులు నిర్వర్తించాలని తెలుపుతూ, వరకట్నము రూపు మాపాలని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ మునవర్ మాట్లాడుతూ శాస్త్రీయ విధ్యతో పాటు , చట్టాలు,  సంఘం పట్ల అవగాహన ఏర్పర్చుకోవాలని తెలిపారు. షీ టీం ఇంచార్జ్ సి.ఐ. రాజశేఖర్ మాట్లాడుతూ వైవాహిక వివాదాలు ఎక్కువ అవుతున్నాయని , బాలికలు అప్రమత్తముగా ఉండాలని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్ విధ్యాధికారి బాలునాయక్ మాట్లాడుతూ రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులు కల్పించిందని, హక్కులతో పాటు విధులూ నిర్వర్తించాలని తెలిపారు. జాగృతి టీం పాటలతో బాలికలను జాగృతం చేశారు. కార్యాక్రమములో సఖి కేంద్రం సెంట్రల్ అడ్మిన్ నళిని,  న్యాయవాదులు యం. లెనిన్ బాబు, భీమార్జున రెడ్డి, జిల్లా న్యాయ సేవ సంస్థ సభ్యులు కె.వి. రమణారావు, లెక్చరర్స్,  విధ్యార్తినిలు  పాల్గొన్నారు.  న్యాయ సేవ సదన్ లో ప్యానల్ లాయర్స్, పారా లీగల్ వాలంటీర్స్ తో రాజ్యాంగ ప్రవేశిక చదివించారు. కార్యాక్రమములో ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు ప్రధాన జిల్లా న్యాయమూర్తి యం.వి. రమేశ్ న్యాయమూర్తులు మరియు న్యాయవాదులతో రాజ్యాంగ ప్రవేశిక చదివించారు. ఈ సందర్భముగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగ స్పూర్తి అందరూ కలిగి ఉండాలని ఆయా కోర్టులలో పెండింగులలో ఉన్న పాత కేసులను త్వరితగతిన పరిష్కరించేలా ఆయా కోర్టులు కృషి చేస్తున్నాయని తెలుపుతూ , న్యాయవాదులు న్యాయసహాయం కోసం వచ్చేవారికి సహాయం అందించాలని తెలిపుతూ, సంఘములో వరకట్న దురాచారాన్ని రూపుమాపాలని పిలుపునిచ్చారు. కార్యాక్రమములో నల్లగొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఎస్. శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి టి. కిషోర్ కుమార్ మరియు న్యాయవాదులు పాల్గొన్నారు.  నల్లగొండ పట్టణములోని అరోరా లా కళాశాలలో లా డే కార్యాక్రమాన్ని నిర్వహించారు. కార్యాక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ విజయసుధ, జిల్లా న్యాయ సేవ సంస్థ సభ్యులు కె.వి. రమణారావు, విధ్యార్థులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్