మాస్కులు దరించక పోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి  కేసీఆర్ హెచ్చరిక


మాస్కులు దరించక పోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి  కేసీఆర్ హెచ్చరిక


మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి  కేసీఆర్ హెచ్చరించారు. 


కరోనా లాక్ డౌన్  మే 31వరకు పొడిగించినట్లు ప్రకటించిన కేసీఆర్.  కేబినెట్ సమావేశం అనంతరం పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రేపటి నుంచే నడుస్తాయని,  జిల్లాలకు చెందిన బస్సులు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేశారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు హైదరాబాద్‌ పరిధిలో సిటీ బస్సులకు, ఇతర రాష్ట్రాల బస్సులకు అనుమతిలేదని తెలిపారు. మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.  కేబినెట్‌ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు.


'హైదరాబాద్‌లో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతినిస్తున్నాం. హైదరాబాద్‌ నగరంలో సిటీ బస్సులు తిరగవు. మెట్రో రైలు సర్వీసులు కూడా పనిచేయవు. ఆర్టీసీ బస్సులు కోవిడ్‌-19 జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు వందశాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చు. పరిశ్రమలన్నింటికీ అనుమతి. హైదరాబాద్‌ నగరంలో సరిబేసి విధానంలో దుకాణాలు తెరవాలి.  సినిమా హాళ్లు, ఫంక్షన్‌ హాళ్లకు అనుమతి లేదు. అన్ని రకాల విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతుందని' సీఎం వివరించారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన