Posts

ACB కి చిక్కిన, బిల్ కలెక్టర్, బీట్ ఆఫీసర్

Image
 గుండాల ఫారెస్ట్ రేంజ్‌లో ACB దాడి:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో ఫారెస్ట్ బీట్ అధికారి చిక్కాడు. 30-04-2026 తేదీన నడిమిగూడెం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీ బానోత్ నరేష్, ప్రస్తుతం సాయనపల్లి ఇన్‌చార్జ్‌గా కూడా విధులు నిర్వహిస్తున్నాడు. గుండాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని తన కార్యాలయంలో రూ.10,000 లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వెంకటపురం రెవెన్యూ గ్రామంలో ఉన్న సుమారు 5 ఎకరాల పట్టా పోడు భూమిని, ప్రభుత్వం ఫిర్యాదుదారుడి తండ్రికి కేటాయించినప్పటికీ, ఆ భూమి సాగులో జోక్యం చేసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.10,000 స్వీకరిస్తుండగా అధికారులు అతన్ని పట్టుకున్నారు. అధికారుల సమాచారం ప్రకారం, లంచం మొత్తాన్ని నిందితుడి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో అవినీతి ప్రవర్తన ప్రదర్శించి అన్యాయ లాభం పొందేందుకు ప్రయత్నించినందుకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. తదుపరి చర్యల భాగంగా నిందితుడిని అరెస్ట్ చేసి, వరంగల్‌లోని SPE & ACB కేసుల ప్రత్యేక కోర్టు, మూడవ ...

తిరుపతిలో ప్రారంభమైన అయోధ్య వాసవీ సత్రం

Image
  తిరుపతిలో ప్రారంభమైన అయోధ్య వాసవీ సత్రం 🔹 రూమ్స్ బుకింగ్ నెంబర్ : 9989 249 679  🔹 నూతన భవనంలో అధునాతన సౌకర్యాలు 🔹 - ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె హైదరాబాద్ : శ్రీ అయోధ్య వాసవీ ట్రస్ట్ వారి సత్రం సేవలను తిరుపతిలో ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి, శ్రీ సీతారాములు, తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సత్రానికి శ్రీకారం చుట్టారు.       ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె మాట్లాడుతూ, తమ సత్రానికి వచ్చే యాత్రికులకు వసతి, భోజన, రవాణా ఏర్పాట్లతో పాటు శుచి, శుభ్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. గత ఏడాదికాలంగా అయోధ్యలో తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికుల మన్ననలను పొందిన తమ సత్రం సేవలను, ప్రస్తుతం తిరుపతికి విస్తరించామని తెలిపారు. మొత్తం 18 పుణ్యక్షేత్రాల్లో సత్రాలు నెలకొల్పి, దక్షిణాది రాష్ట్రాల యాత్రికులకు సేవలు అందేలా ప్రతిపాదనలు చేశామని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు తిరుపతిలో ప్రారంభమైందన్నారు. త్వరలో అరుణాచలం, వారణాసి, నైమిశారణ్యం...

వాసవి మాత జయంతి ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Image
  నల్లగొండ: గూఢచారి : పట్టణంలోని బీట్ మార్కెట్ రామకోటి స్తూప దేవాలయం మరియు గాంధీ పార్క్‌లో నిర్వహించిన వాసవి మాత జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్గరు పాల్గొని వాసవి మాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాసవి మాత ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆర్యవైశ్య సమాజానికి ఎలాంటి సమస్యలు ఉన్నా, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. రామకోటి స్తూప దేవాలయ అభివృద్ధికి గతంలో అన్ని విధాలుగా సహకారం అందించినట్లు తెలిపారు. దేవాలయ విస్తరణకు అవసరమైన స్థలాన్ని కూడా సమకూర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

*“జలతీర్థం” పేరుతో ఉచిత మంచినీటి పంపిణీ సేవా కార్యక్రమం ప్రారంభం*

Image
 *“జలతీర్థం” పేరుతో ఉచిత మంచినీటి పంపిణీ సేవా కార్యక్రమం ప్రారంభం* హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో “జలతీర్థం” పేరుతో ఉచిత మంచినీటి బాటిల్స్ పంపిణీ సేవా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ గ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మహాసభ ముఖ్య సలహాదారు  బండారు సుబ్బారావు  ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమం కింద తొలి దశలో 20,000 మంచినీటి బాటిల్స్ పంపిణీ చేయబడుతున్నాయి. ఎండాకాలం ముగిసేంతవరకు ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మహత్తర సేవా కార్యక్రమానికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారు, భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) అఖిల భారత నెంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్  కౌటికె విఠల్  స్పాన్సర్‌గా ముందుకు రావడం విశేషం. ఈ సందర్భంగా  కౌటికె విఠల్  మాట్లాడుతూ, “విపరీతమైన ఎండల్లో దాహార్తిని తీర్చడం అత్యంత మానవీయమైన సేవ. ఆహారం లేకపోయినా కొంతకా...

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం! హర్షం వ్యక్తం చేసిన వనమా వెంకటేశ్వర్లు

Image
 తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం! 🌸 తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, అహింసా మూర్తి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని అధికారికంగా "రాష్ట్ర పండుగగా" ప్రకటించింది. ముఖ్య విశేషాలు: 📍 ప్రతి సంవత్సరం "వైశాఖ శుక్ల పక్ష దశమి" నాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే ఈ వేడుకలను నిర్వహిస్తుంది. 📍 ఈ ఏడాది ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగగా జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 📍 అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీ వాసవీ మాత జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి మరియు  ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి ఆర్యవైశ్యుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏✨  వనమా వెంకటేశ్వర్లు నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్

Image
 శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించి జీవో విడుదల చేయడం పట్ల ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ నాయకులు ముడిదుడ్డి శ్యాంసుందర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.   ముఖ్యమంత్రి వైశ్య వాసవి మాత పారాయణం నిర్వహించిన ప్రోగ్రామ్ లో వాసవి మాత జయంతి ని పండుగా రోజు గా గుర్తిస్తామన్నారు. అన్న మాటని ఈ రోజు నిలబెట్టుకున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రం లోని ఆర్యవైశ్యులు అందరు మెయిల్ ద్వారా ముఖ్యమంత్రి కి ధన్యావాదాలు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమ్మవారి జయంతి ని ఘనంగా నిర్వహించాలని ఆర్యవైశ్యులకు పిలుపు నిచ్చారు.

ఏసీబీ వలలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ,ఎస్ఐ

Image
 అనంతగిరి: వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సరోజ,ఎస్ఐ రాణి ఏసీబీ వలలో చిక్కారు. వివరాలిలా ఉన్నాయి.. తాండూరు పట్టణానికి చెందిన కౌన్సిలర్ ఇర్షాద్ భార్య కుటుంబ గొడవల విషయంపై మహిళా పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఇర్షాద్లో పాటు అతని కుటుంబసభ్యులు ఐదుగురిపై కేసు నమోదైంది. దీదీనిపై నోటీసులు తీసుకోవాలంటూ మార్చి 15న పోలీసులు ఇర్షాద్కు ఫోన్ చేశారు. దీంతో అమ్మానాన్న, తమ్ముడిని తీసుకుని 16న పీఎస్కు వచ్చాడు. ఇద్దరు చెల్లెళ్లు రాలేదు. కేసులో ఉన్న ఆరుగురికీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.60 వేలు ఇవ్వాలని సీఐ, ఎస్ఐ డిమాండ్ చేశారు. తాను అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.40 వేలకు బేరం కుదుర్చుకున్నారు. మార్చి 23వ తేదీన రూ.20 వేల నగదుతో వెళ్లిన ఇర్షాద్ సీఐ సమక్షంలో ఎస్ఐకి డబ్బులు అందజేశాడు. అనంతరం ఇందుకు సంబంధించిన ఆధారాలతో ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం వికారాబాద్ మహిళా పీఎస్కు చేరుకున్న ఏసీబీ అధికారులు సీఐ, ఎస్ఐని విచారించారు. వీరి ఇళ్లతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ  తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్ ...

*తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్త*

Image
  *తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్త* హైద్రాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగుగా, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్త  నియమితులయ్యారు.  ఈ సందర్భంగా క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నియామకంపై ఉప్పల శ్రీనివాస్ గుప్త  ఆనందం వ్యక్తం చేస్తూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపీచంద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.  అలాగే అసోసియేషన్ సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో బ్యాడ్మింటన్ క్రీడను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులను గుర్తించి వారికి సరైన మార్గదర్శకత్వం, సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.  క్రీడా మౌలిక సదుపాయాల పెంపు, శిక్షణా శిబ...

డిజిటల్ అరెస్టు కేసులో సీబీఐ సోదాలు; అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్‌తో సహా ముగ్గురి అరెస్టు

Image
  డిజిటల్ అరెస్టు కేసులో సీబీఐ సోదాలు; అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్‌తో సహా ముగ్గురి అరెస్టు తేదీ: 18.04.2026 'డిజిటల్ అరెస్ట్' కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. గౌరవనీయ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. బాధితురాలైన ఒక సీనియర్ సిటిజన్‌ను 'డిజిటల్ అరెస్ట్' చేస్తామని బెదిరించి, ఆమె నుండి రూ.1.6 కోట్లకు పైగా మొత్తాన్ని బదిలీ చేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయని అధికారులు ఒక ప్రకటన లో వెల్లడించారు. సైబర్ మోసం ద్వారా వచ్చిన సొమ్మును స్వీకరించడాన్ని సులభతరం చేసేందుకు, మోసపూరితంగా కాజేసిన నిధులను ఒక కంపెనీ పేరుతో మోసపూరితంగా తెరిచిన బ్యాంకు ఖాతాకు మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. దర్యాప్తు కొనసాగింపులో భాగంగా, మోసపూరితంగా బ్యాంకు ఖాతా తెరవడంలో సహకరించిన ఆరోపణలపై ఇండస్‌ఇండ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌ను అరెస్టు చేశారు. అరెస్టు అయిన మిగతా ఇద్దరు నిందితులు మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఏర్పాటు చేయడంలో, అలాగే ...

ఏసీబీ వలలో కామారెడ్డి జిల్లా, బిచ్‌కుండ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్

Image
 ఏసీబీ వలలో కామారెడ్డి జిల్లా, బిచ్‌కుండ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్   కామారెడ్డి, గూఢచారి: 17-04-2026న, కామారెడ్డి జిల్లా, బిచ్‌కుండకు చెందిన ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, నిందితుడైన అధికారి దీను సత్యనారాయణ, ఫిర్యాదిదారుడికి అధికారికంగా సహాయం చేస్తానని చెప్పి, బిచ్‌కుండలోని అతని అద్దె ఇంట్లో రూ. 2,00,000 లంచం డిమాండ్ చేస్తూ, తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆ సహాయం ఏమిటంటే, "గ్రామాల నుండి కల్లు దుకాణాలను తరలించమని ఫిర్యాదిదారుడిపై ఒత్తిడి చేయవద్దని, తదుపరి కేసులు నమోదు చేయకుండా ఉండాలని, తద్వారా కల్లు దుకాణాలను ఎటువంటి జోక్యం లేకుండా నడపడానికి అనుమతించాలని" చెప్పడం. పైన పేర్కొన్న వాటితో పాటు, అతని బ్యాగ్‌లో లెక్క చూపని రూ. 45,760/- కూడా లభ్యమైంది. ఈ విధంగా, అసెస్‌మెంట్ ఆఫీసర్ రూ.2,00,000/- అక్రమ ప్రయోజనాన్ని స్వీకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుని గుర్తింపు గోప్యంగా ఉంచబడింది. అందువల్ల, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో, ఎస్‌పిఈ & ఏసీబీ కేసుల విచారణ కొరకు నియమించబడిన గౌరవనీయ రెండవ అదనపు ప...

*ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు*

Image
 *ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు* ----------_-------_--------_--------------  _తిరుమల లో ఆర్యవైశ్య మహాసభ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలలో ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం ను బచ్చు రామకృష్ణ శాలువాలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు_ ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు యన్నం భూపతిరెడ్డి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ టోల్ గేట్ _నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్ ఆర్యవైశ్య సంఘ నాయకులు ఉప్పు ఆంజనేయులు మిరియాల రాజయ్య ఉన్నారు_

అర్హులైన జర్నలిస్టులందరికీ ఆక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి.!

Image
  అర్హులైన జర్నలిస్టులందరికీ ఆక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి.! టి యు డబ్ల్యూ జే (ఐ జె యు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమావేశం సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా లో నూతనంగా ఏర్పడిన అక్రిడిటేషన్  కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో గురించి ఆరా తీశారు. టీయూడబ్ల్యూజేఐజేయు సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి , ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్ లు జిల్లా కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా బండారు యాదగిరి మాట్లాడుతూ అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో చాలా సంవత్సరాలుగా అర్హులైన వారు జర్నలిస్టులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గ కేంద్రాలలో , మండలాల్లో అర్హులు చాలామంది ఉన్నారని చెప్పారు.వీరందరికీ కూడా సకాలంలో అక్రిడిటేషన్ కార్డులను జారీ చేస్తే బాగుంటుందని వివరించారు. జిల్లాలో ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో , ఉర్దూ , ఇ...

*నియామకాల్లో వివక్షను సహించబోం ... మాదిగ న్యాయవాదులు*

Image
   *నియామకాల్లో వివక్షను సహించబోం ...  మాదిగ న్యాయవాదులు*  Nalgonda, Gudachari: 10/4/2026 న సాయంత్రం 5గంటలకు నల్గొండ జిల్లా మాదిగ న్యాయవాదుల సమావేశంలో మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం *బంధువుల జాడ* పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా నల్గొండ మాదిగ న్యాయవాదుల సమావేశంలో మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు తెలంగాణ హైకోర్టు ఎక్స గవర్నమెంట్ ప్లీడర్ కొమ్ము ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని న్యాయశాఖ మొదలు జిల్లాలో గల అన్నీ ప్రభుత్వ శాఖల్లో మరియు బ్యాంకుల్లోను న్యాయవాదులచే చేపట్టే  GP, AGP, APP, standing councils, penal Advocates నియమాకాల్లో మాదిగ న్యాయవాదులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేస్తూ లేని పక్షంలో మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ ( MAA ) రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు  *కొమ్ము ప్రవీణ్ కుమార్* చీఫ్ అడ్వవైజర్  *లాయర్ మల్లన్న* కార్యదర్శి ఈ కార్యక...

మహాసభ రికార్డులు ఇప్పించాలని rti దరఖాస్తు చేసిన భూపతి రాజు & 13 మంది ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ప్రక్షాళన కమిటీ సభ్యులు

Image
  మహాసభ రికార్డులు ఇప్పించాలని rti దరఖాస్తు చేసిన భూపతి రాజు & 13 మంది ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ప్రక్షాళన కమిటీ సభ్యులు హైదరాబాద్:   తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ బ్యాలెన్స్ కొందరు 3కోట్లు అని, కొందరు 6 కోట్లు అని, ఇంకొందరు 11 కోట్లు ఉండాలి అంటున్న వార్తల మేరకు విషయములో ఏది నిజమో తెలవాలంటే రికార్డులు బహిర్గతం కావాల్సిందేనని ఆర్యవైశ్య జర్నలిస్టు భూపతి రాజు అంటూ  సమాచారం కొరకు తాను rti దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు.  సభ్యత్వ రుసుము లో జిల్లాలకు ఇవ్వవలసిన వాటాలు దాదాపు 11 సంవత్సరాల నుండి ఇవ్వడం లేదనీ. ఉమ్మడి మహాసభ నుండి పంచుకున్న విద్యానిధి నుండి స్కాలర్షిప్ ఇవ్వలేదని, సేవా కార్యక్రమాలు కూడా చేసిన దాఖలాలు లేవనీ ఆయన అన్నారు, వసూలైన సభ్యత్వం రుసుము భద్రంగా ఉందా, పంచుకున్న నిధులు, విద్యా నిధి నిలువలు ఉన్నాయా? లేక ఖర్చుల క్రింద ఆవిరి అయ్యాయా? అన్న విషయం ఆర్యవైశ్యులకు ముఖ్యంగా సభ్యులకు తెలవలసి ఉందని తెలిపారు. రికార్డులు బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు.  ఆయనతో పాటు ఆర్యవైశ్య నాయకులు 13 మంది కూడా rti దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన వారిలో మాజీ జిల్లా అధ్య...

వాయు & వాహన కాలుష్యంపై అవగాహన కొరకు టీజీపీసీబీని సందర్శించిన నార్సింగి గీతాంజలి వేదిక 9వ తరగతి విద్యార్థులు

Image
వాయు & వాహన కాలుష్యంపై అవగాహన  కొరకు టీజీపీసీబీని సందర్శించిన నార్సింగి గీతాంజలి వేదిక  9వ తరగతి విద్యార్థులు హైదరాబాద్:  నార్సింగి లోని గీతాంజలి వేదిక 9వ తరగతి విద్యార్థులు, పర్యావరణ కాలుష్యం, వాయు కాలుష్యo, మరియు వాహన కాలుష్యం నియంత్రణ పై అవగాహన కల్పించేందుకు విద్యా పర్యటనలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి టీజీపీసీబీని ను సందర్శించారు. ఈ సందర్భంగా  టీజీపీసీబీ సీనియర్ సోషల్ సైంటిస్ట్ డా. డబ్ల్యూ.జి . ప్రసన్న కుమార్ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలైన నైట్రోజన్ ఆక్సైడ్లు, కార్బన్ ఉద్గారాలు, బెంజీన్, ఓజోన్ వంటి కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల వ్యాధులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వివరించారు. కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన నివారణ చర్యలు, పరిష్కార మార్గాలను కూడా వివరించారు. వాయు  కాలుష్యానికి దారితీసే నాలుగు ముఖ్య కారణాలుగా వాహనాలను అవసరం లేకుండా ఆన్‌లో ఉంచడం, రోడ్ల దుస్థితి, ఇంజిన్ నాణ్యత లోపాలు మరియు సరైన నిర్వహణ లేకపోవడం, కల్తీ పెట్రోల్ వినియోగం గురించి విద్యార్థులకు తెలియజేశారు. టీజీపీసీబీ పర్యావరణ శాస్త్రవేత్త జె. సుమతి విద్యార్థులకు చెత...

ఏసీబీ వలలో చిక్కుకున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ మరియు సబ్-ఇన్‌స్పెక్టర్.

Image
 ఏసీబీ వలలో చిక్కుకున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ మరియు సబ్-ఇన్‌స్పెక్టర్. హైద్రాబాద్:  ఏసీబీ వలలో చిక్కుకున్న ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ అవుట్‌పోస్ట్, హైదరాబాద్ కమిషనరేట్ కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ మరియు సబ్-ఇన్‌స్పెక్టర్. 07.04.2026న, ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు చెందిన ఏఓ-1 శ్రీ యు.కె. సిద్దేశ్వర్, ఎస్.ఎల్. పోలీస్ మరియు ఏఓ-2 శ్రీ సంపతి కనకయ్య, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రంగారెడ్డి రేంజ్ యూనిట్ చేత పట్టుబడ్డారు. వారు ఒక అధికారిక సహాయం చేస్తామన్నందుకు, అంటే "ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్, శంషాబాద్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడం మరియు ఫిర్యాదిదారుని కుటుంబ సభ్యులను అరెస్టు చేయకుండా, ఈ కేసులో ఇరికించకుండా ఉండటం" కోసం, ఫిర్యాదిదారుని నుండి రూ. 5,00,000/- లంచం డిమాండ్ చేసి, డిమాండ్ చేసిన లంచంలో భాగంగా రూ. 2,00,000/- లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు.  AO-2 నివాసంలో జరిపిన సోదాల ఫలితంగా రూ.33,97,000/- నగదును స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆస్తి పత్రాలు కూడా లభ్యమయ్యాయి, వాటిపై దర్యాప్తు జరుగుతోంది. అందువల్ల, ఏఓలను అరెస్టు చేసి, జ్యుడిషియల్ రిమాండ్ కోసం నాంపల్లిలో...

అక్రెడిటేషన్ కార్డు దరఖాస్తులకి ఇంకా గడువు ఉన్నది!

Image
 అక్రెడిటేషన్ కార్డు దరఖాస్తులకి ఇంకా గడువు ఉన్నది! తొందర పాటు తో తప్పులు చేయొద్దు! టీయూ డబ్ల్యూ జే జిల్లా నేతలు  సంగారెడ్డి : అక్రెడిటేషన్ కార్డు దరఖాస్తుల కు సంబంధించి సోమవారం వరకే గడువు అనేది పూర్తిగా అవాస్తవం అని టీ యు డబ్ల్యూ జే (ఐ జె యు) రాష్ట ఉపాధ్యక్షుడు ఎం ఎ కే ఫైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి అసిఫ్ పేర్కొన్నారు. ఇంకా జిల్లా స్థాయిలో అక్రెడిటేషన్ కమిటీలు ఏర్పాటు కాలేదని వారన్నారు. ఈ కమిటీ ఏర్పాటు కావడానికి సమయం పడుతుందని అన్నారు. కమిటీ ఏర్పాటు అయిన తర్వాత సమావేశం జరగడానికి మరో రెండు మూడు రోజులు పడుతుంది అని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీ సమావేశం జరిగి, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అర్హులైన జర్నలిస్టు మిత్రులందరికీ కార్డులు వచ్చే విధంగా కొన్ని గైడ్ లైన్స్ రాబోతున్నాయని చెప్పారు. ఈ కారణంగా దరఖాస్తు చేసుకునే గడువు ఇంకా ఉన్నదని స్పష్టం చేశారు. జర్నలిస్టు మిత్రులు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. అందరూ ఒకటే సారి దరఖాస్తు ...

*ఐక్య పోరాటమే ఇండ్ల స్థలాల సాధనకు మార్గం*

Image
  *ఐక్య పోరాటమే ఇండ్ల స్థలాల సాధనకు మార్గం* - పాత్రికేయుల హక్కుల కోసం పోరాటం  – సీనియర్ జర్నలిస్ట్ టి.ఎస్. చక్రవర్తి ఖమ్మం, ఏప్రిల్ 03 అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను ఇకపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయరాదని, ఇది కేవలం కొందరి వ్యక్తిగత అవసరం కాదని, మొత్తం పాత్రికేయ వర్గ భద్రత, జీవన హక్కులకు సంబంధించిన కీలక అంశమని టిడబ్ల్యూజెఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ టి.ఎస్. చక్రవర్తి స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిరోజూ వెలుగులోకి తీసుకొచ్చే పాత్రికేయులకే కనీస గృహ భద్రత లేకపోవడం దురదృష్టకరమని, 'కలం పట్టే చేతులకు కనీస స్థలం కూడా దక్కకపోతే అది వ్యవస్థ వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనం' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశం అనేది ఒక్కో వ్యక్తి కోరిక కాదని, ఇది వృత్తి గౌరవాన్ని కాపాడే హక్కు పోరాటమని ఆయన పేర్కొన్నారు. గతంలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం నిర్వహించిన పలు ఆందోళనలు, వినతిపత్రాల కార్యక్రమాలు, దీక్షలు, నిరసనల్లో తాను ప్రత్యక్షంగా పాల్గొన్నానని గుర్తు చేశారు. ఇటీవల నిర్వహించిన రిలే నిరాహార దీక్షల్లో ఒ...

ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పోజర్లో భాగంగా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థుల TGPCB సనత్నగర్ సందర్శన

Image
  ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పోజర్లో భాగంగా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థుల TGPCB సనత్నగర్ సందర్శన హైద్రాబాద్:  నాగర్కర్నూల్ జిల్లా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు తమ పర్యావరణ శాస్త్రం మరియు విపత్తు నిర్వహణ) కోర్సు ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పోజర్లో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సనత్నగర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా  పి. శరత్, పర్యావరణ శాస్త్రవేత్త, విద్యార్థులతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యం, బయోమెడికల్ వ్యర్థాల కాలుష్యం, మురుగునీటి శుద్ధి విధానాలు వంటి వివిధ కాలుష్య రకాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు విధించే జరిమానాలు మరియు శిక్షలు గురించి వివరించి, పరిశ్రమలు మరియు సంస్థలు పర్యావరణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. ప్రాక్టికల్ ఎక్స్పోజర్లో భాగంగా విద్యార్థులను TGPCB ప్రయోగశాల సౌకర్యాలను చూపించి, వాయు మరియు నీటి కాలుష్య స్థాయులను కొలిచే పరికరాలు, శాస్త్రీయ పద్ధతులు గురించి వివరించారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థులకు కాలుష్య పర్యవేక్షణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ పద్ధతులు, పర్యావరణ పర...

Nirmal District SI ACB trap

Image
  Nirmal District SI ACB trap  నిర్మల్: నిర్మ ల్ జిల్లా మామడలో నిశ్శబ్దంగా సాగుతు న్న ఒక అవినీతి కథకు ఈరోజు థ్రిల్లింగ్ క్లైమాక్స్ కు చేరింది. ప్రజలకు రక్షణ గా నిలవాల్సిన ఒక పో లీస్ అధికారి అదే అధికారాన్ని ఆ యుధంగా మార్చుకుని లంచాల వల వేస్తూ చివరకు రెడ్ హ్యాండెడ్‌ గా చిక్కడంతో కథ కంచికి చేరింది. ఇప్పటివరకు గుట్టుగా నడిచిన ఈ వ్యవహారం ఒక్కసారిగా బహిర్గతమై, ప్రజల్లో షాక్‌తో పాటు ఆగ్రహా న్ని రేపుతోంది. “రక్షకుడే భక్షకు డైతే ఎలా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి నోట వినిపిస్తోంది. ఏసీబీ దాడుల పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. నిర్మల్ జి ల్లా మామడ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తు న్న తీగల అశోక్ ఒక భూ వివాదం కేసులో ఫిర్యాదుదా రు కు సహాయం చేస్తానని చెప్పి, “మోసం కేసు నమోదు చేయ కుండా చూస్తాను” అంటూ రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అ ధికారులకు తెలియజేయడంతో వారు జాగ్రత్తగా పన్నిన ఉచ్చులో అశో క్ చిక్కుకున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో అశోక్ లంచం స్వీకరి స్తుండగానే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకు న్నారు. అతని వద్ద నుంచి రూ. 20 వేల నగదు స్వాధీనం చేసుకున్న...