Posts

“వీరి వీరి గుమ్మడి పండు... వీరి పేరు ఏమి?” – TGPCBలో ‘ఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్' డిప్యుటేషన్‌ల ఆట మళ్లీ మొదలా?

Image
“వీరి వీరి గుమ్మడి పండు... వీరి పేరు ఏమి?” – TGPCBలో ‘ఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్'  డిప్యుటేషన్‌ల ఆట మళ్లీ మొదలా? ట్రాన్స్‌ఫర్లు ఒక వైపు... డిప్యుటేషన్లు మరో వైపు! తెలంగాణ పీసీబీలో అక్రమ డిప్యుటేషన్‌లకు సర్వం సిద్ధమనే ప్రచారం! హైదరాబాద్: “వీరి వీరి గుమ్మడి పండు... వీరి పేరు ఏమి?” అనే పాటలో చివరి చరణం “ఎక్కడి వాళ్లు అక్కడ గప్ చుప్"  అన్నట్లుగా, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB)లో బదిలీలు జరిగినా కొందరు ఉద్యోగులు, అధికారులు మళ్లీ తమకు అనుకూల ప్రాంతాలకే డిప్యుటేషన్‌ల ద్వారా చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా డిప్యుటేషన్ అనేది శాఖ అవసరాల కోసం, ప్రత్యేక నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమైనప్పుడు మాత్రమే ఇవ్వాల్సిన పరిపాలనా విధానం. కానీ TGPCBలో మాత్రం కొందరి వ్యక్తిగత అవసరాలు, పలుకుబడులు, పరిచయాల ఆధారంగా డిప్యుటేషన్‌లు జరుగుతున్నాయనే విమర్శలు ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో GHMC పరిధిని ఒకే యూనిట్‌గా పరిగణిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పలువురిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. అయితే ఆ తర్వాత కొందరు ప్రభావశీలులు అడ్మినిస్ట్రేషన్...

ఆర్&బి ఈఈ సంధ్య అక్రమాస్తులపై ఏసీబీ విచారణ జరపాలి: సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్

Image
 ఆర్&బి ఈఈ సంధ్య అక్రమాస్తులపై ఏసీబీ విచారణ జరపాలి: సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్ ఈఎన్‌సీ మోహన్ నాయక్ నివాసాలపై ఏసీబీ దాడులను స్వాగతిస్తున్నాం ఒకే జిల్లాలో 20 ఏళ్లుగా తిష్టవేసిన సంధ్య అవినీతిపై పోరాడుతాం మహబూబ్‌నగర్ కలెక్టరేట్, కళాభారతి పనులపై విజిలెన్స్ విచారణ జరపాలి మహబూబ్‌నగర్ (జిల్లా కేంద్రం): తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (R&B) ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) మోహన్ నాయక్ ఆస్తులపై ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపు దాడులను స్వాగతిస్తున్నామని 'నేనుసైతం' స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మియాపూర్‌లోని ఈఎన్‌సీ మోహన్ నాయక్ నివాసంతో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టడం హర్షణీయమన్నారు. ఇదే తరుణంలో, మహబూబ్‌నగర్ జిల్లా ఆర్&బి శాఖలో గత 20 సంవత్సరాలుగా ఇక్కడే తిష్టవేసి పనిచేస్తున్న ఈఈ (EE) సంధ్య ఆస్తులపై కూడా సమగ్ర ఏసీబీ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. నిబంధనలకు విర...

తెలంగాణ: రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీ జే. బాలు నివాసాలపై ఏసీబీ మెరుపు దాడులు!

Image
  తెలంగాణ: రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీ జే. బాలు నివాసాలపై ఏసీబీ మెరుపు దాడులు! ​ హైదరాబాద్: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ (R&B) చీఫ్ ఇంజనీర్ (ఇంజినీర్ ఇన్ చీఫ్) జే. బాలు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోదాలు నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో అధికారులు ఈ తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. ​11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ​మాదాపూర్‌లోని జే. బాలు ప్రధాన నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించిన మొత్తం 11 ప్రాంతాలలో ఏసీబీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. బాలు అక్రమ ఆస్తుల సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ​భారీగా లభ్యమైన నగదు, బంగారం, విదేశీ మద్యం ​సోదాల సందర్భంగా బాలు నివాసంలో అధికారులు షాకింగ్ విషయాలను గుర్తించారు. ఇప్పటివరకు జరిపిన తనిఖీలలో కళ్ళు చెదిరేలా ఆస్తులు బయటపడ్డాయి: ​ నగదు: కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు. ​ బంగారం: భారీగా బంగారు బిస్కెట్లు, ఆభరణాలు. ​ వెండి: పెద్ద మొత్తంలో వెండి వస్తువులు. ​ లిక్కర్: నిబంధనలకు విరుద్...

"హీరో"అవార్డు ఓ అద్భుతం..అతిశయం

Image
 "హీరో"అవార్డు  ఓ అద్భుతం..అతిశయం నేషనల్ టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డ్ గ్రహీత. మాచన రఘునందన్ మాతృమూర్తి "విజయ" ప్రత్యేక ఇంటర్వ్యూ  "అమ్మా..! డిల్లీ నుంచి ఓ పార్సెల్ వస్తుంది.తీసుకో..మళ్లీ అది వాపస్ పోతే రావడం కష్టం. అని మా అబ్బాయి చెప్తే.. ఏదో.. కవర్,చిన్న పార్సిల్ వస్తుందేమో అనుకున్నా..కాని  ఓ నగల పెట్టే లా..బరువు ఉన్న బాక్స్ వస్తుంది అని అనుకోలేదు. అత్యంత భద్రంగా.. ఏదో విలువైనది ఇందులో ఉన్నది అనుకునేలా.. బందబస్త్ పార్సెల్ వచ్చింది. "రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తరం అందుకోవడం అంత సామాన్య విషయమా?!" నా..బిడ్డ దేశం కోసం ఆలోచించడం.దేశం కోసం ఏదైనా మేలు చేయాలి అని క్షణ క్షణం ఆలోచిస్తేనే కదా..అసాధారణ విజయం సొంతం అయ్యేది. అని.. తన తనయుడు చేసిన  అలుపెరుగని కృషి గురించి ఎంతో ఆర్ద్రంగా వివరించారు మాచన విజయ. ఇన్నాళ్ళకు జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో  అద్భుత ఫలితం రావడం మాకు పద్మ పురస్కారమే అన్నారు "మాచన" మాతృమూర్తి. మరిన్ని వివరాలు..ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో.. మాచన విజయ మాటల్లోనే.. "ఎంత సంపాదించాము. ఎంత కూడబెట్టుకున్నాం అని ఆలోచించే కొందర...

*"పర్యావరణ దినోత్సవం రోజే పర్యావరణ విధ్వంసంపై వినతి": మంత్రి కొండా సురేఖకు అంతమ్మ గూడెం బాధితుల ఆగ్రహ పత్రం - TGPCB నిర్లక్ష్యంపై నిప్పులు*

Image
  *"పర్యావరణ దినోత్సవం రోజే పర్యావరణ విధ్వంసంపై వినతి": మంత్రి కొండా సురేఖకు అంతమ్మ గూడెం బాధితుల ఆగ్రహ పత్రం - TGPCB నిర్లక్ష్యంపై నిప్పులు* *గుడాచారి.పేజ్ | ప్రత్యేక కథనం*  *హైదరాబాద్, అక్టోబర్ 18, 2026:* ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలు జరుగుతున్న PCB కార్యాలయం గేటు దగ్గర పర్యావరణ విధ్వంసంపై వినతి పత్రం అందుకున్నారు మంత్రి కొండా సురేఖ.  "మొదటి ప్రపంచ యుద్ధంలో శత్రువులను చంపడానికి వాడిన పాస్జీన్ వాయువును ఇప్పుడు మా ఊరి గాల్లో వదులుతున్నారు" అంటూ యాదాద్రి జిల్లా అంతమ్మ గూడెం గ్రామస్తులు మంత్రికి నేరుగా మొరపెట్టుకున్నారు. *పర్యావరణ దినోత్సవం నాడే నిరసన గళం* జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా TGPCB సనత్‌నగర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు, అంతమ్మ గూడెం గ్రామస్తులు నేరుగా వినతి పత్రం అందజేశారు. "పర్యావరణాన్ని కాపాడతాం అని వేదికలపై ప్రసంగాలు చేస్తున్న రోజే, మా ఊరిని విషపు గ్యాస్ ఛాంబర్‌గా మార్చిన వైనాన్ని మీ దృష్టికి తెస్తున్నాం" అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. *గాల్లో విషం, నేలలో...

ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కొరడా

Image
  ఆన్‌లైన్ ఫార్మసీలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కొరడా రాష్ట్రవ్యాప్తంగా 166 మెడికల్ షాపుల తనిఖీలు.. 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు గూఢచారి.పేజీ కోసం వార్తా కథనం: హైదరాబాద్, జూన్ 7: తెలంగాణలో ఆన్‌లైన్ ఫార్మసీలతో అనుబంధంగా పనిచేస్తున్న మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. జూన్ 6న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 166 మెడికల్ షాపులను అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా ఆన్‌లైన్ మందుల డెలివరీ సేవలకు సంబంధించిన లైసెన్స్ కలిగిన కేంద్రాలు, భాగస్వామ్య ఫార్మసీలు కలిపి 159 దుకాణాలు, అలాగే ఆన్‌లైన్ బీ2బీ ప్లాట్‌ఫారమ్‌లతో అనుబంధంగా ఉన్న 7 మెడికల్ షాపులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. మందుల విక్రయ బిల్లులను నిర్వహించకపోవడం, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ మరియు షెడ్యూల్-H1 మందుల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకపోవడం, కొనుగోలు ఇన్‌వాయిస్‌లను చూపించకపోవడం, వైద్యుల చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయించడం, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణ లేకుండా మందు...

*PCB RC పురం ROలో 'సొంత' దందా: ప్రభుత్వ వాహనంతో ఇంటికెళ్తున్న AE... 'పరిశ్రమలతో డైరెక్ట్ డీల్' కోసమే డిప్యుటేషన్ డ్రామా?*

Image
*PCB RC పురం ROలో 'సొంత' దందా: ప్రభుత్వ వాహనంతో ఇంటికెళ్తున్న AE... 'పరిశ్రమలతో డైరెక్ట్ డీల్' కోసమే డిప్యుటేషన్ డ్రామా?* *గుడాచారి.పేజ్ | ఎక్స్‌క్లూజివ్*  *"హైదరాబాద్ ZOలో కుర్చీ వదిలి, పటాన్చెరుకు పరుగు - కారణం అపరిశ్రమలతో కనెక్షన్' కోసమేనా?" - గుసగుసలు* *పటాన్చెరు, జూన్, 6, 2026:* తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి RC పురం రీజనల్ ఆఫీసులో నిబంధనలకు పాతరేసి 'సొంత' పాలన నడుస్తోందన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న ఓ AE-2 స్థాయి అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. *ప్రభుత్వ వాహనం = సొంత కారు? ఆఫీసు పనులకు వాడాల్సిన ప్రభుత్వ వాహనాన్ని సదరు AE సొంత అవసరాలకు వాడేస్తున్నారని, రాత్రి పూట ఏకంగా ఇంటికే తీసుకెళ్తున్నారని సిబ్బంది గుసగుసలాడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దిష్ట కేడర్ అధికారులకు మాత్రమే వాహనాన్ని నివాసానికి తీసుకెళ్లే అనుమతి ఉంటుంది. ఈ AEకి ఆ అర్హత లేదని సమాచారం. మరి RO గారు ఏం చేస్తున్నట్లు? నిబంధనలు అందరికీ సమానంగా వర్తించవా? RO వెంటనే సరిచూసుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. *'డిప్యుటేషన్...

*“పర్యావరణ పరిరక్షణ నైతిక బాధ్యత” – సనత్నగర్లో మంత్రి కొండా సురేఖ పిలుపు*

Image
*“పర్యావరణ పరిరక్షణ నైతిక బాధ్యత” – సనత్నగర్లో మంత్రి కొండా సురేఖ పిలుపు* *హైదరాబాద్:* “పర్యావరణ పరిరక్షణ ఒక నైతిక బాధ్యత. ప్రతి ఒక్కరూ సుస్థిర పద్ధతులను అవలంబించాలి. మనం మన ప్రకృతి మాతను కాపాడుకోవాలి. అడవుల నరికివేత, వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, ధాన్యం దిగుబడి తగ్గడం వల్ల ఆకలి పెరగడం వంటివన్నీ గ్లోబల్ వార్మింగ్ కారణంగానే జరుగుతున్నాయి. చికిత్స కన్నా నివారణే మేలు”   ఇదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సనత్నగర్లోని TGPCB ప్రధాన కార్యాలయంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రి *శ్రీమతి కొండా సురేఖ* చేసిన వ్యాఖ్యలు. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది ఇతివృత్తంగా ప్రకటించిన *“వాతావరణ చర్య”*పై ఆమె ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని నొక్కి చెప్పారు. కార్యక్రమానికి EFS&T ముఖ్య కార్యదర్శి *శ్రీ అహ్మద్ నదీమ్*, TGPCB బోర్డు సభ్యులు *సి. సత్యనారాయణ రెడ్డి*, ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్సార్టియం అధ్యక్షురాలు *టి. విజయలక్ష్మి*, JNTU-హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ తదితరులు హాజరయ్యారు. *2047 నాటికి 250 కోట్ల మొక్కలు*   EFS&T ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్ మాట్ల...

రసాయన కాలుష్యంపై అంతమ్మగూడెం వాసుల పోరాటం - స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కు వినతి

Image
  రసాయన కాలుష్యంపై అంతమ్మగూడెం వాసుల పోరాటం  - స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కు వినతి కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని స్పీకర్ హామీ మద్దతుగా నిలిచిన ప్రముఖ పర్యావరణవేత్తలు పురుషోత్తం రెడ్డి, దొంతి నరసింహారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ పరిధిలోని రసాయన పరిశ్రమల వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర కాలుష్య సమస్యలపై "అంతమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి" సమరశంఖం పూరించింది. హజేలో తదితర పరిశ్రమల నుండి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల పీల్చే గాలి, త్రాగే నీరు, తినే పంటలు, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయి గ్రామంలో జీవనం అస్తవ్యస్తంగా మారిందని, ఆరోగ్యం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ సమితి సభ్యులు బుధవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ గ్రామాన్ని కాలుష్యం బారి నుండి కాపాడాలని వేడుకున్నారు. ప్రముఖ పర్యావరణవేత్తలు కుంభం పురుషోత్తం రెడ్డి, దొంతి నరసింహారెడ్డి ల సహకారంతో స్పీకర్‌కు ఓ సమగ్ర వినతిపత్...

# అంబర్‌పేటలో ఘోరం: మహిళ మెడలోంచి 2.5 తులాల బంగారు గొలుసు అపహరణ!

Image
  ## అంబర్‌పేటలో ఘోరం: మహిళ మెడలోంచి 2.5 తులాల బంగారు గొలుసు అపహరణ! **హైదరాబాద్, జూన్ 2 (గూఢచారి ప్రతినిధి):** రాజధాని నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. పట్టపగలే నివాస గృహాల వద్దే మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళ మెడలోంచి దుండగుడు బంగారు గొలుసును లాక్కెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ### అసలేం జరిగిందంటే..? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలనీలోని 'వేదశ్రీ అపార్ట్‌మెంట్‌'లో నివసించే శ్రీమతి రత్నమాల అనే మహిళ మంగళవారం మధ్యాహ్నం బయటకు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఆమె అపార్ట్‌మెంట్‌ లోపలికి ప్రవేశిస్తున్న సమయంలో, అప్పటికే అక్కడ పొంచి ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి కాలినడకన ఆమె వద్దకు వచ్చాడు. సదరు వ్యక్తి రత్నమాలతో మాటలు కలుపుతూ నమ్మించడమే కాకుండా, ఆమె ఏమరపాటుగా ఉన్న సమయాన్ని చూసి ఒక్కసారిగా మెడలోని బంగారు గొలుసును తెంచుకుని వేగంగా పారిపోయాడు. అపహరణకు గురైన గొలుసు బరువు సుమారు **2.5 తులాలు** ఉంటుందని బాధితురాల...

*అమెరికాలో ఘనంగా టీసీఏ వనభోజనాలు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు*

Image
*అమెరికాలో ఘనంగా టీసీఏ వనభోజనాలు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు* *కుపర్టినో, కాలిఫోర్నియా, మే 31, 2026:* శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని కుపర్టినోలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో వార్షిక వనభోజనాలు సమ్మర్ పిక్నిక్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వందలాది కుటుంబాలు, కమ్యూనిటీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు. *తెలంగాణ రుచులు అమెరికాలో:*   ఈ వనభోజనాల్లో ఇంటి వంటకాల పాట్‌లక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ నుండి ప్రత్యేకంగా విమానంలో తెప్పించిన సకినాలు అందరినీ అలరించాయి. అక్కడికక్కడే వేడివేడిగా తయారుచేసిన సర్వపిండి, దానితో పాటు నిలోఫర్ స్టైల్ ఇరానీ చాయ్ కాంబినేషన్ పాల్గొన్నవారిని ఎంతగానో ఆకట్టుకుంది. హైదరాబాదీ వంటకాలు, సమోసాలు, ఇతర చిరుతిళ్లతో వేడుకకు తెలంగాణ శోభ సంతరించుకుంది. *వాలంటీర్ల సేవలకు ప్రశంసలు:*   TCA సౌత్ బే నాయకత్వ బృందం అంజనేయులు పి, గోపీకృష్ణ జి, శ్రీధర్ జి లతో పాటు అనంత్ ఎ, అశోక్ సి, భాస్కర్ ఎం, సుధీర్ జి, మాధవ్ కె, రాజ్‌కుమార్ ఎం, సతీష్ ఎ, ఉదయ్ జె, యా...

రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం.. అందరికీ వనమా వెంకటేశ్వర్ల కృతజ్ఞతలు

Image
  రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం.. అందరికీ వనమా వెంకటేశ్వర్ల కృతజ్ఞతలు నల్గొండ: రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా వనమా వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేస్తూ, తనకు ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, చిట్యాల మండల నాయకులు, కార్యకర్తలు మరియు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో అందించిన సహకారం మాదిరిగానే, ఇకపై రాష్ట్ర ఉపాధ్యక్షునిగా తన బాధ్యతల నిర్వహణలో కూడా నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకులు, సభ్యులు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఆర్యవైశ్య సమాజ అభ్యున్నతి, సంఘ బలోపేతం మరియు సామాజిక సేవా కార్యక్రమాల కోసం మరింత కృషి చేస్తానని వనమా వెంకటేశ్వర్లు తెలిపారు. .

సిగరెట్ మానెయ్..బిడ్డా.! *ఒక చిన్న నిర్ణయం…ఒక పెద్ద మార్పు* (మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం)

Image
  సిగరెట్ మానెయ్..బిడ్డా.! *ఒక చిన్న నిర్ణయం…ఒక పెద్ద మార్పు* (మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం) సిగరెట్ మానెయ్ బిడ్డా.. ఏమండి స్మోకింగ్ మనరా.?! ప్లీజ్  నాన్నా..స్మోకింగ్ కిల్స్ యూ.. నాన్న. ఈ మాటలు..విని,విని  ఆ అలవాటు మనలేక గోడకు ఫోటో ఐ"పోయే" బదులు.. ఒక్క క్షణం మనల్ని ప్రాణం గా.. ప్రేమించే వారి కోసం.. సిగరెట్ అలవాటు ను జీవితం లో నుంచి విసిరి అవతల పారెయ్యండి. పొగాకు, సిగరెట్ మానడం కష్టం కావచ్చు. కానీ అసాధ్యం కాదు. ఒక రోజు సిగరెట్ లేకుండా ఉండగలిగితే, ఒక వారం కూడా ఉండగలరు. ఒక వారం గడిస్తే, ఒక జీవితం గెలవగలరు. మీ పిల్లల కోసం… మీ తల్లిదండ్రుల కోసం… మీ భార్య కోసం… ముఖ్యంగా — మీ ప్రాణం కోసం. సిగరెట్ వెలిగించినప్పుడు మనం కేవలం పొగను కాదు…మన జీవిత కాలాన్ని కాలుస్తున్నాం. పొగాకు మొదట అలవాటుగా వస్తుంది… తర్వాత అవసరంగా మారుతుంది… చివరికి మనిషిని నిశ్శబ్దంగా మరణం వైపు నడిపిస్తుంది. అందుకే ఈ *World No Tobacco Day* సందర్భంగా మనమందరం ఒక మాట మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి: “పొగాకు కాదు… ప్రాణమే ముఖ్యం.” ఎందుకంటే — ఒక సిగరెట్ ఆర్పేస్తే ఒక జీవితం వెలుగుతుంది. చివరిగా ఏమంటే సరదా అంటూ సిగరె...

"ఉప్పల స్వప్న గారికి ప్రతిష్టాత్మక “ఎన్టీఆర్ సేవా రత్న అవార్డు"

Image
  "ఉప్పల స్వప్న కు ప్రతిష్టాత్మక “ఎన్టీఆర్ సేవా రత్న అవార్డు”  హైదరాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ (IVF) ప్రధమ మహిళ  శ్రీమతి ఉప్పల స్వప్న కు ప్రతిష్టాత్మకమైన “కళావేదిక ఎన్టీఆర్ సేవా రత్న అవార్డు”.  సామాజిక సేవా రంగంలో మరియు మహిళా సాధికారత కోసం ఆమె అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా నిర్వాహకులు ఈ పురస్కారాన్ని అందజేశారు. అమీర్‌పేటలోని AAA సినిమాస్‌లో అత్యంత వైభవంగా జరిగిన “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025” వేడుకలో సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సమక్షంలో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అతిథులు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను బహూకరించారు. అవార్డుతో బాధ్యత మరింత పెరిగింది: ఉప్పల స్వప్న పురస్కారాన్ని అందుకున్న అనంతరం ఉప్పల స్వప్న గారు మాట్లాడుతూ.. మహానటుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో నెలకొల్పిన ఈ అవార్డును అందుకోవడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. "నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డుతో సమాజం పట్ల నా బాధ్యత మరి...

‘సూటు-బూటు’ మేధావులారా... మీ ‘లెఫ్ట్’ అనాలసిస్‌లు సనాతన సంస్కృతి ముందు ఎంత?

Image
 గూఢచారి స్పెషల్: ‘సూటు-బూటు’ మేధావులారా... మీ ‘లెఫ్ట్’ అనాలసిస్‌లు సనాతన సంస్కృతి ముందు ఎంత? యూట్యూబ్ కెమెరాల ముందు కూర్చోవడం, సూటు-బూటు వేసుకుని గంభీరంగా గొంతు సవరించుకోవడం, తామేదో సమాజాన్ని ఉద్ధరించే ‘మేధావులం’ అని కలరింగ్ ఇచ్చుకోవడం... ఈ మధ్య కాలంలో కొందరు సోషల్ మీడియా విశ్లేషకులకు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా లెఫ్ట్ సిద్ధాంతాల ముసుగులో, విశ్లేషణల పేరుతో సనాతన సంస్కృతిని, సంప్రదాయాలను టార్గెట్ చేయడం ఒక ట్రెండ్‌గా మార్చారు. కానీ వీరు గుర్తించని నిజం ఒక్కటే... ఈ దేశ మూలాలను కదిలించడం మీ యూట్యూబ్ థంబ్నైల్స్ మార్చినంత సులువు కాదు! 2000 ఏళ్ల చరిత్రే ఏం చేయలేకపోయింది.. మీరెంత? ఈ దేశంపై ఎందరో దండయాత్రలు చేశారు. 2000 ఏళ్లుగా ఎందరో పాలకులు ఈ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలని చూశారు. నలందా విశ్వవిద్యాలయాన్ని తగులబెట్టారు, దేవాలయాలను కూల్చారు, మతాంతర మార్పిడులకు ఒడిగట్టారు. కానీ, ఇంతటి పెనుతుఫానులను తట్టుకుని, కాల గర్భంలో కలిసిపోకుండా నేటికీ సజీవంగా, సగర్వంగా నిలబడింది మన భారతీయ సంస్కృతి. అలాంటి గొప్ప సంస్కృతిని, చరిత్రను... నాలుగు వ్యూస్ కోసం, కొన్ని లైక్స్ కోసం యూట్యూబ్ ఛ...

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

Image
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా? తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కుల బాంధవుల శ్రేయస్సు, పేద వైశ్యుల అభ్యున్నతే లక్ష్యంగా సాగాల్సిన మహాసభ.. ఇప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమైన “పక్షపాత మహాసభ”గా మారుతోందా అనే అనుమానాలు సగటు ఆర్యవైశ్యుడి మెదడును తొలిచేస్తున్నాయి. ముఖ్యంగా గత 12 ఏళ్లుగా రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉత్తర తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న చర్చ.. ఇప్పుడు మహాసభ పునాదులను కదిలిస్తోంది. మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, కేవలం తూతూమంత్రంగా జనగాం నుండి మహిళా విభాగంలో ఒకరికి స్థానం కల్పించి చేతులు దులుపుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, అసలు సిసలైన సింహభాగం పదవులన్నీ దక్షిణ తెలంగాణ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు, కొద్దిమంది ప్రభావశీలురకే కట్టబెడుతున్నారనేది బహిరంగ రహస్యం. కొత్త సీసాలో పాత సారా: ఒకరికే అన్ని పదవులా? ఇటీవల కొండ్రే మల్లికార్జున్ ని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై సంఘంలో అ...

ఆర్యవైశ్య మహాసభలో 'కీలక' నియామకాలు.. బైలా వివాదంపై రిజిస్ట్రార్ నజర్!

Image
ఆర్యవైశ్య మహాసభలో 'కీలక' నియామకాలు.. బైలా వివాదంపై రిజిస్ట్రార్ నజర్! హైదరాబాద్:గూఢచారి:  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఎట్టకేలకు కీలక  సర్దుబాటు పూర్తయింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఎన్నికల్లో కొద్దిపాటి మెజారిటీతో పీఠాన్ని దక్కించుకున్న అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, దాదాపు రెండు నెలల సుదీర్ఘ కసరత్తు తర్వాత తన కోటరీని సిద్ధం చేసుకున్నారు. మహాసభ ప్రధాన కార్యదర్శిగా కొండ్లే మల్లికార్జున్ ను నియమించారు, కోశాధికారిగా రేణుకంట్ల గణేష్ గుప్తాను ఖరారు చేసినట్లు సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది.  ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంఘంలో హాట్ టాపిక్‌గా మారింది. అసంతృప్తుల నడుమ నియామకాల జోరు! ఎన్నికలు ముగిసి రెండు నెలలు గడుస్తున్నా కార్యవర్గ విస్తరణ జరగకపోవడంతో ఇన్నాళ్లూ రకరకాల ఊహాగానాలు సాగాయి. తీరా ఇప్పుడు నియామకాలు జరిపినా, అంతర్గతంగా అందరినీ సమన్వయం చేయడం అమరవాదికి అంత తేలికైన విషయమేమీ కాదనే టాక్ వినిపిస్తోంది. ఒకవైపు ఈ పదవుల పంపకంపై హర్షం వ్యక్తమవుతుండగా, మరోవైపు ఆశావహుల అసంతృప్తి సెగలు కూడా లోపాయికారీగా పొగలుగక్కుతున్నట్లు సమాచారం. తెరపైకి 'బైలా' వివాదం.. రిజిస్ట్రార్ నోటీసుల ...

శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ పంజా: రూ.30 లక్షల డిమాండ్.. రూ.2 లక్షలు నొక్కేస్తూ డ్రైవర్, ఎమ్మార్వో రెడ్ హ్యాండెడ్!

Image
శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ పంజా: రూ.30 లక్షల డిమాండ్.. రూ.2 లక్షలు నొక్కేస్తూ డ్రైవర్, ఎమ్మార్వో రెడ్ హ్యాండెడ్! మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం మరోసారి అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది. భూమి కన్వర్షన్ కోసం ఏకంగా రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఉదంతంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించి గుట్టు రట్టు చేశారు. రూ.30 లక్షల డీల్.. ఎకరానికి లక్ష చొప్పున వేట! శామీర్‌పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమిని కన్వర్షన్ (ల్యాండ్ కన్వర్షన్) చేయడానికి సంబంధించి ఒక రైతు కన్సల్టెంట్ నుంచి ఇక్కడి అధికారులు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.1 లక్ష చొప్పున.. మొత్తం రూ.30 లక్షలు ఇస్తేనే పని జరుగుతుందని కరాఖండిగా చెప్పారు. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో వ్యూహాత్మకంగా నిఘా పెట్టారు. డ్రైవర్ ద్వారా వసూళ్లు.. రెడ్ హ్యాండెడ్‌గా! లంచం మొత్తంలో భాగంగా మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. తహసీల్దార్ (ఎమ్మార్...

మాజీ మంత్రి హరీష్ ను కలిసిన డాక్టర్ శ్రీహరి

Image
  మాజీ మంత్రి హరీష్ ను కలిసిన డాక్టర్ శ్రీహరి  సంగారెడ్డి  అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావును సంగారెడ్డికి చెందిన సీనియర్ నేత డాక్టర్ శ్రీహరి మంగళవారం ఉదయం కలిశారు. ఇటీవల హరీష్ రావు అమెరికా నుంచి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశామని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా తిరిగి కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. గతంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని  అన్నారు.నాడు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు . తిరిగి కెసిఆర్ పాలన వస్తుందని చెప్పారు . యువ నాయకుడు శ్రీకాంత్ కూడా హరీష్ రావును కలిసిన వారిలో ఉన్నారు.

అధికారుల 'మామూళ్ల' మత్తు?.. అంతమ్మగూడెంలో కాలుష్య కాటు!

Image
అధికారుల 'మామూళ్ల' మత్తు?.. అంతమ్మగూడెంలో కాలుష్య కాటు! * కమిటీల పేరుతో కలెక్టర్, పిసిబి మెంబర్ సెక్రటరీ కాలయాపన!* ఫిర్యాదుదారుల గొంతు నొక్కుతున్న TSPCB! * 11 ఏళ్లుగా సాగుతున్న పోరాటం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగం. * తనిఖీలు వాయిదా వేసి పరిశ్రమలకు 'క్లీన్ చిట్' ఇచ్చే కుట్ర?  (హైదరాబాద్‌ గూఢచారి)  ప్రజా ఆరోగ్యం కంటే పారిశ్రామికవేత్తల లాభాలే పరమావధిగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (TSPCB) ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.  కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీలు M/S హెజెలో లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (అంతమ్మగూడెం) M/s బృందావన్ లాబొరేటరీస్ (ఎలగిరి) M/S శ్రీ జయ లాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ (మల్కాపూర్) M/S వినీత్ లాబొరేటరీస్ లిమిటెడ్ (మల్కాపూర్) M/S రావూస్ లాబొరేటరీస్ లిమిటెడ్ (దోతీగూడెం) M/S ఎస్ వి ఆర్ లాబొరేటరీస్ (దోతీగూడెం) M/S వి.జె. సాయి కెమ్ (దోతీగూడెం) M/S కెమిక్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (దోతీగూడెం) M/S ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (దోతీగూడెం) M/S ఆర్కిమెడిస్ లాబొరే...