Skip to main content

*కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి*


 

*కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి*

నల్గొండ: ప్రజల ఆరోగ్యం పై దృష్టి పెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం తో పాటు కంటి సమస్యలను పరిష్కరించేందుకు కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని చేపట్టిందని నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. . 100 రోజులు పాటు నిర్వహించే ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు .


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం స్థానిక 42 వ వార్డు ఆర్ .టి .సి . కాలనీలో ని ఐ .యం .ఏ . భవన్ లో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి తో కలిసి నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించి స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం శిబిరం లో పరీక్షలు నిర్వహించుకున్న పలువురి కి ఆయన రీడింగ్ కళ్ళ ద్ధాలు, మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పై దృష్టి పెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యం తో ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరచి , అత్యాధునిక పరికరాలను సమకూర్చి మెరుగైన వైద్యం అందిస్తున్నారని , పేద వారు తమతమ పనులలో నిమగ్నమై తమ కంటి సమస్యలను పరిష్కరించుకోవడం లో నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి ని గమనించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ప్రజల వద్దకే వెళ్లి కంటి పరీక్షలు నిర్వహించి వారి కంటి సమస్యలను పరిష్కరించడం తో పాటు అవసరమైన మందులు, కంటి అద్దాలు అందించాలనే ఉద్దేశం తో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మం లో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,పలువురు జాతీయ పార్టీల నాయకులతో కలిసి ప్రారంభించారని తెలిపారు. 100 రోజులు పాటు నిర్వహించనున్న ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . అనంతరం కంటి వెలుగు కార్యక్రమం పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఏ. కొండల్ రావు రచించి ,గానం చేసిన పాటను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆవిష్కరించారు . ఈ కార్యక్రమం లో ఆర్ .డి .ఓ . జయ చంద్రా రెడ్డి , మునిసిపల్ చైర్మెన్ మందడి సైది రెడ్డి , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ రేగట్టే మల్లిఖార్జున్ రెడ్డి , మునిసిపల్ కమిషనర్ డా. కె.వి.రమణా చారి , మునిసిపల్ వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్ గౌడ్ , స్థానిక కౌన్సిలర్ పబ్బు సాయి శ్రీ సందీప్ , వైద్య ఆరోగ్య సిబ్బంది , ప్రజా ప్రతినిధులు , అధికారులు పాల్గొన్నారు .

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్