Skip to main content

కౌటికె విఠల్ కి "ఎన్టీర్ శ్రమశక్తి" పురస్కార ప్రధానం


 

కౌటికె విఠల్ కి "ఎన్టీర్ శ్రమశక్తి" పురస్కార ప్రధానం

 భారతదేశంలో గల జీవిత బీమా ఏజంట్ల అందరిలో నెం. 1 స్థానాన్ని గత రెండు సంవత్సరాలుగా పొందుతున్న భారతీయ జీవిత బీమా సంస్థ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటికె విఠల్ కు ప్రతిష్టాత్మక "ఎన్టీఆర్ శ్రమశక్తి" అవార్డును ప్రధానం చేశారు. శృతి-లయ ఆర్ట్స్ అకాడెమీ, సీల్వెల్ కార్పోరేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో సినీ నటుడు మురళీమోహన్ కు మరియు కౌటికె విఠలు ఈ అవార్డులు ప్రధానం చేశారు. 

కౌటికె విఠల్ తన జీవిత బీమా ఏజెన్సీ వృత్తిని 23 వ యేట ప్రారంభించి యింతింతై వతుడింతై అన్నట్లు తన జీవిత బీమా ఏజెన్సీ వృత్తిని నిజామాబాదులో ప్రారంభించి, ఈ రోజు హైదరాబాదులో స్థిరపడి, దేశంలోనే నెం, 1 స్థానాన్ని తెచ్చుకోవడం జీవిత బీమా రంగంలో అంతకు మించిన ప్రగతి మరొకటి లేదని చెప్పవచ్చు. వీరు దేశంలో వున్న నలుమూలల్లో వున్న ఏజెంట్లకు సలహాలు, సూచనలు, వ్యాపార మెళకువలు, తన అనుభవాలను పంచుకుంటారు. దేశం మొత్తంలో కొన్ని వేలసార్లు కన్వెన్షన్ల ద్వారా, సెమినార్ల ద్వారా, గ్రూపుల ద్వారా ఉపన్యసించి ఎందరికో ఆదర్శముగా నిలిచారు. ప్రపంచ నలుమూలల్లో జీవిత బీమా ఉత్పత్తులను మార్కెట్ చేశారు. గత 32 సంవత్సరాలుగా ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన అమెరికాలోని మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ సమావేశానికి అర్హత పొందుతూ, తన వృత్తిలో తన నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఎంత ఎదిగిననూ ఒదిగి వుండాలనే సూక్తిని నమ్మే కౌటికె విఠల్ ఎంతో నిరాడంబరత ప్రదర్శిస్తారు. మారుమూల నిజామాబాద్ జిల్లా తెలంగాణ నుండి సామాన్య ఎల్.ఐ.సి. ఏజెంటు స్థాయి నుండి యావత్ ఎల్.ఐ.సి. ఏజెంట్ లోకం మెచ్చే విధంగా తన కృషితో, కార్యదక్షతతో, పట్టుదలతో, అకుంఠిత దీక్షతో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎదిగి నేడు యావత్ భారతదేశ ఇన్సూరెన్స్ రంగం మెచ్చే విధంగా, విఠల్ గారినే ఆదర్శంగా తీసుకునే విధంగా అలిండియా నెం.1 స్థానాన్ని చేజిక్కించుకున్న సందర్భంలో, సమాజంలోని అన్ని వర్గాల నుండి మెప్పు పొందుతూ ఈ రోజు శృతిలయ ఆర్ట్స్ అకాడెమీ - సీల్వెల్ కార్పోరేటర్ వారు నిర్వహించిన "ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో" వీరిని ఎంచుకుని "ఎన్టీఆర్ శ్రమశక్తి" పురస్కారాము అందచేశారు. ఈ సందర్భంగా విఠల్ మాట్లాడుతూ ఇంతటి భారీ విజయానికి కారణం పాలసీదారులు నా మీద ఎనలేని నమ్మకం ఉంచారని. పాలసీ దారులు ఇచ్చిన సహాయ సహకారాలు, అలాగే మేమున్నాం అనే ధైర్యం నా ఇంతటి స్థాయికి తీసుకువచ్చిందని అన్నారు


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్