LRS తనిఖీ రిపోర్ట్ కొరకు లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ సహాయక కార్యనిర్వాహక ఇంజనీర్
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ సహాయక కార్యనిర్వాహక ఇంజనీర్
మహబూబ్నగర్:
"భూ నియంత్రణ పథకం (ఎల్.ఆర్.ఎస్) యొక్క అధికారిక అంతర్జాల సైట్లో ప్లాట్ కు సంబంధించిన సంయుక్త తనిఖీ రిపోర్ట్ మరియు ఎన్.ఓ.సి. ని పొందు పరచడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ.3,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన మహబూబ్ నగర్ జిల్లా, ఒకటవ వలయంలోని డివిజన్-1, సబ్-డివిజన్-I యొక్క నీటిపారుదల సహాయక కార్యనిర్వాహక ఇంజనీరు - మహమ్మద్ ఫయాజ్.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడుననీ ఏసీబీ అధికారులు తెలిపారు.

Comments
Post a Comment