తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు


 

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు  

హైద్రాబాద్: 

76వ రిపబ్లిక్ డే సందర్భంగా మెంబర్ సెక్రటరీ జి.రవి తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (టిజిపిసిబి) బోర్డు ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 26వ తేదీకి భారత రాజ్యాంగం మరింత ప్రాముఖ్యతనిస్తుంది. 1950లో ఈ చారిత్రాత్మక రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది అని కొనియాడారు. టిజిపిసిబి పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్యం నియంత్రణ కోసం పని చేస్తోంది అని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ అధికారులు మరియు సిబ్బంది ఎంతో ఉత్సాహంతో, దేశభక్తితో పాల్గొన్నారు. ఉద్యోగులు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, హరిత తెలంగాణ కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేసారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*