కరోనా తో కొడుకు మృతి ని తట్టు కోలేక ప్రాణం విడిచిన తండ్రి.

 కరోనా తో కొడుకు మృతి ని తట్టు కోలేక  ప్రాణం విడిచిన తండ్రి. 


కరోన మహమ్మారి బారిన పడి కుమారుడు గత నాలుగు రోజుల క్రితం మృత్యువాత పడ్డారు,అదే ఆలోచన తో బెంగ తో తండ్రి తనువు చాలించారు. 


నాగారం మున్సిపాలిటీ లోని రాంపల్లి చెందిన నీరుడి వాసు కరోనా తో చికిత్స కోసం నగరం లోని ఆసుపత్రి లో చేరి తనువు చాలించారు,ఆర్థికంగా కుటుంబ పరిస్థితి బాగో లేక ఆసుపత్రి  బిల్లు చెల్లించలేక బాధపడుతూ  తండ్రి బాలయ్య రోజు ఆలోచించి ఆలోచించి తనువు చాలించారు. ఇది విన్న మున్సిపల్ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.కోడలు ఇద్దరు పిల్లలతో ఇంటికి పెద్దలను కోల్పోయి అనాధలు గా మిగిలి పోయారు.


అయ్యో భగవంతుడా అని ఏడవడం తప్ప ఏమీ లేకుండా అయిపోయే పాపం అంటూ కాలనీవాసులు శోకసంద్రం లో మునిగిపోయారు కరోన రక్కసి తో కుటుంబం అతలాకుతలం అయి ఆర్థికంగా ఆదుకుంటే తప్ప ఎలాంటి ఆధారం లేని విగత జీవులుగా ఉన్నారు,ఈ తరుణం లో దయ తలిచి తోటి వారు తోచిన విధంగా ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్