Skip to main content

చట్టసభల్లో వైశ్యుల ప్రాతినిధ్యం పెరగాలి : వాసవీ పొలిటికల్ ఫోరం ఛైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె


 చట్టసభల్లో వైశ్యుల ప్రాతినిధ్యం పెరగాలి : 

వాసవీ పొలిటికల్ ఫోరం ఛైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె 


హైదరాబాద్ : చట్టసభల్లో వైశ్యుల ప్రాతినిధ్యం పెరగాలని వాసవీ పొలిటికల్ ఫోరం చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరినాథ్ గుప్త మాట్లాడుతూ, సమాజ సేవా కార్యక్రమాల్లో ఎల్లవేళలా ముందు వరుసలో నిలిచే వైశ్యుల్లో రాజకీయ చైతన్యం పెంపొందాల్సిన అవసరం ఉందన్నారు.

ఏ మాత్రం స్వార్థం లేకుండా సమాజ సేవకు తమ స్వార్జితాన్ని వినియోగించే వైశ్యులు అధికారంలో ఉంటే, బహుళ జనులంతా సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. గతంలో చట్టసభల్లో వైశ్యుల ప్రాతినిధ్యం ఐదు నుండి 10 వరకు ఉండేదన్నారు. క్రమేణా ఆ సంఖ్య తగ్గుతూ వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో వైశ్యులకు కనీసం 10 టికెట్లు ఇవ్వాలని ఆయన అన్ని పార్టీలను డిమాండ్ చేశారు. కాగా లోకానికి శాంతి సందేశం ఇచ్చిన వాసవీ మాత త్యాగనిరతిని విశ్వవ్యాప్తం చేయాలని హరినాథ్ గుప్త పిలుపునిచ్చారు.

 ఇదిలా ఉండగా వినోబా నగర్ సైనిక్ పురి లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువైయున్న వాసవీ మాత కు కిలో వెండి కిరీటాన్ని దేమ వీరేశం గుప్త బహూకరించారు. పుష్పాలంకరణ మాదంశెట్టి అశోక్ కుమార్ చేయించగా,ఈ కార్యక్రమంలో శ్రీ వాసవీ ఆర్యవైశ్య సేవా సమితి అధ్యక్షులు పోకల శ్రీనివాసులు గుప్త, తాటిపల్లి శ్రీనివాస్ గుప్త, చీకోటి లక్ష్మీపతి, ఆలయ వైస్ చైర్మన్ గుబ్బ మహేష్, అధ్యక్షులు కాసం వెంకట హరి, ఇమ్మడి లక్ష్మీనారాయణ, గుబ్బ రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

 వినాయక్ నగర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రవణ్ కుమార్, మైలవరపు శ్రీనివాస్ , నంగునూరి సత్యనారాయణ, మద్ది శ్రీనివాస్, విజయ్ కుమార్, నవీన్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్