ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. DSP ఎస్. భీమ్ రెడ్డి ఆస్తులపై ఏసీబీ సోదాలు

 



ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. DSP ఎస్. భీమ్ రెడ్డి ఆస్తులపై ఏసీబీ సోదాలు


హైదరాబాద్, జూలై 2: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గురువారం డీఎస్పీ ఎస్. భీమ్ రెడ్డికి చెందిన నివాసాలు, ఇతర ఆస్తులపై ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు తెలిసింది.


హైదరాబాద్‌తో పాటు మొత్తం 20 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సోదాల సందర్భంగా ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు, ఇతర రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.


సుమారు రూ.8 కోట్ల విలువైన విల్లాలు కూడా పరిశీలనలో ఉన్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపినప్పటికీ, అక్రమాస్తుల విలువ లేదా స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. సోదాలు కొనసాగుతున్నందున పూర్తి వివరాలను అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన