Skip to main content

గాంధీభవన్ ను ముట్టడించిన బజరంగ్ దళ్


 గాంధీభవన్ ను ముట్టడించిన బజరంగ్ దళ్





@ పోలీసుల కళ్ళుగప్పి గాంధీభవన్ ముట్టడికి బయలుదేరిన శివరాములు


@ వేలాది మంది పోలీసులు మోహరించినా.. మెరుపు దాడి


@ గాంధీభవన్ లోకి చొచ్చుకొని వెళ్లి నిరసన


@ పోలీసుల అత్యుత్సాహం.. బజరంగ్దళ్ కార్యకర్తలపై దాడులు


@ పోలీసుల దాడిలో గాయపడిన బజరంగ్ దళ్ కార్యకర్తలు


@ చట్ట విరుద్ధంగా అక్రమ కేసుల బనాయింపు


@ హిందూ ద్రోహి అని మరోసారి రుజువు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ


@ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ దిష్టిబొమ్మల దహన కార్యక్రమం విజయవంతం





బజరంగ్ దళ్ ను నిషేధిత ఉగ్రవాద సంస్థ PFI తో పోల్చడాన్ని నిరసిస్తూ బజరంగ్ దళ్ ఆందోళనకు దిగింది. బుధవారం ఉదయం 10:30 నుంచి విడతలు విడతలుగా నాలుగుసార్లు గాంధీభవన్ ముట్టడించింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ముస్లిం సంతుష్టీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ హిందువులపై విషం చిమ్మడాన్ని నిరసిస్తూ బజరంగ్ దళ్ ఆందోళనకు దిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాలతో పాటు కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసింది. బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు నేతృత్వంలో భాగ్యనగర్ లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ ను ముట్టడించారు. వందలాది మంది పోలీసులు మోహరించినా మెరుపు దాడికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బజరంగ్దళ్ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కార్యకర్తలను తీవ్రంగా గాయపరిచారు. అక్రమ కేసులు బనాయించి పలు పోలీస్ స్టేషన్ లకు తిప్పారు. బొల్లారం, బేగంబజార్, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లకు తిప్పారు. భాగ్యనగరంలో దాదాపు 300 మంది కార్యకర్తలు ముట్టడిలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.


పోలీసుల కళ్ళుగప్పి గాంధీభవన్ ముట్టడికి వెళ్లిన శివరాములు


రాత్రి నుంచి పహారాల్లో ఉన్న పోలీసులను తప్పించుకొని బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు గాంధీభవన్ చేరుకున్నాడు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం చుట్టుముట్టి శివరాములును బంధించాలని చూసినా పోలీసుల కళ్ళు కప్పి కార్యాలయం నుంచి గాంధీభవన్ చేరుకున్నాడు. దీంతో ఈస్ట్ జోన్ డిసిపి సునీల్ దత్, మిగతా పోలీస్ యంత్రాంగం VHP కార్యాలయానికి వచ్చి కార్యాలయం అంతా తనిఖీలు చేశారు. కింది స్థాయి సిబ్బందిని డిసిపి తీవ్రంగా మందలించారు.



కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తాం: బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు



ఉగ్రవాద మూలాలు కలిగిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) వంటి ఉగ్రవాద సంస్థతో బజరంగ్ దళ్ ను పోల్చడం దుర్మార్గమని బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ వ్యతిరేక పార్టీ అనే ముద్రను కాంగ్రెస్ పార్టీ మరోసారి రుజువు చేసుకుందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హిందువులపై మరోసారి విషం చిమ్మిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ ను ఉగ్రవాద సంస్థ అయిన పి ఎఫ్ ఐ తో పోలుస్తూ.. బజరంగ్ దల్ పై నిషేధం విధించడం నీచమైన ప్రక్రియ అన్నారు. ముస్లింల సంతుష్టీకరణ కోసం హిందువులను అవమానించడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ విద్వేషాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేశా మని శివ రాములు పేర్కొన్నారు. హిందువులంతా సంఘటితమై కాంగ్రెస్ ను తుదముట్టించాలన్నారు. ప్రతి హిందువు స్పందించి కాంగ్రెస్ ముక్తభారత్ చేయాలన్నారు. 




Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్