మాజీ మంత్రి హరీష్ ను కలిసిన డాక్టర్ శ్రీహరి
సంగారెడ్డి
అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావును సంగారెడ్డికి చెందిన సీనియర్ నేత డాక్టర్ శ్రీహరి మంగళవారం ఉదయం కలిశారు. ఇటీవల హరీష్ రావు అమెరికా నుంచి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశామని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా తిరిగి కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. గతంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని
అన్నారు.నాడు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు .
తిరిగి కెసిఆర్ పాలన వస్తుందని చెప్పారు . యువ నాయకుడు శ్రీకాంత్ కూడా హరీష్ రావును కలిసిన వారిలో ఉన్నారు.

Comments
Post a Comment