ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికడదాం! ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుదాం!


 ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికడదాం!

ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుదాం!


జూన్ 05 నుండి జూలై 05 వరకు మాస ఉత్సవాలు జరుపుకుందాం


జీడిమెట్ల రవీందర్

వ్యవస్థాపక అధ్యక్షులు


ఇండియన్ ఎన్విరాన్ మెంట్ సోషల్ ఫోరం(IESF)


 


ప్లాస్టిక్ బ్రేకప్ అవుదాం!


ప్రపంచాన్ని ముంచెత్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు.. 2050 నాటికి సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువ!


ప్రియమైన మిత్రులారా!


అరిటాకులో అన్నం తిని ఎన్నాళ్లుయింది పాతిక ముప్పైయ్యేళ్ల క్రితం వరకూ పండగొచ్చినా పబ్బమొచ్చినా ఎలా తినేవాళ్లు ఓ లేత అరటి ఆకులో.. వేడివేడి అన్నం, వంటకాలు వడ్డించేవారు. కమ్మటి నెయ్యితో ఆ వంటకాల గుబాళింపు.. అన్నం ఆవిరితో కలిసి జిహ్వ లేచొచ్చేది. అరిటాకులోని ఔషధీయ గుణాలు కలగలిసి... అన్నం అమృతంలా ఉండేది.


కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది ఏ పెళ్లికి వెళ్లినా ప్లాస్టిక్ ప్లేట్లలోనే భోజనాలు! ఉల్లిపొర కాగితంలా ఉండే ప్లాస్టిక్ కప్పులోని గులాబ్ జామ్ పాకం తుస్సుమని మీద పడకుండా జాగ్రత్తగా తినాలి. ఎవరు తోసేస్తారో అన్నం భయంతో ప్లాస్టిక్ గ్లాసులోని నీళ్లును గబాగబా తాగెయ్యాలి. సాయంత్రానికి పంక్షన్హాలు నుంచి ట్రక్కు నిండా ప్లాస్టిక్ వ్యర్థాలువెళ్తుంటే నిట్టూర్చాలి. ఇలా ఇంత వరకూ ప్లాస్టిక్ ను ప్రేమించింది చాలు, ప్లాస్టిక్కు ఇకనైనా బ్రేకప్ చెప్పండి..! జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో 'బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్' అని నినదించండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు నో చెప్పండి.


ఇప్పడంటే ప్లాస్టిక్ బ్యాగ్లు వచ్చాయి. కానీ నాన్న తరం వరకూ చేతి సంచులు వాడలేదా రోజూ గుడ్డ సంచిలో కూరలు తెచ్చుకోలేదా కిరణా నుంచి బియ్యం వరకూ గోనె సంచుల్లో మూటగట్టి వంటికి తేలేదా అవన్నీ పాత కాలం అలవాట్లు కాదు! ప్రకృతి మీద ప్రేమ! పుట్టిన నేల పది కాలాలు పచ్చగా ఉండాలన్న తపన!! కానీ ఇప్పుడేం జరుగుతోంది డజను అరటిపళ్లు కొని కవర్ ఇవ్వకపోతే కస్సుమంటారు. షాపింగ్కి వెళ్లినప్పుడల్లా ఐదు రూపాయలు పెట్టి ప్లాస్టిక్ కవర్లు కొంటారు. ఇక ప్రయాణాల్లో రెస్టారెంట్లలో కొనే డిస్పోజబులు వాటర్ బాటిళ్లకు లెక్కేలేదు. పాలు, నీళ్లు, కిరాణా, ఆహార పొట్టాలు, మందులు, చివరకు గుళ్లో ప్రసాదాలకు కూడా పాలిథీన్ క్యారీ బ్యాగ్లు ఉండాల్సిందే! రోజులో ఓ గంట కూడా కాలుష్యాన్ని అధిగమించండి అన్న సందేశంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది అనేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను భారత్ నిర్వహిస్తోంది. ఈ నేపధ్యంలో.. ఒకసారి వాడి పడేసే (డిస్పోజబులు) ప్లాస్టిక్పై విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కల్గిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లపై 2016 లోనే దేశమంతా నిషేదం విధించిన్నప్పటికి అమలు చేయడంలో రాష్ట్రాలు విఫలమవుతున్నాయి. తాజాగా జమ్మూ, కాశ్మీర్, మహారాష్ట్రాలతో సహా దేశంలో 25 రాష్ట్రాలు కేంద్రపాలిత పాలిథీన్ క్యారీ బ్యాగులనుపూర్తిగానో పరోక్షం గానో నిషేదించాయి. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయం చూపించలేకపోవడంతో చిన్న వ్యాపారుల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే సంకల్పం గట్టిదైతే ప్లాస్టిక్ నిషేదం అమలు కష్టం కాదని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నరు.


వాతావరణ మార్పులవల్ల భూగోళం గడియ గడియకు రోగగ్రస్తమై తన సుస్థిరతను కోల్పోతోంది. ఓ పెను ప్రమాదం మనల్ని అవరించబోతోంది. 1990 సంవత్సరంతో పోలిస్తే గ్రీన్హౌస్ వాయువును ఉత్పత్తి 50% పెరగడం, కాలుష్యభూతం, దాని పర్యావసానంగా భూతావం విపరీతంగా పెరగడం. సహజనవనరుల, భూసార క్షీణత, జలవనరుల లభ్యత తగ్గడం, అటవి విస్తీర్ణం కుచించుకుపోవడంతో వ్యక్తి జంతు సముదాయాల సంఖ్య బాగా తగ్గికొన్ని అంతరించిపోవడం, ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, అతివృష్టి, అనావృష్టి, ఊహించని వైద్య, ఆరోగ్య మానసిక సమస్యలు ప్రపంచ దేశాన్ని ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రకృతి లేనిదే జీవకోటి మనుగడ లేదన్న వాస్తవాన్ని తెలుసుకొని దానికి దగ్గరై సంరక్షణ చర్యలు చేపట్టడం, ప్రకృతితో పూర్తిగా మమేకం కావడం. సుస్థిరవిద్య అభ్యసన మరియు చర్యలను నిజాయితీగా వ్యక్తిగత శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా మాత్రమే ఈ పర్యావరణ సమస్యలు పరిష్కరించుకొని, తద్వారా మనల్ని మనం, ధరిత్రిని కాపాడుకోగలం. రండి! మనసారా చేయి చేయి కలపండి!! ప్రకృతిని సంరక్షించి, కాపాడి దానిలో సేదతీరుదాం. భూగోళాన్ని 'సుస్థిర ధరిత్రిని చేద్దాం. హాయిగా జీవిద్దాం. భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందిద్దాం.


పచ్చని చెట్లు, గలగల పారే సెలయేర్లు, పక్షుల కిలకిల రాగములు, స్వచ్ఛమైన గాలి, కాలనుగుణంగా వచ్చే వర్షాలు ఇవి ప్రకృతి మానవునికై ప్రసాదించిన వరాలు. కానీ మానవుడు ఈ అందమైన ప్రకృతిని తన స్వలాభం కోసం తాత్కాలిక ప్రయోజనాల కొరకు విచక్షణారహితంగా ప్రకృతి వనరులను ఉపయోగిస్తూ నాశనం చేస్తున్నారు. రాబోయే కాలంలో ఈ సమస్య ఇలాగే కొనసాగించబడినచో మానవుని మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఇప్పటికైనా మేల్కొని ప్లాస్టిక్ భూతం నుండి మన భూమిని కాపాడుకుందాం.


కావున మా యొక్క సంస్థ ఇండియన్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ “మన భూమిని” పర్యావరణ జీవన శైలివైపు మల్లించే ప్రచారంలో భాగంగా జూన్ 5 తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నుండి మాస ఉత్సవాలను నిర్వహిస్తూ జులై 5 వరకు పర్యావరణ సదస్సులను ఏర్పాటుచేసి విద్యార్థులను, యువకులను, ప్రొఫెసర్లను, మేదావులను, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించడం కోసం నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రజలు, పర్యావరణ ప్రేమికులు, ప్రాజాస్వామిక వాదులు, ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు అన్ని రంగాల వారు అధిక సంఖ్యలో పాల్గొని, తమ తోడ్పాటు ఇస్తూ సదస్సులను విజయవంతం చేసి పర్యావరణ జీవన శైలిలో భాగస్వామ్యం అవ్వాలని ఇండియన్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఫోరం పిలుపునిస్తుంది.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్