పర్యావరణాన్ని పరిరక్షిద్దాం... భవిష్యత్ ప్రపంచాన్ని కాపాడుదాం - మంత్రి కొండా సురేఖ
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం... భవిష్యత్ ప్రపంచాన్ని కాపాడుదాం
ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రభుత్వం, ప్రజలు సంయుక్త కృషి అవసరం
రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
పీసీబీ కార్యాలయంలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి సురేఖ
హైదరాబాద్
పర్యావరణాన్ని పరిరక్షిoచుకొని... భవిష్యత్ ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత... మన అందరిపై ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. యావత్ ప్రపంచానికే సవాలుగా మారిన ప్లాస్టిక్ మహమ్మారి నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు సంయుక్త కృషి అవసరం ఆమె అభిప్రాయపడ్డారు.
మనం అందరం కలిసి మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి… సంరక్షించుకోవాలనే బాధ్యతను ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇదొక విప్లవాత్మకమైన చర్యగా తాను అభివర్ణిస్తున్న అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి గూగులోత్, పిసిబీ బోర్డు మెంబర్లు సత్యనారాయణ రెడ్డి, విజయ లక్ష్మీ, జయదేవ్, పిసిబి ఉద్యోగులు, సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాగా, ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ ఉద్దేశించి విద్యార్థులు పలు అవగాహన సాoస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. ఈ సంవత్సరం “ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అంతం చేయడం,”(Ending Plastic Pollution- Globally) అనే థీమ్ తో ఈ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నమని గుర్తు చేశారు. ఈ రోజు మన రాష్ట్రం, దేశమే కాకుండా యావత్ ప్రపంచమంతా ప్లాస్టిక్ సమస్యను పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నదన్నారు. అందుచేత, ప్లాస్టిక్ కాలుష్యం నిర్మూలన వైపు మనమంతా ద్రుష్టిసారించాల్సిన అవసరం ఉన్నదన్నారు.
ప్లాస్టిక్ అనేది సులభంగా కుళ్ళిపోయే పదార్థం కాదని మన అందరికీ తెలిసిందే అని... అది వందల, వేల సంవత్సరాల పాటు మన మట్టి, నదులు, సముద్రాలలో ఉండిపోతూ తీవ్ర నష్టం చేస్తున్నదనీ ఆందోళన వ్యక్తం చేశారు. భూమి మీద ఉన్న వనరుల్లోకి విష పదార్థాలను విడుదల చేస్తూ సమస్త జీవరాశులకు పెను ముప్పుగా మారుతోందని వాపోయారు. 1960, 1970ల నుంచి సముద్రాలలో ప్లాస్టిక్ పెద్ద ఎత్తున పేరుకుపోతున్నట్లు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. నీటిలో జీవ వైవిధ్యానికి, ఆహార భద్రతకు ఈ ప్లాస్టిక్ ప్రమాదంగా మారుతున్నదన్నారు. భారతదేశం ప్రతి సంవత్సరం సుమారు 12.65 కోట్ల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోందని నిపుణులు చెబుతున్నారన్నారు. ప్రతి నిమిషం ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 లక్షల సింగిల్-యూస్ ప్లాస్టిక్ సంచులు పంపిణీ అవుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. నిమిషానికి 10 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లు కొనుగోలు అవుతున్నాయని, 2026 నాటికి ఈ సంఖ్య 50 కోట్లకు పైగా ఉంటుందని మన పర్యావరణ శ్రాస్తవేత్తలు అంచనా వేస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం 80 లక్షల నుంచి 120 లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతోందని... ఇది ప్రపంచ తీర ప్రాంతాలను అనేక వ్యర్థాలతో కప్పేసేంత ప్రమాదం ఉందన్నారు. 91% ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైకిల్ కావడం లేదని...
1950ల నుంచి ఇప్పటివరకు 830 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయిందన్నారు. అందులో సుమారు 500 కోట్ల టన్నులు పర్యావరణ కాలుష్యంగా మారాయన్నారు. ఇదే ధోరణి కొనసాగితే, 2050 నాటికి ఈ సంఖ్య 1200 కోట్ల టన్నులకు చేరవచ్చన్నారు. అయితే, గణాంకాలు మనల్ని హెచ్చరిస్తున్నది ఏమిటంటే… ప్లాస్టిక్ నిర్మూలనకి వెంటనే, కఠిన చర్యలు తీసుకోవాలని నొక్కి చెబుతున్నదన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వనమహోత్సవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నదని గుర్తు చేశారు. గత ఏడాది 20.2 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంటే…. 19.04 కోట్ల మొక్కలను నాటినమని... అంటే 95 శాతం టార్గెట్ రీచ్ అవడం చాలా గొప్ప విషయం అని చెప్పుకొచ్చారు. ఇందుకు ఫారెస్టు డిపార్టుమెంట్ ఉన్నతాధికారులు, సిబ్బందిని తాను ప్రత్యేకంగా అభినందిస్తునట్టు చెప్పారు. ఈ సంవత్సరం కూడా వనమహోత్సవంను భారీ స్థాయిలో చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. పర్యావరణ మెరుగు పరిచేందుకు తమ ప్రభుత్వం, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎకో టూరిజం, పార్కుల్లో కీలక మార్పులు చేపడుతున్నమని వివరించారు. సహజ వనరులు మన సమిష్టి వారసత్వమని... వీటిని జాగ్రత్తగా, న్యాయంగా వినియోగించి భావితరాలకు అందించడం మన బాధ్యత అని మంత్రి సురేఖ నొక్కి చెప్పారు. పాలసీ రూపకర్తలుగా, నిర్వాహకులుగా, పౌరులుగా మనం రాజ్యాంగబద్ధంగా ప్లాస్టిక్ నిర్మూలించేందుకు పని చేయాలని అన్నారు. సింగిల్-యూస్ ప్లాస్టిక్లను తొలగించి, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలన్నారు. బాధ్యతాయుతమైన రీసైక్లింగ్, పునర్వినియోగం కోసం మౌలిక సదుపాయాలను నిర్మించాలని అన్నారు. అందుకోసం తమ ప్రజా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదన్నారు. ముఖ్యంగా, ప్రతి పౌరుడికి పర్యావరణ పరిరక్షణ బాధ్యతను గుర్తు చేయాల్సిన అనివార్యత ఉందన్నారు. తద్వారా భావి తరాల కోసం మనం పర్యావరణాన్నీ కాపాడగలుగుతామన్నారు.
1972లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రపంచ పర్యావరణ దినోత్సవం, 150కి పైగా దేశాలను ఒకే వేదిక కిందకి తీసుకువచ్చి, పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నదన్నారు. ఈ సంవత్సరం, ప్లాస్టిక్ కాలుష్యం అనే కీలక సమస్యపై దృష్టి సారించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని సృష్టించేందుకు కట్టుబడి ఉందన్నారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా... ఈ రోజు కొన్ని మంచి నిర్ణయాలతో ప్లాస్టిక్ నివారణలో ముందంజలో ఉంటామని మరోసారి ప్రతిజ్ఞ చేస్తున్నామని మంత్రి సురేఖ చెప్పారు. కాగా, 2018లో, భారతదేశం 2022 నాటికి సింగిల్-యూస్ ప్లాస్టిక్లను తొలగించాలని ప్రతిజ్ఞ చేసిందనీ మంత్రి వెల్లడించారు. ఈ చర్యే దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ సంచులు, కట్లరీలపై నిషేధానికి ప్రేరణగా నిలిచిందన్నారు. తెలంగాణ ఈ నిర్ణయం, విధానాన్ని మరింత ఉత్సాహంతో కొనసాగిస్తోందన్నారు. ఈ సంవత్సరం ఆగస్టు-2025లో జెనీవాలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి యావత్ ప్రపంచమంతా కీలక చర్చలు జరపనున్నదన్నారు. తెలంగాణ ఈ లక్ష్యాలకు సంఘీభావంగా ఉంటుందని వెల్లడించారు. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆతిథ్యం ఇస్తున్న రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ప్లాస్టికును మరింత వేగంగా నిలువరించేందుకు వ్యూహాలు రచించనున్నదన్నారు. అయితే, మనం 5Rలను—రిఫ్యూజ్ (తిరస్కరించాలి ), రిడ్యూస్ (తగ్గించాలి), రీయూస్ (పునర్వినియోగించాలి, రీసైకిల్ (పునఃచక్రీకరణ), రీథింక్ (పునరాలోచన)—పాటించాలన్నారు. తెలంగాణలో ప్లాస్టిక్ రహిత ప్యాకేజింగ్ను వినియోగిస్తున్న చేస్తున్న స్టార్టప్లు, పరిశ్రమలను తమ ప్రజా ప్రభుత్వం సమర్థిస్తున్నదన్నారు. మొక్కల ఆధారిత ప్లాస్టిక్లు, పునర్వినియోగ కంటైనర్లు ఇందులో భాగంగా ఉన్నాయన్నారు. పాఠశాలలు, యువత, పర్యావరణ ప్రేమికులు, సామాజిక కార్యకర్తలను ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారాలలో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడిన తరాన్ని తయారు చేస్తున్నామన్నారు. తెలంగాణలోని వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల నుంచి వచ్చే వ్యర్థాలను నిర్వహించే విస్తరిత ఉత్పాదక బాధ్యతను స్వీకరించాలని... ఆ మేరకు బాధ్యత తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రతి పౌరుడినీ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలనీ, రీసైక్లింగ్కు సహకరించాలని ఆ శాఖ మంత్రిగా కోరుతున్నట్టు సురేఖ చెప్పారు.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) చేసే ఈ అవగాహన ప్రచారం, “ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం,”ను ప్రారంభిస్తున్నందుకు తనకు గర్వంగా ఉందన్నారు. ఈ ప్రచారం మన రాష్ట్రంలో అవగాహన కల్పించి, చర్యలకు స్ఫూర్తినిస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో యువతతో పాటు సమాజానికి కూడా ప్రత్యేక బాధ్యత ఉందన్నారు. మన దేశ యువత మనకి కేవలం వారసులు మాత్రమే కాదనీ, పర్యావరణ పరిరక్షణ వైపు మనల్ని నడిపించే శక్తులన్నారు. మన రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ క్రుషి చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అనివార్యత ఉందన్నారు. ఈ సందర్భంగా, ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ సంస్థలు, సామాజిక సంస్థలు అందరూ కలిసి ఆదర్శవంతంగా పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించాలని మంత్రి సురేఖ కోరారు.
ఉత్తమ పర్యావరణ ప్రదర్శన అవార్డు గ్రహీతలలో ఇవి ఉన్నాయి:
తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు
TGPCB గ్రీన్ ఛాంపియన్ అవార్డులు 2025: కాలుష్య నియంత్రణ విభాగంలో ఉత్తమ పరిశ్రమలు
1 మెస్సర్స్. హిందూస్తాన్ కోకా కోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్, సిద్దిపేట జిల్లా
2 మెస్సర్స్. లారస్ సింథసిస్ ప్రైవేట్ లిమిటెడ్. మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా
TGPCB గ్రీన్ ఛాంపియన్ అవార్డులు 2025: ఉత్తమ ప్రభుత్వ ఆసుపత్రులు
1 మెస్సర్స్. సౌత్ సెంట్రల్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్
2 మెస్సర్స్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆసుపత్రి (TGSRTC)
TGPCB గ్రీన్ ఛాంపియన్ అవార్డులు 2025: ఉత్తమ ప్రైవేట్ ఆసుపత్రులు
1 మెస్సర్స్. యశోద హెల్త్కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సెరిలింగంపల్లి
2 మెస్సర్స్. AIG హాస్పిటల్స్ సెరిలింగంపల్లి
TGPCB గ్రీన్ ఛాంపియన్ అవార్డులు 2025: ఉత్తమ గ్రామ పంచాయతీలు
1 చామనపల్లి గ్రామ పంచాయతీ కరీంనగర్
2 మల్లంపల్లి గ్రామ పంచాయతీ ములుగు
3 మేడేపల్లి గ్రామ పంచాయతీ ఖమ్మం
TGPCB గ్రీన్ ఛాంపియన్ అవార్డులు 2025: ఉత్తమ మునిసిపాలిటీలు
1 నార్సింగి మున్సిపాలిటీ
2 నారాయణపేట మున్సిపాలిటీ
3 తుర్కయంజల్ మున్సిపాలిటీ
4. శంకర్పల్లి మున్సిపాలిటీ
5. గజ్వేల్ మున్సిపాలిటీ
6. కోరుట్ల మున్సిపాలిటీ
TGPCB గ్రీన్ ఛాంపియన్ అవార్డులు 2025 : ఉత్తమ స్వయం సహాయక బృందాలు (గ్రామీణ)
1 సుబ్రమణ్య స్వామి స్వయం సహాయక బృందం
2 డ్వాక్రా కమల స్వయం సహాయక బృందం
3 సంపంగి స్వయం సహాయక బృందం
TGPCB గ్రీన్ ఛాంపియన్ అవార్డ్స్ 2025 : ఉత్తమ స్వయం సహాయక బృందం (అర్బన్)
1 శ్రీ గణేష్ స్వయం సహాయక బృందం
2 స్టార్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్
3 జయభారతి స్వయం సహాయక బృందం
TGPCB గ్రీన్ ఛాంపియన్ అవార్డులు 2025: పర్యావరణ నిర్వహణలో ఉత్తమ కళాశాలలు
1 ప్రభుత్వ నగర కళాశాల
2 ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట
3 ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మహిళలు) బేగంపేట
TGPCB గ్రీన్ ఛాంపియన్ అవార్డులు 2025: ఉత్తమ పాఠశాలల పర్యావరణ నిర్వహణ
1 ZPH స్కూల్ వేంసూర్ ఖమ్మం
2 ZPH స్కూల్ రెంగర్ల నిజామాబాద్
3 MPP స్కూల్ నిజాంపూర్ సంగారెడ్డి
TGPCB గ్రీన్ ఛాంపియన్ అవార్డ్స్ 2025: నైట్ పెట్రోలింగ్ విధుల్లో అత్యుత్తమ ప్రదర్శన:
1 శ్రీ.పి.శ్రవణ్ కుమార్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్
2 శ్రీ.ఎస్.వి.ఫణి కిరణ్ ప్రాజెక్ట్ విశ్లేషకుడు
3 శ్రీ.బి.సేవా నాయక్ ప్రాజెక్ట్ విశ్లేషకుడు
Comments
Post a Comment