నేడు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్
*నేడు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్..*
TG: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. నేడు (బుధవారం) పోలింగ్ రోజును సెలవుగా ప్రకటించింది సర్కార్. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు మాత్రమే ఈ సెలవు వర్తించనుంది. కాగా, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగనుంది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రేపు (ఫిబ్రవరి 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Comments
Post a Comment