Skip to main content

పౌరసరఫరాల శాఖ మంత్రి వైఫల్యం పై ముఖ్యమంత్రి స్పందించాలి.* - *పొన్నం ప్రభాకర్*


 *పౌరసరఫరాల శాఖ మంత్రి వైఫల్యం పై ముఖ్యమంత్రి స్పందించాలి.* - *పొన్నం ప్రభాకర్*


*ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు భారీగా నష్టపోయారు.* - *కవ్వంపల్లి సత్యనారాయణ* 



జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నల సమస్యలను తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా నేడు మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఐకెపి సెంటర్లను సందర్శించిన అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టి వారం రోజులు గడిచినా కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదు.


అధికారులు 360 సెంటర్లలో కొనుగోలు సెంటర్లను ప్రారంభించామని చెప్పినప్పటికీ కేవలం 160 సెంటర్లలో మాత్రమే కొనుగోలు జరుగుతుంది.


నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారుల దృష్టికి తెచ్చినప్పటికీ శనివారం నాటి నుండి కొనుగోలు ప్రక్రియ ఆగిపోయింది.


ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు భారీగా నష్టపోయారు.


25 రోజుల ముందు నుండే ధాన్యం కొనుగోలు ప్రారంభించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.


ప్రభుత్వ అసమర్ధత వల్ల కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు, లారీలు, ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళనలు చేపడుతున్నారు.


ఈమొద్దు ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది.


తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.


మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ ధాన్యం కొనుగోలు విషయంలో వాస్తవాలు దాచి పెడుతున్నారు.


ఈ తిమ్మాపూర్ మండలంలో 50 వేల క్వింటాళ్ల ధాన్యం కొనవలసి ఉండగా గడిచిన వారం రోజుల్లో కేవలం 3 వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని అధికారులు చెబుతున్నారు.


కరీంనగర్ జిల్లాలో కేవలం 2267 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినారు.


సివిల్ సప్లై శాఖ వెబ్సైట్లో ఉన్న సమాచారానికి ప్రజా ప్రతినిధులు చెప్పే వివరాలకు పొంతనే లేదు


25 రోజులుగా ఐకెపి సెంటర్లో ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండగా వాటిపై దృష్టి పెట్టని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సంబరాలు జరుపుకుంటున్నారు.



పునర్నిర్మాణ సంబరాలు వేడుకలనుండి బయటకు వచ్చి కన్నీరు పెడుతున్న రైతుల ఆవేదన వినండి


మేము రైతుల పక్షాన కలెక్టర్ కాళ్ళు మొక్కి వేడుకున్నా ఈ ప్రభుత్వానికి చలనం లేదు


కొనుగోలు సెంటర్లలో ధాన్యం వచ్చి ఎన్ని రోజులు అయిందో ఎంత మేరకు కొనుగోలు జరిగిందో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరుతున్నాం మంత్రికి సవాల్ స్వీకరించే దమ్ముందా..?


అధికారంలో లేకపోయినా మేము రైతు బిడ్డలమే, రైతుల గోడు తెలిసిన వారమే.


ఇది రాజకీయ పంచాయతీ కాదు, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరడమే మా ఉద్దేశం


రైస్ మిల్లర్ల దయాదాక్షి న్యాల మీద ధాన్యం అమ్ముకోవలసిన కర్మ రైతుకు పట్టలేదు.


పౌరసరఫరాల శాఖ మంత్రి వైఫల్యం పై ముఖ్యమంత్రి స్పందించాలి.


రైతులు కన్నీరు పెడుతుంటే ముఖ్యమంత్రి ఉత్సవాల పేరుతో ఆర్భాటం చేస్తున్నారు.


రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం మంచిది కాదని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారికి తెలియజేస్తున్నాను అని అన్నారు

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్