Posts

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల వెల్లువ.

Image
   నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల వెల్లువ. నల్లగొండ:  మొత్తం 48 డివిజన్లకు 334 మంది అభ్యర్థులు 581 నామినేషన్స్ దాఖాలు..ఈ రోజు దాఖలైన నామినేషన్లు 414  పార్టీల వారీగా నామినేషన్లు కాంగ్రెస్ (INC) – 143 బీఆర్ఎస్ (BRS) – 134 బీజేపీ (BJP) – 123 ఏఐఎంఐఎం (AIMIM) – 17 బీఎస్పీ (BSP) – 4 సీపీఎం (CPM) – 4 ఆప్ (AAP) – 1 ఇతర రిజిస్టర్డ్ పార్టీల నుంచి – 55 స్వతంత్ర అభ్యర్థులు – 100  భారీగా దాఖలైన నామినేషన్లతో వేడెక్కుతున్న నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు

భగీరథ కాలనీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెయిన్ బో శ్రీనివాస్ నామినేషన్ దాఖలు

Image
 *భగీరథ కాలనీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెయిన్ బో శ్రీనివాస్ నామినేషన్ దాఖలు*              మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ *డివిజన్ నెం. 25 భగీరథ కాలనీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెయిన్ బో శ్రీనివాస్* శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రెయిన్ బో శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తనకు  వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీలో కార్యాలయ కార్యదర్శిగా,  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా  మాజీ టెలికాం బోర్డ్ మెంబర్ గా పనిచేసిన అనుభవంతో పాటు, భగీరథ కాలనీలోని ఉద్యోగస్తులు, యువత, రిటైర్డ్ ఉద్యోగస్తులు, మహిళలతో పాటు ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన నేపథ్యంలో డివిజన్ నెంబర్ 25 నుండి తాను గెలుపొందడం ఖాయమని ఈ సందర్భంగా రెయిన్ బో శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో లక్ష్మణ్ రావ్, ఇంతియాజ్, కొంతం లక్ష్మణ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం* - *మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి*

Image
  *నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం* - *మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి* *మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు* ************************************************** *నల్లగొండ*:  **ఫిబ్రవరి 11న జరిగే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు* *శుక్రవారం తన సతీమణి నల్గొండ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిచే 32వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు* *ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు* *నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా చేయడంతో కేంద్ర,రాష్ట్రాల నుంచి అత్యధిక నిధులు వస్తాయన్నారు* *దీంతో నల్లగొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు* *ఇప్పటికే పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు* *కార్పొరేషన్ లోని అన్ని డివిజన...

నల్లగొండ కార్పొరేషన్ మొదటి మేయర్ పీఠం తమ పార్టీకే-బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్

Image
నల్లగొండ కార్పొరేషన్ మొదటి మేయర్ పీఠం తమ పార్టీకే-బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ నల్గొండ:  బీజేపీ రాజ్యసభ సభ్యుడు *డాక్టర్ కే లక్ష్మణ్* నల్లగొండ జిల్లా బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పాయింట్స్... రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల్లో మార్పు కోరుకునే భావన స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్ అన్నారు... గతంలో టీఆర్‌ఎస్ అవినీతి, కుటుంబ పాలనతో ప్రజలు విసిగి మార్పు కోసం కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్యానించారు... కాంగ్రెస్ గ్యారెంటీలు, హామీలు అమలు కావడం లేదని, యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు మోసపోయిన భావనలో ఉన్నారని తెలిపారు... పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి 35 శాతం ఓట్లు ఇచ్చి 8 మంది ఎంపీలను గెలిపించడం ద్వారా స్పష్టమైన సంకేతం ఇచ్చారని అన్నారు... నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, పేదల సంక్షేమ పథకాలు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజలకు చేరుతున్నాయని చెప్పారు...

వాయు కాలుష్య సూచిక మరియు వాయు నాణ్యత నిర్వహణ" పై సమావేశం

Image
  వాయు కాలుష్య సూచిక మరియు వాయు నాణ్యత నిర్వహణ" పై సమావేశం హైద్రాబాద్: "వాయు కాలుష్య సూచిక మరియు వాయు నాణ్యత నిర్వహణ" పై జనవరి 29, 2026న MCHRDITలో ఒక సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. "ఆరోగ్యకరమైన తెలంగాణ కోసం పరిశుభ్రమైన గాలి" అనేది ప్రభుత్వ నినాదమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. స్థిరమైన అభివృద్ధి ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం లక్ష్యం. మెరుగైన రేపటి కోసం పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం నీటి వనరుల పునరుద్ధరణ మరియు గాలి నాణ్యతను మెరుగుపరచడానికి వివిధ చర్యలు తీసుకుంది. గాలి నాణ్యత పౌరుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది మరియు తద్వారా ఉత్పాదకత రాష్ట్ర GDP పై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2024 వంటి అనేక నివేదికలు సూచిస్తున్నాయి అధిక రక్తపోటు తర్వాత మరణానికి వాయు కాలుష్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెండవ ప్రధాన ప్రమాద కారకంగా ఉంది. 2021-2023 నాటికి ఏటా దాదాపు 8.1 మిలియన్ల అకాల మరణాలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో...

నల్గొండ 45 వ మున్సిపల్ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గా గడాలె విజయ

Image
 నల్గొండ 45 వ మున్సిపల్ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గా గడాలె విజయ. నల్గొండ: నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ 45 వ డివిజన్ నుండి BRS పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా గడాలె విజయ ను ప్రకటించిన నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. ఈ సందర్భంగా గడాలె విజయ మాట్లాడుతూ  45 డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేయుచున్నానని వినయపూర్వకంగా తెలియజేస్తున్నాననీ, ఈ ప్రయాణంలో డివిజన్ అందరి సహాయ సహకారం, మద్దతు నాకు ఎల్లప్పుడూ అవసరం అని, మీ నమ్మకానికి తగ్గట్టుగా, నిరంతరం మన డివిజన్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అంకితభావంతో సేవలు అందిస్తానని హామీ ఇస్తున్నాననీ తెలిపారు. ఈ అవకాశాన్ని అందించిన మా ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాననీ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాననీ తెలిపారు. మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని డివిజన్ ప్రజలను అభ్యర్థించారు.

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలను 2 నెలలో నిర్వహించాలని న్యాయవాది పి. గోపి మానవేంద్రనాథ్ ను నియమించిన కోర్టు

Image
  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలను 2 నెలలో నిర్వహించాలని  న్యాయవాది  పి. గోపి మానవేంద్రనాథ్ ను నియమించిన కోర్టు గూఢచారి, హైదరాబాద్, 29 జనవరి:  తెలంగాణ ఆర్యవైశ్య  మహాసభ ఎన్నికల పై ఆగీర్ వెంకటేశం వేసిన కేసుకు కోర్టు పిటిషనర్ యొక్క ప్రస్తుత పిటిషన్ ను ఈ రోజు కోర్టు అనుమతిస్తు,   24-02-2025న మెమో నెం.6395/Regn.II/2025 ద్వారా తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నికల అధికారి స్థానంలో న్యాయవాది పి. గోపి మానవేంద్రనాథ్ ను  నియమిస్త ఉత్తర్వులు జారీ చేసినది. ఈ  తేదీ నుండి రెండు నెలల వ్యవధిలో ప్రతివాది నెం.1 సొసైటీ  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ యొక్క బై-లాస్ ప్రకారం ఎన్నికలను నిర్వహించడానికి మరియు ఓట్లను లెక్కించి, తదనుగుణంగా తగిన భద్రతతో ఫలితాలను ప్రకటించి, కోర్టు ముందు సమ్మతి నివేదికను దాఖలు చేయాలని ఆర్డర్ ఇచ్చింది. అడ్వకేట్ కమిషనర్ ఫీజు రూ.10,000/- గా నిర్ణయించబడిందనీ మరియు పిటిషనర్ అడ్వకేట్ కమిషనర్ ఫీజును అడ్వకేట్ కమిషనర్‌కు చెల్లించి, ఈ ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుండి (7) రోజులలోపు కోర్టు ముందు మెమోతో పాటు రసీదును దాఖలు చేయాలని ఆ ఆర్డర్ లో తెలిపింది.

ఫ్లాష్.. ఫ్లాష్.. BRS రెండవ జాబితా విడుదల

Image
 నల్గొండ  మున్సిపల్ కార్పొరేషన్ BRS అభ్యర్థుల రెండవ జాబితా విడుదల

ఏం.ఫార్మసి విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసిన సెల్ వెల్ సంస్థ సీఎండీ సుబ్బా రావు

Image
 ఏం.ఫార్మసి విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసిన సెల్ వెల్ సంస్థ సీఎండీ సుబ్బా రావు హైదరాబాద్:  సెల్ వెల్ సంస్థ సీఎండీ విద్యా దాత సుబ్బా రావు సార్ చంద్రిక M. ఫార్మసి చదువు కాలేజ్ ఫీజు నిమిత్తం 35000 చెక్ అందచేశారు. ఈ సందర్భంగా మొగుళ్ళపెల్లి ఉపేందర్ సుబ్బారావు కు ధన్యవాదములు కృతజ్ఞతలు తెలిపారు.

పంచముఖ హనుమాన్ దేవాలయంలో 18 అడుగుల విరాట హనుమంతుని విగ్రహ ప్రతిష్ట* ఘనంగా నిర్వహణ..

Image
 నల్గొండ పట్టణంలో ఆధ్యాత్మిక శోభ..! నల్గొండ పట్టణం వెంకటేశ్వర కాలనీలోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో భక్తుల జయజయధ్వానాల నడుమ *18 అడుగుల విరాట హనుమంతుని విగ్రహ ప్రతిష్ట* ఘనంగా నిర్వహణ..! వేద మంత్రోచ్చారణలు, పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో విగ్రహ ప్రతిష్ట పూర్తి... భారీగా తరలివచ్చిన భక్తజనం... జై శ్రీరాం నినాదాలతో మారుమ్రోగిన కాలనీ పరిసరాలు..! ప్రాంత ప్రజలతో పాటు హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేశారు... భక్తి.. శక్తి.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం వెంకటేశ్వర కాలనీ పంచముఖ హనుమాన్ ఆలయం...

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పట్టివేత..

Image
 గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పట్టివేత.. గచ్చిబౌలి లోని కేశవ్ నగర్ లో ఉంటున్న సాయి కిరణ్ (26)దగ్గర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న మాదాపూర్ జోన్ ఏస్ఓటీ పోలీసులు..  లక్ష 30వేల విలువ చేసే 11గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్,రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం.. బెంగుళూరు నుండి తెచ్చి హైదరాబాద్ లో అమ్మడానికి ప్రయత్నిస్తున్న సాయి కిరణ్.. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ దందా చేస్తున్న సాయి కిరణ్.. ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా డ్రగ్స్ విక్రయిస్తున్న సాయికిరణ్.. విశ్వసనీయ సమాచారంతో సాయి కిరణ్ ను పట్టుకున్న మాదాపూర్ sot పోలీసులు.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

కామారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న జిల్లా సివిల్ సప్లై కార్యాలయంపై ACB దాడి

Image
 కామారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న జిల్లా సివిల్ సప్లై కార్యాలయంపై ACB దాడి 2026 జనవరి 24న మధ్యాహ్నం 12:15 గంటలకు, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, కామారెడ్డిలోని జిల్లా మేనేజర్ కార్యాలయంలో ACB అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో, అనేక లోపాలు బయటపడ్డాయి. 2021-22 ఖరీఫ్ సీజన్‌లో: 39 మంది మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారు; 2 రైస్ మిల్లర్లపై చర్య, లోటు: 581 మెట్రిక్ టన్నులు (₹64 లక్షలు). 2022-23 ఖరీఫ్ సీజన్‌లో: 37 మంది మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారు; 2 రైస్ మిల్లర్లపై చర్యలు, కొరత: 19,529 మెట్రిక్ టన్నులు (₹41 కోట్లు). 2023-24లో: ఖరీఫ్ సీజన్‌లో 7 మంది మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారు; 3 రైస్ మిల్లర్లపై చర్య, లోటు: 5,194 మెట్రిక్ టన్నులు (₹2.5 కోట్లు). 2023-24లో, గ్రీన్ హిల్స్ ఆగ్రో ఇండస్ట్రీస్ (కోడ్: 177375) కస్టమ్ మిల్డ్ రైస్‌ను చెల్లించడంలో డిఫాల్ట్ అయింది, దీని ఫలితంగా క్రిమినల్ కేసు నమోదైంది. అయినప్పటికీ, అధికారులు ఖరీఫ్ మరియు రబీ 2024-25 దిగుబడిని అదే మిల్లర్‌కు కేటాయించారు. సెప్టెంబర్ 2025 నుండి, జిల్లా పౌర సరఫరా అధికారి మరియు జిల్లా మేనేజర్,...

కోమటి రెడ్డి ప్రతీక్ బొట్టుగూడ హై స్కూల్ ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రసంగం

Image
  కోమటి రెడ్డి ప్రతీక్ బొట్టుగూడ హై స్కూల్ ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రసంగం మార్కులు–ర్యాంకులకే పరిమితమైన సంప్రదాయ విద్యపై విమర్శ ఆలోచనకు కాదు, గుర్తుపెట్టుకునే చదువుకు పిల్లలపై ఒత్తిడి పెరుగుతోందని వ్యాఖ్య ఒత్తిడితో పిల్లల సహజ కుతూహలం, సృజనాత్మకత నశిస్తున్నాయన్న ఆందోళన చదువు పోటీగా మారిందని, ఆనందకరమైన ప్రయాణం కావాలని పిలుపు వాల్డార్ఫ్ విద్యా విధానం నుంచి ప్రేరణతో కొత్త బోధనా దృక్పథం ఆలోచన–భావన–కార్యాచరణ… మూడు స్థాయిల్లో పిల్లల అభివృద్ధి లక్ష్యం అనుభవాత్మక విద్యకు ప్రాధాన్యం – చేతలతో నేర్చుకునే విధానం గార్డెన్ పనులతో సహనం, ప్రకృతితో అనుబంధం కుండల తయారీ, రాయి చెక్కుదలతో ఏకాగ్రత, సృజనాత్మకత వికాసం ఇసుక ఆటలతో కల్పనాశక్తి విస్తరణ నృత్యం, యోగా ద్వారా శరీరం–మనస్సు సమతుల్యత ఇండోర్ ఆటలతో సామాజిక, భావోద్వేగ నైపుణ్యాల పెంపకం ఆధునిక పోటీ ప్రపంచానికి పిల్లలను సిద్ధం చేసే దృష్టి పూర్తిగా డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు ఆధునిక కంప్యూటర్ ల్యాబ్, STEM విద్య, గ్రంథాలయం, స్పోర్ట్స్ రూమ్స్ లిఫ్ట్ సదుపాయం, స్మార్ట్ లెర్నింగ్ టూల్స్ అందుబాటులో సంప్రదాయ విద్య + వాల్డార్ఫ్ ప్రేరణ...

Big Breking మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Image
 Big Breking మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈనెల 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 31న స్క్రూటినీ ఉంటుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్, ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తంగా 52.43 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామని SEC రాణి కుముదిని తెలిపారు.

నల్గొండ 5 వ డివిజన్ పాత కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం!

Image
 నల్గొండ 5 వ డివిజన్ పాత కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం! నల్గొండ: పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని, కనీసం పార్టీ కోసం కష్టపడిన వారి అభిప్రాయం తీసుకోకుండా, కార్పొరేటర్ సీటు విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్ల, పాత కాంగ్రెస్ వారికి అన్యాయం జరుగు తుందని పాత కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు.   గత ఎమ్మెల్యే ఎలక్షన్లలో కష్టపడిన వారు అందరూ కూడా వేరే ప్లాట్ఫారం చూసుకావలసి వస్తుందని, రెండు రోజులలో ఐదవ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందని వారు అంటున్నారు.

రవీందర్ కు పోలీస్ సేవా పథకం

Image
 రవీందర్ కు పోలీస్ సేవా పథకం సంగారెడ్డి: జిల్లా పోలీస్ శాఖలో ఐటి విభాగంలో పనిచేస్తున్న ఏఎస్ఐ మునగాల రవీందర్ కు సేవా పథకం లభించింది ఈ మేరకు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో బహూకరించారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ,జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ లు ఆయనకు మెడల్ ను అందించారు. జిల్లా పోలీస్ శాఖలో రవీందర్ ఒక్కరికి మాత్రమే ఈ మెడల్ లభించింది. దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలను అందించిన సందర్భంగా రవీందర్ కు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా ఆయన్ని జిల్లా ఎస్పీ తో పాటు పలువురు అధికారులు అభినందించారు. సహచరులు శుభాకాంక్షలు తెలిపారు.రవీందర్ మాట్లాడుతూ ఎంతో క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులను నిర్వహిస్తున్నామని అన్నారు. అప్పగించిన బాధ్యతను నిబంధనల కు అనుగుణంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.

సనత్‌నగర్ ప్రధాన కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Image
సనత్‌నగర్ ప్రధాన కార్యాలయంలో  77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి) సనత్‌నగర్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని దేశభక్తి  తో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలి అధికారులు మరియు సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా (టి జి పి సి బి)సభ్య కార్యదర్శి జి. రవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సభను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు మరియు వీరమరణం పొందిన అమరవీరులకు ఆయన ఘన నివాళులు అర్పించారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అనేక మంది స్వాతంత్ర్య సమరయోధుల రక్తం, చెమట మరియు త్యాగాల ఫలితమని  రవి అన్నారు. భారత రాజ్యాంగంలో నిక్షిప్తమైన విలువలను కాపాడుతూ, దేశ అభివృద్ధికి నిజాయితీతో కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించిన సభ్య కార్యదర్శి, పర్యావరణాన్ని కాపాడటం సామూహిక బాధ్యత అని పేర్కొన్నారు. సహజ వనరుల సంరక్షణలో ప్రతి ఉద్యోగి మరియు పౌరుడు చురుకుగా పాల్గొనాలని, కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసే మార్గదర్శకాలు మరియు నిబంధనలను కచ...

ఇంటి స్థలం కోసమే నా పోరాటం - టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి

Image
  *నీ ఇంటి స్థలం కోసమే నా పోరాటం..* *టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి* *ఇండ్ల జాగాల ఉద్యమం లో సంఘాలన్నీ కలిసి రావాలి* *గణతంత్ర వేడుక దినోత్సవ సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు* ఖమ్మం, జనవరి 24 : జర్నలిస్టుల ఇంటి జాగా సాధించే వరకు తమ ఉద్యమం ఆగదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి స్పష్టం చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో టిడబ్ల్యూజేఎఫ్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ సన్నాహ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని అన్నారు. అవసరమైతే ఉద్యమాన్ని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జర్నలిస్టుల ఇంటి జాగాల విషయంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఇకపై సహించేది లేదని ఆయన హెచ్చరించారు. జర్నలిస్టుల కుటుంబాలకు భద్రత, గౌరవం కల్పించే వరకు టిడబ్ల్యూజేఎఫ్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి అదనపు సభ్యుల నియామకం చేపట్టారు. అనంతరం ...

హైదరాబాద్ నుమైష్ -2026లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్

Image
  హైదరాబాద్ నుమైష్ -2026లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్  హైదరాబాద్, గూఢచారి:  ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమైష్ -2026)లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్ – కాలుష్య నియంత్రణ పై ప్రజల్లో అవగాహన. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ప్రదర్శన స్టాల్ను ఏర్పాటు చేసింది. ఈ స్టాల్లో మునిసిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ, పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు, పరిశ్రమల వల్ల కలిగే జల కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఈ-వ్యర్థాల (ఈ-వేస్ట్) నిర్వహణ, కాలుష్యం వలన పర్యవరణానికి కలిగే హాని పై సమాచారం అందించారు. వివిధ రకాల పోస్టర్లు ప్రదర్శనల ద్వారా కాలుష్యానికి కారణాలు, దుష్పరిణామాలు మరియు నియంత్రణ చర్యలపై సందర్శకులకు అవగాహన కల్పించారు. “పంటల మిగులు అవశేషాలను (స్టబ్బుల్) కాల్చడం భారతదేశంలో గాలి కాలుష్యాన్ని పెంచుతున్న ప్రధాన సమస్యగా మారింది. పంటల స్టబ్బుల్ను వెర్మీకంపోస్ట్గా మార్చాలి. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వినియోగాన్ని ప్రోత్సహించాలి మరియు 15 సంవత్సరాలకు మించిన పాత వాహనాలను ఎలక్ట్రిక్...

శ్రీ శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి నిర్వహణ అభివృద్ధి కమిటీ నుండి తప్పుకున్న గుబ్బ శ్రీనివాస్

Image
  శ్రీ శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి నిర్వహణ అభివృద్ధి కమిటీ నుండి తప్పుకున్న గుబ్బ శ్రీనివాస్ నల్గొండ:  నల్లగొండ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మంగారీ గుట్ట నిర్వహణ అభివృద్ధి కమిటీ (రిజిస్టర్) మెంబర్గా శ్రీ చింతా హరిప్రసాద్ నన్ను నియమించారనీ ఆయన కీర్తి శేషులు అయినారని, నాకు కొన్ని వ్యక్తిగత కారణముల కమిటినుండి తప్పుకొను చున్నాని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గుబ్బ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. నేటినుండి పైన తెలిపిన కమిటీకి నాకు ఎటువంటి సంబంధములు ఉండవని పత్రికా ముఖంగా తెలియ చేయు చున్నానని ఆయన తెలిపారు.