జర్నలిస్టుల సమస్యలపై డబ్ల్యూ జే ఐ పోరాటం
*జర్నలిస్టుల సమస్యలపై డబ్ల్యూ జే ఐ పోరాటం*
నల్గొండ, గూఢచారి::
పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అనిల్ దేశాయ్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. నల్లగొండ జిల్లా కేంద్రం లో జరిగిన యూనియన్ సమావేశంలో వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏడాది కాలంగా పెండింగ్ లో ఉన్న అక్రిడేషన్లు వెంటనే ఇచ్చే విధివిధానాలను ప్రకటించి అర్హులైన వారందరికీ ఇవ్వాలని అన్నారు... జర్నలిస్టులు సంక్షేమంలో భాగంగా అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు ఆసుపత్రులలో ఉచిత చికిత్స, తదితర అంశాలతో పాటు పాత్రికేయుల సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైళ్లు, విమానాల టికెట్లలో జర్నలిస్టులకు రాయితీ ఇవ్వాలని, టోల్ ఛార్జీల మినహాయింపు ఇవ్వాలని తాము పోరాడుతున్నట్లు తెలిపారు. తమ వృత్తిలో భాగంగా జర్నలిస్టులు నిష్పక్షపాతంగా ఉంటేనే సమాజంలో వారిపట్ల గౌరవం పెరుగుతుందనీ, వారు
దేశహితం కోసమే పని చేయాలని సూచించారు. వర్కింగ్ జర్నలిస్ట్స్
ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) దేశంలోని 16 రాష్ట్రాల్లో పాత్రికేయుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, దేశంలోని అన్ని రాష్ట్రాలలో తమ సభ్యులు ఉన్నారని వారు అన్నారు..
*డబ్ల్యూ జే ఐ నల్లగొండ జిల్లా ఆడ్ హక్ కమిటి ఎన్నిక...*
కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా ఆడ్ హక్ కమిటీని
రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అనిల్ దేశాయ్ లు ప్రకటించారు.. .
కన్వీనర్ గా గుంటి రామకృష్ణ, కో కన్వీనర్లుగా పాశం అశోక్ రెడ్డి, కట్ట రాంబాబు, భూపతి రాజు, ముచ్చర్ల విజయ్ లను ప్రకటించారు... ఈ కార్యక్రమంలో జనగాం సురేష్, అల్లి మల్లికార్జున్, ముచ్చర్ల శ్రీనివాస్, రవీందర్, అంబటి తిరుమలేశ్, తోగోటి రమేష్, బత్తినీ శ్రీనివాస్ గౌడ్, కత్తుల యాదగిరి, టీ యాదయ్య, కత్తుల హరి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment