Posts

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రసవత్తరం

Image
ఎవరి ధీమా వారధి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రసవత్తరం *ముందంజ లో శ్యామ్ సుందర్*   *అపవాదు ముట్టగట్టుకున్న అమరవాది.* హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తరువాత తెలంగాణ మహాసభ కు మొదటి సారి ఎన్నికల పోలింగ్ మంగళవారం లక్డికపూల్ వాసవి సేవ కేంద్రమంలో జరగనుంది.  మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మిడిదొడ్డి శ్యామ్ సుందర్, రంగారెడ్డి జిల్లాకి చెందిన అమరవాది లక్ష్మీనారాయణ, కరీంనగర్ కు చెందిన బుస్సా శ్రీనివాస్ లు ఈ ఎన్నికల్లో పోటీపడు తున్నారు. అయితే ఉపసంహరణ అనంతరం బుస్సా శ్రీనివాస్ విరమించుకున్నట్లు సోషల్ మీడియాలో ఆయన ప్రకటించారు.  గత 12 ఏండ్ల నుండి ఎన్నికలు అమరవాది జరపలేదని అక్రమంగా ఉన్నాడని, శ్యాంసుందర్ వర్గం కోర్టుకు పోయి అమరవాది అక్రమాలను ప్రశ్నించడం తో కోర్టు అడ్వకేటు కమీషనర్ చే ఎన్నికలు కొనసాగించడానికి ఆర్డర్ ఇచ్చింది.  గత సంవత్సరం ఎన్నికలు ప్రకటించిన అమరవాది బైలా కు విరుద్ధంగా నోటిఫికేషన్ ఇవ్వడం, అక్రమంగా శ్యాంసుందర్ నామినేషన్ ను తిరస్కరించడం తో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అమరవాదిని ముద్దాయిగా ఆర్యవైశ్...

దుండిగల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సస్పెన్షన్

Image
 BREAKING: దుండిగల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సస్పెన్షన్  కుత్బుల్లాపూర్ జోన్ దుంగిడల్ సర్కిల్లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ (TPS) సంజనను అవినీతి ఆరోపణలతో సస్పెండ్ చేశారు. జోనల్ కమిషనర్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 19న ACB అధికారులు దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనధికారిక నగదు లావాదేవీలు ఆమె భర్తకు చెందిన సంస్థకు మళ్లించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో భాగంగా చర్యలు తీసుకున్నారు.

మిడిదొడ్డి శ్యాంసుందర్ని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం - తేడ్ల జవహర్ బాబు, నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు

Image
 జై వాసవి జై జై వాసవి  మిడిదొడ్డి శ్యాంసుందర్ని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం - తేడ్ల జవహర్ బాబు, నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడి బహిరంగ ప్రకటన చదవండి.  తెలంగాణ రాష్ట్ర మహాసభ కౌన్సిల్ మెంబర్ లందరికీ నమస్కారం, ఈనెల 17వ తారీఖున రాష్ట్ర మహాసభ ఎన్నికలలో ఓటు వేసేటప్పుడు కింది విషయాలను గమనించి ఓటు వేయగలరని మనవి,  *తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నాయకత్వ మార్పు కోసం పోరాటం చేస్తున్న మిడిదొడ్డి శ్యాంసుందర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం, ఏ మంచి పని అయినా మారుపుతోనే సాధ్యం.*   ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో అమరవాది లక్ష్మీనారాయణ గారు నైతికంగా ఓడిపోయారు.  అమరవాది లక్ష్మీనారాయణ గత 13 సంవత్సరాలుగా రాష్ట్ర మహాసభ అధ్యక్షుడిగా కొనసాగారు, మళ్లీ అతనికి అధ్యక్ష పదవి కట్టబెడదామా??  తెలంగాణ రాష్ట్రంలో అమరవాది లక్ష్మీనారాయణ గారు తప్ప వైశ్య కులంలో ఎవరు తెలివిగల వాళ్ళు, సమర్ధులు, నాయకత్వ లక్షణం గల వాళ్ళు లేరు అనుకోని ఎప్పటికీ తానే శాశ్వతంగా నియంత మాదిరిగా అధ్యక్షుడిగా ఉండాలనుకుంటారు, అతనిని సమర్థిద్దామా??  రాష్ట్రంలో ఆర్యవైశ్య...

సూర్యాపేటలో మిరుదొడ్డి శ్యామ్ కి బ్రహ్మరథం

Image
 *ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అద్యక్షులు గా మిరుదొడ్డి శ్యామ్ సుందర్ ని అత్యదిక మెజారిటీతో గెలిపించాలి* *మీలా వంశి ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో మద్దతు పలికిన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు* సూర్యాపేట పట్టణం లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు శుక్రవారం సాయంత్రం ఆర్యవైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మీలా వంశీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ అద్యక్షులుగా పోటి చేస్తున్న మిరుదొడ్డి శ్యామ్ సుందర్ కు మద్దతుగా జరిగిన సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బచ్చు రామకృష్ణ మాట్లాడుతూ అమరావది లక్ష్మి నారాయణ గత 12 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేకుండా తానే చైర్మన్ గా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతిస్తున్నారని అన్నారు. రాష్ట్ర మహాసభకు ఎన్నికలు నిర్వహించాలని మిరుదొడ్డి శ్యామ్ సుందర్ పోరాటం చేసి ఎన్నికలు తీసుకుని రావడం జరిగిందని అన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందరూమిరుదొడ్డి శ్యాంసుందర్ కు అత్యదికంగా ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శ్యామ్ సుందర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్యవైశ్య భవన్ నిర్మాణం చేయడంతో పాటు, కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు...

ఆర్యవైశ్యుల శక్తి అపారం - మంత్రి వాకిటి శ్రీహరి

Image
  ఆర్యవైశ్యుల శక్తి అపారం - మంత్రి వాకిటి శ్రీహరి * జయాపజయాలను ప్రభావితం చేయగలరు * వాసవీ పారాయణం ప్రపంచ రికార్డు సృష్టించాలి హైదరాబాద్:  ఆర్యవైశ్యుల శక్తి అపారం..వారు తలచుకుంటే రాజకీయాలను , జయాపజయాలను ప్రభావితం చేయగలరని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వారు రాజకీయాల్లో ఎదగాలన్నారు.ప్రపంచ రికార్డు సృష్టించే స్థాయిలో ఆర్యవైశ్యులు వాసవి మాత పారాయణం చేయ తలపెట్టడం హర్షణీయమని అన్నారు. ఎల్బీ స్టేడియం దద్దరిల్లేలా నలభై వేల మందితో... భవిష్యత్తులో ఎవరూ చేయలేని విధంగా వాసవీమాత పారాయణం చేయాలన్నారు. ఆ రికార్డు కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు  శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం పేరిట ఈనెల 22న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సామూహిక పారాయణానికి సంబంధించి  గురువారం బంజారా హిల్స్ పార్క్ హోటల్ కర్టెన్ రెయిజర్ కార్యక్రమం జరిగింది.‌ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.‌ ఆయన మాట్లాడుతూ కల్వ సుజాత సంకల్పాన్ని కొనియాడారు. . శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం విజయవంతం కావాలని ఐ అండ్ పీ ఆర...

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవిపోటీలో ముగ్గురు అభ్యర్థులు

Image
 *రాష్ట్ర మహాసభ అధ్యక్ష పదవిపోటీలో ముగ్గురు అభ్యర్థులు.* గూఢచారి, హైదరాబాద్ మార్చి 12: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో ఉపసంహరణల అనంతరం ముగ్గురు అభ్యర్థులు పోటీలో వున్నారు.* *1.అమరవాది లక్ష్మీనారాయణ.* *2. బుస్స శ్రీనివాస్.* *3.మిడిదొడ్డి శ్యామ్ సుందర్ లు పోటీలో వున్నారు.* *ఈనెల మార్చి 17 మంగళవారం రోజున ఎన్నికలు నిర్వహించబడతాయి. మొత్తం 1109 మంది ఓటర్లు వున్నారు.*

2026-2028 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహా సభ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులు

Image
 2026-2028 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహా సభ స్క్రూటినీ తరువాత అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థుల వివరాలు తేదీ: 11-03-2026 1. అమరవాది లక్ష్మీ నారాయణ 2. ఎ.వి. మల్లికార్జున్ 3. బస్సు శ్రీనివాస్ 4. DOSAPATI VENKATESHWARA RAO 5. ఎరుకుళ్ల రామకృష్ణ 6. కోలేటి రమేష్ 7. కొండేల్ మోడల్ బేర్ 8. KOTHA SRINIVASULU GUPTA 9. ఎల్.వి. కుమార్ 10. మిద్దొద్ది శ్యామ్ సుందర్ 11. NETHI RAMULU 12. పార్సీ ప్రకాష్ గుప్తా 13. రేణికుంట్ల గణేష్ గుప్తా 14. THATIPALLY RAJANNA 15. వంగేటి అశోక్ _ అడ్వకేట్ కమీషనర్

నామినేషన్ దాఖలు చేసిన మిడిదొడ్డి శ్యామ్ సుందర్

Image
 హైదరాబాదులోని చింతల బస్తి మహాసభ కార్యాలయంలో బుధవారం వివిధ జిల్లాల నాయకులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నిక ల నామినేషన్ దాఖలు చేసిన మిడిదొడ్డి శ్యామ్ సుందర్ 

శ్రీ వాసవి సామూహిక పారాయణ ఉత్సవానికి సంబంధించి కర్టెన్ రైజర్ ప్రోగ్రాంకు మంత్రులను ఆహ్వానించిన కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త

Image
శ్రీ వాసవి సామూహిక పారాయణ ఉత్సవానికి సంబంధించి  కర్టెన్ రైజర్ ప్రోగ్రాంకు మంత్రులను ఆహ్వానించిన కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త హైదరాబాద్:   తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త ఆధ్వర్యంలో ఈనెల 22న జరగనున్న శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం-సామూహిక పారాయణ ఉత్సవానికి సంబంధించి రేపు  గురువారం సాయంత్రం 6 గంటలకు బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరగనున్న కర్టెన్ రైజర్ ప్రోగ్రాంకు మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క లను ఆహ్వానిస్తున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కల్వ సుజాత, బెల్ది శ్రీధర్ లు.   కొణిజేటి శివ సుబ్బారావు (కీ.శే. శ్రీ రోశయ్య గారి తనయుడు) కి ఆహ్వాన పత్రిక ను అందచేశారు. 

18,000/- #లంచం

Image
 కూకట్‌పల్లి జోన్, మూసాపేట్ సర్కిల్-53 కమ్యూనిటీ ఆర్గనైజర్ కె. మురళి, ఒక మహిళా పొదుపు సంఘానికి మంజూరైన రూ. 20 లక్షల రుణాన్ని ప్రాసెస్ చేసినందుకు గాను, ప్రతి లక్షకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం రూ. 18,000/- #లంచం డిమాండ్ చేశారు.  బాధితుడి నుండి కె. మురళి ఈ మొత్తాన్ని స్వీకరిస్తుండగా తెలంగాణ #అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పట్టుకున్నారు.

*తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష (2026-28) ఎన్నికల షెడ్యూలు విడుదల*

Image
*తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష (2026-28) ఎన్నికల షెడ్యూలు విడుదల* *తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష (2026-28) ఎన్నికల షెడ్యూలు ఈ రోజు అడ్వకేట్ కమీషనర్ పి. బాలగోపేంద్రనాథ్ విడుదల చేశారు.  అడ్వకేట్ కమీషనర్ పి. బాలగోపేంద్రనాథ్ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ లో 2026-2028 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహా సభ అధ్యక్షుడి ఎన్నికల (రిజిస్టర్ నం. 363/2015) ఎన్నికల షెడ్యూల్ క్రింది విధంగా ఉంది. 11-03-2026 ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 03.00 గంటల వరకు నామినేషన్ జారీ & స్వీకరణ. సాయంత్రం 04.00 గంటలకు పరిశీలన, సాయంత్రం 05.00 గంటలకు పోటీ అభ్యర్థుల జాబితా ప్రకటన. 12-03-2026 ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 04.00 గంటల వరకు ఉపసంహరణలు, తుది పోటీ అభ్యర్థుల జాబితా ప్రకటన. పైన పేర్కొన్న ప్రక్రియ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోని చింతల్‌బస్తీలోని వైశ్య భవన్‌లో జరుగుతుందనీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.   17-03-2026 ఉదయం 09.00 గంటల నుండి సాయంత్రం 05.00 గంటల వరకు పోలింగ్, సాయంత్రం 06.00 గంటలకు లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన. ఈ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ :Vasavi Kalyana Mandapam...

హిమాయత్‌సాగర్ పరిసరాల్లో అక్రమ మైనింగ్ – ‘మరో KGF’లా ప్రకృతి వనరుల దోపిడీ: ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్

Image
హిమాయత్‌సాగర్ పరిసరాల్లో అక్రమ మైనింగ్ – ‘మరో KGF’లా ప్రకృతి వనరుల దోపిడీ: ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ హిమాయత్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్, క్రషర్ యూనిట్ల కార్యకలాపాలపై బీఆర్‌ఎస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పరిశీలన నిర్వహించినట్లు ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తెలిపారు. హిమాయత్‌సాగర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 66, 67, 68, 69లో నడుస్తున్న క్రషర్ యూనిట్లను బృందం ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందంలో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్‌తో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, రాజేంద్రనగర్ పార్టీ ఇన్‌చార్జ్ పట్లొళ్ల కార్తీక్ రెడ్డి, ఎస్సీ–ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్లు డా. క్రిశాంక్, డా. వాసుదేవ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేంద్రాచారి, కే. కిషోర్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకుడు అభిలాష్ రంగినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే KGF సినిమా గుర్తుకు వచ్చిందన్నారు. భూమాతను చెరబట్టి ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ...

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు

Image
  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత  ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని  అడ్వకేట్  కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు హైద్రాబాద్: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ  ఓటర్ల లిస్టు లో అర్హత లేని వారు నల్లగొండ జిల్లా ఓటర్ల ను తయారు చేశారని అట్టి ఓటర్ లిస్టు చెల్లదని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ, ఎన్నికల కొరకు కోర్టు నియమించిన అడ్వకేటు కమీషనర్ పి. బాల గోపేంద్రనాథ్ కు అభ్యంతరాలు వ్యక్త పరుస్తూ భూపతి రాజు ఫిర్యాదు అందచేశారు. ఆ ఫిర్యాదు లో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు నిర్వహించుటకు తమరిని కోర్టు అడ్వకేటు కమీషనర్ గా నియమించారని ప్రస్తుతము ఉన్న ఓటర్స్టు పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 2026 మార్చి 3.4,5 తేదీలలో తెలపవలసిందిగా కోరుతూ ఈనాడు దిన పత్రికలో పబ్లిక్ నోటీసు ను తమరు ప్రకటించారని, నల్లగొండ ఓటర్ లిస్టు చెల్లదని వివరాలు తెలిపారు. నేను అనగా భూపతి రాజు (తండ్రి భద్రాద్రి) రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ జీవిత సభ్యుడననీ, ( జీవిత సభ్యునిగా నా సభ్యత్వ నంబరు 56924), ప్రస్తుతము జిల్లా ఉపాధ్యక్షులు గా ఉన్నానని , నా అడ్రసు: 6-2-1061/2 , వీటి కాలని, నల్గొండ 508001 . సెల్: 9848490545 ని తమరికి చ...

ఎంజీయూ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ ఉత్సవాలు..

Image
 ఎంజీయూ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ ఉత్సవాలు.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం శాఖ ఏబీవీపీ ఆధ్వర్యంలో హోలీ ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడ్డాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం రంగులు చల్లుకుంటూ సాంప్రదాయబద్ధంగా హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షులు హనుమాన్ మాట్లాడుతూ... హోలీ పండుగ ఐక్యత,స్నేహభావానికి ప్రతీక అని తెలిపారు.భేదాభిప్రాయాలను పక్కనబెట్టి విద్యార్థులంతా కలిసిమెలిసి ముందుకు సాగాలని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మోహన్,అజయ్,మౌనేష్ సతీష్,విజయ్,సంపత్,వెంకటేష్ సుధీర్,నగేష్,శంకర్,సాయి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్‌

Image
 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్‌ హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ కార్యాలయానికి ఎన్నికలు నిర్వహించడానికి తనను కమిషనర్‌గా నియమింప బడినట్లు  పి. బాల గోపేంద్రనాథ్‌ (అడ్వకేట్ కమిషనర్) పబ్లిక్ నోటీస్ ను దిన పత్రికలో ప్రకటించారు. ఖైరతాబాద్ లోని చింతల్‌బస్తీ నంబర్ 6-2-648లో రిజిస్టర్డ్ కార్యాలయం ఉంది. దీనిని సాధారణంగా "వైశ్య భవన్" అని పిలుస్తారని , ప్రస్తుత ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈ నోటీసు ప్రచురించబడిన తేదీ నుండి మూడు రోజుల్లోపు అంటే 03-03-2026 నుండి 05-03-2026 వరకు నాకు లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చునని, తాను స్వయంగా ఈ మూడు రోజులు అంటే మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం 1-00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు హైదరాబాద్‌లోని వైశ్య భవన్ చింతల్‌బస్తీలో అందుబాటులో ఉంటాననీ, ఆ తర్వాత వచ్చే అభ్యంతరాలను స్వీకరించరని పబ్లిక్ నోటీస్ లో పేర్కొన్నారు. ఓటర్ల లిస్టులో పేర్లు కోల్పోయినవారికి ఇది మంచి అవకాశము. తమ హక్కును నిరంకుశ ధోరణిలో తొలిగిపబడ్డ వారు వారి అభ్యంతరాలు సమర...

ఐ ఎన్ టి యు సి నేతకు ఘనంగా పదవి విరమణ వీడ్కోలు

Image
  ఐ ఎన్ టి యు సి నేతకు  ఘనంగా పదవి విరమణ  వీడ్కోలు  సంగారెడ్డి (కంది) ఎదు మైలారం ఓడిఎఫ్ కర్మాగారంలో శనివారం పదవి విరమణ పొందిన ఐ ఎన్ టి సి ప్రధాన కార్యదర్శి జోగన్న గారి యాదగిరికి కార్మికులు ఘనంగా వీడ్కోలు పలికారు మధ్యాహ్నం సమయంలో గేటు నుంచి బయటికి రాగానే ఆయనపై పూలు చల్లి అభినందించారు. గత 36 సంవత్సరాలుగా యాదగిరి విధులు నిర్వహించారని అన్నారు.సాధారణ కార్మికునిగా ఉద్యోగంలో చేరి కార్మిక సంఘం నేతగా అనేక పోరాటాలు నిర్వహించారని వక్తలు కొనియాడారు కార్మికుల పక్షాన పని చేయడంతో పాటు యాజమాన్యంతో కూడా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించినారని వారు అభినందించారు పేద కార్మికుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం యాదగిరి ఇంతకాలం పనిచేసిన సంగతిని వారు గుర్తు చేసుకున్నారు పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి అత్యంత సహజమని వారన్నారు కార్మికుల పక్షాన యాదగిరి లాగా పోరాడే వ్యక్తిని ఇప్పట్లో చూడలేమని వారు పేర్కొన్నారు యాదగిరి మంజుల దంపతులను ఈ సందర్భంగా గజమాలతో సత్కరించారు అభినందించారు కార్మిక సంఘాల నేతలతో పాటు జోగిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లయ్య, కుందారం రాజయ్య పోతేధర్ మనోహర్, లైన్స్ క్లబ్ కార్యదర్శి అంజయ్య పు...

70 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన........

Image
 70 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన........ సూపరింటెండెంట్ (జనరల్) O/O ది కమిషనర్ & డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, సైఫాబాద్, హైదరాబాద్ మరియు సీనియర్ అసిస్టెంట్, 0/0 ది DEO రంగారెడ్డి ACB కి పట్టుబడ్డారు. 19.02.2026న, హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లోని కమిషనర్ & స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ AO-1 సంగీత ఫణిరాజ్, AO-2 గుమ్మిడల శ్రీధర్ సీనర్ అసిస్టెంట్ 0/0 DEO ద్వారా ఫిర్యాదుదారుడి నుండి రూ. 70,000/- లంచం మొత్తాన్ని వసూలు చేసి, దానికి పాల్పడినప్పుడు ACB సిటీ రేంజ్-1 యూనిట్ వారిని పట్టుకుంది. "2026-2027 అకాడమిక్ సంవత్సరానికి ఫిర్యాదుదారు స్కూల్ CBSE NOC సర్టిఫికేట్ దరఖాస్తును ప్రాసెస్ చేయడం, ఫైల్‌ను ఉన్నత అధికారులకు పంపడం" కోసం అతను ఫిర్యాదుదారుడి నుండి రూ. 70,000/- లంచం తీసుకోవడానికి పాల్పడ్డాడు. AO-2 వద్ద నుండి కళంకిత లంచం మొత్తం రూ. 70,000/- స్వాధీనం చేసుకున్నారు.  AO-1 మరియు AO-2 లను అరెస్టు చేసి, గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తి SPE & ACB కేసుల ముందు హాజరుపరుస్తున్నారు, నాంపల్లి హైదరాబాద్. కేసు దర్యాప్తులో ఉంది.

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్

Image
 భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్ రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్), పున్నం రజిత, కొమ్ము సునీతలు పట్టుబడ్డారు సర్టిఫైడ్ కాపీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా సీహెచ్ గోపాలరావు అనే న్యాయవాది  ఏసీబీ అధికారులను ఆశ్రయించారు దీంతో రైడ్స్ జరిపిన ఏసీబీ అధికారులు ముగ్గురిని పట్టుకున్నారు

నుమాయిష్ 2026లో ఉత్తమ ప్రదర్శన స్టాల్‌గా టి జి పి సి బి స్టాల్ ఎంపిక.

Image
  నుమాయిష్ 2026లో ఉత్తమ ప్రదర్శన స్టాల్‌గా టి జి పి సి బి స్టాల్ ఎంపిక. హైద్రాబాద్: ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమైష్ -2026)లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్ ఉత్తమ ప్రదర్శన స్టాల్‌గా ఎంపిక అయ్యింది ఈ స్టాల్ కాలుష్య నియంత్రణ పై ప్రజల్లో అవగాహన. కలిగించింది.   ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ప్రదర్శన స్టాల్ను (టీజీపీసీబీ) ఏర్పాటు చేసింది. ఈ స్టాల్లో మునిసిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ, పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు, పరిశ్రమల వల్ల కలిగే జల కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఈ-వ్యర్థాల (ఈ-వేస్ట్) నిర్వహణ, కాలుష్యం వలన పర్యవరణానికి కలిగే హాని పై సమాచారం అందించారు. వివిధ రకాల పోస్టర్లు ప్రదర్శనల ద్వారా కాలుష్యానికి కారణాలు, దుష్పరిణామాలు మరియు నియంత్రణ చర్యలపై సందర్శకులకు అవగాహన కల్పించారు. “పంటల మిగులు అవశేషాలను (స్టబ్బుల్) కాల్చడం భారతదేశంలో గాలి కాలుష్యాన్ని పెంచుతున్న ప్రధాన సమస్యగా మారింది. పంటల స్టబ్బుల్ను వెర్మీకంపోస్ట్గా మార్చాలి. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వినియోగాన్ని ప్రోత్సహించాలి మరియు 15 సంవత్సరాలకు మించ...

ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది - జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ .

Image
ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది -  జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ . మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు, జిల్లాలోని 6 మున్సిపల్టీలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు.         బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన  వెంటనే ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాల లో ఏర్పాటుచేసిన  పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఓటర్లకు చేసిన ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలించారు. అన్ని గదుల నుండి వెబ్ క్యాస్టింగ్ ఉండేలా చూడాలని, అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రథమ అందించేందుకు మెడికల్ టీంలు గేట్ సమీపంలో ఏర్పాటు చేయాలని, దివ్యాంగ ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం సమీపంలో వీల్ చైర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతించకూడదని, ఓటర్లు ఎన్నికల సంఘం అనుమతించిన 18 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించిన వెంటనే లోపలికి అనుమతించాలని కలెక్టర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ...