సీఎం ప్రజావాణి చొరవతో మృతుని కుటుంబానికి అందిన రూ. 4 లక్షల పీ.ఎఫ్.


 సీఎం ప్రజావాణి చొరవతో మృతుని కుటుంబానికి అందిన రూ. 4 లక్షల పీ.ఎఫ్.


హైద్రాబాద్, గూఢచారి: 


ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ప్రజావాణి ఇంచార్జ్ చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్యలకు ధన్యవాదాలు తెలిపిన మృతుని తల్లిదండ్రులు.


సీఎం ప్రజావాణి చొరవతో పాల ప్రవీణ్ అనే మృతుని కుటుంబానికి నాలుగు లక్షల రూపాయల ప్రావిడెంట్ ఫండ్ అందింది.


 మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో జరిగిన సీఎం ప్రజావాణికి మృతుని తల్లిదండ్రులు పాల నాగేశ్వరరావు, రామలక్ష్మి వచ్చి ఈ విషయాన్ని తెలిపారు. తమను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రజావాణి ఇన్చార్జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్యలకు మృతుని తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.


హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టకు చెందిన పాల ప్రవీణ్ ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా ఐదేళ్ళ క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగిన లాభం లేకపోవడంతో మూడు నెలల క్రితం సీఎం ప్రజావాణి కి వచ్చి సమస్యను వివరిస్తూ మృతుని తల్లిదండ్రులు పిటిషన్ ఇచ్చారు.


సీఎం ప్రజావాణి ఇన్చార్జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ ల ఆధ్వర్యంలో అధికారులు రంగంలోకి దిగి ప్రైవేట్ సంస్థ, పీఎఫ్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. మృతుడు ప్రవీణ్ కు రావాల్సిన రూ. 4 లక్షల పీ ఎఫ్ డబ్బులు ఇప్పించారు.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్