*పత్తి జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోళ్లు తనిఖీ చేసిన ఇంఛార్జి కలెక్టర్*
అయిటి పాముల లో శ్రీ నాథ్ పత్తి జిన్నింగ్ మిల్లును బుధవారం ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ తనిఖీ చేసి పత్తి కొనుగోళ్లు పరిశీలించారు రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోళ్లు చేయాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి 8 నుండి 12 తేమ శాతం వుండేలా పత్తి తీసుకు వచ్చి సి.సి. ఐ.కొనుగోలు కేంద్రం లో మద్దతు దర పొందాలని ఆయన రైతులకు సూచించారు.ఇప్పటి వరకు జిల్లాలో సి.సి. ఐ.కొనుగోలు కేంద్రాల ద్వారా రెండు లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు.ఈ నెల 21 వరకు కొనుగోలు చేసిన రైతులకు రైతులకు చెల్లింపు కూడా చేసినట్లు వివరించారు.ఇంఛార్జి కలెక్టర్ వెంట మార్కెటింగ్ ఏ. డి. అబ్దుల్ అలీం, డి.సి.ఓ.అర్.శ్రీనివాస మూర్తి తదితరులు ఉన్నారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment