Posts

*ప్రక్షాళన కమిటీ విజయం - పేద ఆర్యవైశ్య బిడ్డలకే ఆత్మగౌరవ భవన్ ఉపయోగపడాలన్న సీఎం రేవంత్ రెడ్డి*

Image
* ప్రక్షాళన కమిటీ విజయం - పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఆత్మగౌరవ భవన్ ఉపయోగపడాలన్న సీఎం రేవంత్ రెడ్డి* *హైదరాబాద్:* ఉప్పల్ భగాయత్ లో ఆదివారం జరిగిన ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్ భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆర్యవైశ్య వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీన్ని *మహాసభ ప్రక్షాళన కమిటీ తొలి విజయం* గా చెప్పుకోవచ్చు. సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి *"నిర్మిస్తున్న ఈ ఆత్మగౌరవ భవన్ పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఉపయోగపడాలి. ఆర్యవైశ్యులంతా కలిసి ఉండండి, రాజకీయాల్లో రాణించండి"* అని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఆర్యవైశ్యులు పేదలకు ఎలాంటి పూచీ లేకుండా ఉద్దెర ఇచ్చి ఆదుకుంటారని కొనియాడారు. ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని, కొడంగల్ మున్సిపల్ చైర్మెన్ ఆర్యవైశ్యలకే ఇచ్చామని తెలిపారు. ఆత్మగౌరవ భవన్ కు ఆర్థిక సహాయం కోరారని, నిబంధనల మేరకు చేస్తామని తెలిపారు. *ఎందుకు ఇది ప్రక్షాళన కమిటీ విజయం?* గత కొన్ని నెలలుగా మహాసభ ప్రక్షాళన కమిటీ లేవనెత్తుతున్న ప్రధాన డిమాండ్ ఇదే. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న భవన్ కేవలం కొందరు పెద్దలకోసం, ఫంక్షన్ హాల్ గా మిగిలిపోకుండా.. ప...

ఉప్పల్ bhagayath భూమి పూజకు రేవంతన్న రావడం వ్యతిరేకిస్తున్నాం అన్న Instagram post వైరల్ అవుతుంది 👇👇👇👇👇

Image
ఉప్పల్ bhagayath భూమి పూజకు రేవంతన్న రావడం వ్యతిరేకిస్తున్నాం అన్న Instagram post మస్తు వైరల్ అవుతుంది మరి ఈ పోస్ట్ రేవంత్ రెడ్డి కి చేరేనా? ఆలోచించినా అన్న డిస్కస్ పెరుగుతుంది 👇👇👇👇👇 ఈ క్రింది లింక్ టచ్ చేసి చూడొచ్చు https://www.instagram.com/reel/DdLsIJmRH1a/?stkn=MWw1eWMzaXpjd2pjYg==  

*CMRF మెడికల్ బిల్లు కోసం రూ.లక్ష లంచం - సెక్రటేరియట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, TSIDC సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలలో*

Image
 *CMRF మెడికల్ బిల్లు కోసం రూ.లక్ష లంచం - సెక్రటేరియట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, TSIDC సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలలో* *హైదరాబాద్, సెప్టెంబర్ 10:* ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మెడికల్ రీయింబర్స్ మెంట్ కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. తెలంగాణ సచివాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న *ఆనందేశి రాఘవేందర్ (A-1)* మరియు TSIDC (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) పరిశ్రమ భవన్, బషీర్ బాగ్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న *మేడి వినోద్ (A-2)* లను బుధవారం సిటీ రేంజ్-2 ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *ఏం జరిగింది?* ఫిర్యాదుదారుడి CMRF మెడికల్ రీయింబర్స్ మెంట్ క్లెయిమ్ ను ప్రాసెస్ చేసి, మంజూరైన రూ.2 లక్షలకు చెక్కు ఇప్పించి, మిగిలిన క్లెయిమ్ ను కూడా ప్రాసెస్ చేసేందుకు A-1 రాఘవేందర్ రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. అంతకు ముందే PhonePe ద్వారా A-2 వినోద్ ద్వారా రూ.5,000 లంచం తీసుకున్నాడు. ఏసీబీ వల వేయగా ఫిర్యాదుదారుడి నుంచి A-2 వినోద్ రూ.లక్ష తీసుకుని A-1 రాఘవేందర్ కు అందజేశాడు. రాఘవేందర్ వద్ద నుంచి ఆ తడిసిన రూ.లక్ష నోట్లను ఏసీ...

*నల్గొండలో వినాయక ఉత్సవాలకు పోలీసుల సూచనలు - ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని డీఎస్పీ శివరాం రెడ్డి విజ్ఞప్తి*

Image
 *నల్గొండలో వినాయక ఉత్సవాలకు పోలీసుల సూచనలు - ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని డీఎస్పీ శివరాం రెడ్డి విజ్ఞప్తి* *నల్లగొండ:* వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు. శాంతి సంఘ సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. - ప్రతి గణేష్ మండపాన్ని తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. - ఊరేగింపులు, నిమజ్జనం సందర్భంగా మద్యం సేవించడం, డ్రంక్ డ్రైవింగ్ వంటివి చేయరాదు. - ఫేక్ న్యూస్, వదంతులు, రెచ్చగొట్టే పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. అలాంటి వాటిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. - నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. - డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల విషయంలో నిబంధనలు పాటించాలి. - ఇతరుల మనోభావాలకు భంగం కలిగించేలా వ్యవహరించవద్దు. *"ఉత్సవాలను సోదరభావంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుందాం. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం"* అని డీఎస్పీ శివరాం రెడ్డి విజ్ఞప్తి చే...

*మేరు జాతి మహిళా ఉద్యమకారులకు ఘన సన్మానం*

Image
  *మేరు జాతి మహిళా ఉద్యమకారులకు ఘన సన్మానం* *రైతులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన భరతక్క, వనజక్కలకు సత్కారం* *వరంగల్, తేదీ:* ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డగా నిలిచిన నేపథ్యంలో, రైతుల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తమ జీవితాలను పణంగా పెట్టి ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న మేరు జాతి మహిళా ఉద్యమకారులకు ఘనంగా సన్మానం జరిగింది. ప్రజా ఉద్యమ నేత అక్కరాజు హరిగోపాల్ అలియాస్ రామకృష్ణ సతీమణి సింగు సిరిష అలియాస్ భరతక్క, సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన పటేల్ సుధాకర్ రెడ్డి సతీమణి పటేల్ వనజ అలియాస్ కాపురి వనజక్కలను ఈ సందర్భంగా సత్కరించారు.         ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మేరు కార్పొరేషన్ చైర్మన్ సంగా వెంకటరాజం, వైస్ చైర్మన్ మాడిశెట్టి లక్ష్మీనారాయణ, రాష్ట్ర మేరు సంఘం నాయకులు మునగాల రమేష్, మునగాల రాము, జిల్లా నాయకులు రాయబారు సంతోష్ తదితరులు పాల్గొని వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ సంగా వెంకటరాజం మాట్లాడుతూ... "మేరు జాతిలో పుట్టి రైతుల హక్కులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కో...

*కాలేజీ అఫిలియేషన్ కోసం రూ.20 వేలు లంచం - ఏసీబీ వలలో సంగారెడ్డి DIEO*

Image
 *కాలేజీ అఫిలియేషన్ కోసం రూ.20 వేలు లంచం - ఏసీబీ వలలో సంగారెడ్డి DIEO* *సంగారెడ్డి, సెప్టెంబర్ 9:* ప్రైవేట్ కాలేజీ అఫిలియేషన్ రెన్యువల్ కోసం లంచం డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (DIEO) ఏసీబీ వలలో చిక్కాడు. జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ *శ్రీ రామావత్ గోవింద్ రామ్* ను మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటలకు తన కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *ఏం జరిగింది?* ఫిర్యాదుదారుడికి చెందిన *వికాస్ వొకేషనల్ జూనియర్ కాలేజీ, సంగారెడ్డి* కి ప్రొవిజనల్ అఫిలియేషన్ పొడిగింపు కోసం ఇన్ స్పెక్షన్ చేసి రిపోర్ట్ పంపేందుకు DIEO గోవింద్ రామ్ మొదట రూ.50,000 లంచం డిమాండ్ చేశాడు. ఇప్పటికే రూ.30,000 తీసుకున్నాడు. మిగిలిన రూ.20,000 ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు వల వేసి రూ.20,000 లంచం తీసుకుంటుండగా DIEO ను పట్టుకున్నారు. తడిసిన నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమంగా లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ నిర్ధారించింది. నిందితుడిని అరెస్టు చేసి హైదర...

ఒకే రోజు రెండు ఏసీబీ దాడులు

Image
  ఒకే రోజు రెండు ఏసీబీ దాడులు నారాయణపేటలో సబ్‌ రిజిస్ట్రార్.. హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ అరెస్ట్ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఒకే రోజు రెండు వేర్వేరు కేసుల్లో ప్రభుత్వ అధికారులపై చర్యలు చేపట్టింది. నారాయణపేట జిల్లాలో సబ్‌ రిజిస్ట్రార్‌, హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ లంచం వ్యవహారంలో ఏసీబీకి చిక్కారు. రూ.90 వేల లంచం డిమాండ్‌ చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ నారాయణపేట జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గ్రేడ్‌-2 సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న లగిశెట్టి వెంకట్‌ స్వామిపై క్రిమినల్‌ మిస్‌కండక్ట్‌ కేసు నమోదైంది. ఏసీబీ వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి ఇంటి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ నంబర్‌ 4723/2026ను పూర్తి చేసేందుకు రూ.90,000 లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తంలో భాగంగా రూ.50,000ను ప్రైవేట్‌ వ్యక్తి కమ్మరి నాగేష్‌ ద్వారా స్వీకరించినట్లు ఏసీబీ తెలిపింది. అనంతరం మిగిలిన రూ.40,000 కోసం డిమాండ్‌ చేసినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు ప్రైవేట్‌ వ్యక్తి కమ్మరి నాగేష్‌న...

*జైల్లో ములాఖత్ కోసం రూ.10 వేలు లంచం - ఏసీబీ వలలో హుజూరాబాద్ జైలర్*

Image
 *జైల్లో ములాఖత్ కోసం రూ.10 వేలు లంచం - ఏసీబీ వలలో హుజూరాబాద్ జైలర్* *కరీంనగర్, సెప్టెంబర్ 7:* రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు కల్పించి, ములాఖత్ లు ఇప్పించేందుకు, ఖమ్మం జైలుకు బదిలీ చేయకుండా ఉండేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ హుజూరాబాద్ సబ్ జైలు జైలర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్ జైలు డిప్యూటీ జైలర్ గా పనిచేస్తున్న *N. దేవేందర్  (46) (A-1)* ను, అతని అనుచరుడు ఇండియన్ ఆయిల్ సబ్ జైలు పెట్రోల్ బంక్ ఆపరేటర్ *రావుల హరీష్ (30) (A-2)* ను కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు ట్రాప్ చేశారు. *ఏం జరిగింది?* ఫిర్యాదుదారుడి మామ రిమాండ్ ఖైదీగా హుజూరాబాద్ సబ్ జైలులో ఉన్నాడు. అతనికి మెరుగైన వసతులు కల్పించడం, కుటుంబ సభ్యులను కలిసేందుకు ములాఖత్ సౌకర్యం కల్పించడం, ఖమ్మం జైలుకు బదిలీ చేయకుండా చూడడం కోసం జైలర్ దేవేందర్ రూ.10,000 లంచం డిమాండ్ చేశాడు. లంచాన్ని నేరుగా తీసుకోకుండా పెట్రోల్ బంక్ ఆపరేటర్ హరీష్ ద్వారా తీసుకోవాలని ప్లాన్ చేశాడు. ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు వల వేశారు. హుజూరాబాద్ లోని ఇండియన్ ఆయిల్ సబ్ జైలు పెట్రోల్ బంక్ వద్...

*బ్లూ స్కైస్ కోసం క్లీన్ ఎయిర్ డే - పరిశ్రమలు క్లీన్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాలి: TGPCB*

Image
 *బ్లూ స్కైస్ కోసం క్లీన్ ఎయిర్ డే - పరిశ్రమలు క్లీన్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాలి: TGPCB* *హైదరాబాద్, సెప్టెంబర్ 7:* అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి - నీలి ఆకాశం దినోత్సవం (International Day of Clean Air for Blue Skies) సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB), టోరెంట్ గ్యాస్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా TGPCB జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి అనేది కేవలం పర్యావరణ లక్ష్యం మాత్రమే కాదు, అది ప్రజారోగ్యం, ఆర్థిక, అభివృద్ధి ప్రాధాన్యత అని నొక్కి చెప్పారు. పరిశ్రమలు క్లీన్ టెక్నాలజీ, ప్రజా రవాణా, ఇంధన సామర్థ్యం, మెరుగైన వ్యర్థాల నిర్వహణలో పెట్టుబడులను కేవలం నిబంధనలకు అనుగుణంగా చేసే ఖర్చుగా కాకుండా అభివృద్ధి పెట్టుబడులుగా చూడాలని సూచించారు. TGPCB సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ డా. డి. ప్రసాద్ మాట్లాడుతూ వ్యక్తుల నుంచి సంస్థల వరకు అందరి నిబద్ధత అవసరమని, గాలి నాణ్యత మెరుగుదలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పరిశ్రమలు నె...

*మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ - TGPCB ఆధ్వర్యంలో విద్యార్థులకు వర్క్‌షాప్*

Image
  *మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ - TGPCB ఆధ్వర్యంలో విద్యార్థులకు వర్క్‌షాప్* *హైదరాబాద్, సెప్టెంబర్ 7:* తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) ఆధ్వర్యంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై అవగాహన వర్క్‌షాప్  సనత్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఐదు పాఠశాలలకు చెందిన 108 మంది విద్యార్థులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. TGPCB మెంబర్ సెక్రటరీ జి. రవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) విగ్రహాలకు బదులు మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని సూచించారు. మట్టి విగ్రహాలు నీటిలో సహజంగా కరిగిపోవడం వల్ల నీటి వనరుల కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. విగ్రహాల నిమజ్జనాన్ని నిర్దేశించిన చెరువులు, సరస్సుల్లోనే చేపట్టాలని కోరారు. విద్యార్థులు ఈ అవగాహనను తల్లిదండ్రులు, సమాజానికి తెలియజేసి పర్యావరణహిత వినాయక చవితి సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. *రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం* పర్యావరణహిత వినాయక చవితిపై TGPCB ఆటోల ద్వారా, పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేపడుతోంది. రాష్ట్రవ్యాప్త...

*క్రీడలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట – ప్రతిభను చాటుతున్న తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారులు* - ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
 *క్రీడలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట – ప్రతిభను చాటుతున్న తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారులు* - ఉప్పల శ్రీనివాస్ గుప్త *గోపీచంద్, సైనా నెహ్వాల్‌లను ఆదర్శంగా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి* - *ఉప్పల శ్రీనివాస్ గుప్త* *జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు* తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. గచ్చిబౌలిలోని సాయి గోపీచంద్ నేషనల్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన YONEX-SUNRISE G.H. RAISONI MEMORIAL 5వ తెలంగాణ స్టేట్ మినీ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2026కు ముగింపు కీ ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 280 మంది చిన్నారులు, యువ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను చ...

*తెలంగాణ మేర కుల రాష్ట్ర కమిటీ ఎన్నిక*

Image
  *తెలంగాణ మేర కుల రాష్ట్ర కమిటీ ఎన్నిక* *హైదరాబాద్, సెప్టెంబర్ 4:* బాగ్‌లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం నాడు మేర కుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ మేర సంఘం రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత కొన్నేళ్లుగా ఎన్నో ఆటంకాలతో పరిష్కారం కాని ఎన్నికల సమస్యను సభ్యుల సహకార, సమన్వయంతో ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగింది.  అధ్యక్షుడిగా కీర్తి రాజగోపాల్, ప్రధాన కార్యదర్శిగా శీలం కోటి రవి, గౌరవ అధ్యక్షులు గా కరాటే కృష్ణ, కోశాధికారిగా సింగు విష్ణు, జాయింట్ సెక్రెటరీ మరియు అధికార ప్రతినిధి గా మునగాల రాము గార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  తెలంగాణ రాష్ట్ర మేర కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకటరాజం , వైస్ చైర్మన్ మాడిశెట్టి లక్ష్మీనారాయణ గార్ల ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలు, జోన్లు, పట్టణాల నుంచి మేర సంఘాల మాజీ, ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు, మేధావులు, పెద్దలు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ సంఘ వెంకట రాజ్యం మాట్లాడుతూ సమన్వయంతో జాతిని ఏకం చేసేవాడే, వివాదాలకు దూరంగా ఉండేవాడే నిజమైన నాయకుడని అన్నార...

*సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.3.54 కోట్ల అక్రమాస్తుల గుట్టు రట్టు*

Image
  *సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.3.54 కోట్ల అక్రమాస్తుల గుట్టు రట్టు* *సూర్యాపేట, సెప్టెంబర్ 3:* ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, కోదాడ మున్సిపాలిటీ ఇన్‌చార్జ్ టీపీఓ *వుయ్యాల సోమయ్య* పై ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు బుధవారం ఆయన ఇల్లు, ఆఫీసు, బంధువులు, అనుచరులకు సంబంధించిన మొత్తం 7 చోట్ల సోదాలు నిర్వహించారు. *సోదాల్లో బయటపడిన ఆస్తులు:* - సూర్యాపేట జిల్లాలో 3 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి - విలువ రూ.2,94,000 - సూర్యాపేట, హయత్‌నగర్ పరిధిలో 5 నివాస భవనాలు (G+1, G+2, G+4 + పెంట్ హౌస్, 2 గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లు) - విలువ రూ.2,75,00,000 - సూర్యాపేట పరిధిలో 8 ఓపెన్ ప్లాట్లు - విలువ రూ.2,58,500. వీటి మార్కెట్ విలువ ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని అధికారులు తెలిపారు. - నగదు రూ.4,63,990 - బ్యాంకు బ్యాలెన్స్ రూ.13,00,000 - 709 గ్రాముల బంగారు ఆభరణాలు, 1750 గ్రాముల వెండి ఆభరణాలు - విలువ సుమారు రూ.20,00,000 - 2 ఫోర్ వీలర్లు, 3 టూ వీలర్లు - విలువ రూ.25,20,000 - గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు - ...

*పోడు సాగు కోసం రూ.30 వేలు లంచం - ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్*

Image
 *పోడు సాగు కోసం రూ.30 వేలు లంచం - ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్* *భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 3:* పోడు సాగును అడ్డుకోకుండా, కందకాలు తవ్వకుండా ఉండేందుకు రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అల్లాపల్లి మండలం, కచనపల్లి బీట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు రామానుజగూడెం బీట్ ఇన్‌చార్జ్ గా ఉన్న *బానోత్ రవి కుమార్ (A-1)* ను ఏసీబీ అధికారులు బుధవారం ట్రాప్ చేశారు. ఫిర్యాదుదారుడి పోడు వ్యవసాయాన్ని అడ్డుకోకుండా, భవిష్యత్తులో పట్టా/రెగ్యులరైజేషన్ వచ్చేలా సహకరిస్తానని చెప్పి రవి కుమార్ రూ.30,000 లంచం డిమాండ్ చేశాడు. లంచం నేరుగా తీసుకోకుండా తన మనిషి *పఠాన్ సాదిక్ ఖాన్ (A-2)* కు ఇవ్వాలని ఫిర్యాదుదారుడికి చెప్పాడు. ఏసీబీ పథకం ప్రకారం ఫిర్యాదుదారుడు రామానుజగూడెం గ్రామంలోని సాదిక్ ఖాన్ నివాసంలో రూ.30 వేలు అందజేశాడు. వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. A-2 చేతులపై నిర్వహించిన కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. A-1 అధికార దుర్వినియోగానికి పాల్పడి A-2 ద్వారా లంచం తీసుకున్నట్లు ఏసీబీ నిర్ధారించింది. ఇద్దరు నింద...

*ఏసీబీ వలలో టోలిచౌకీ ఎస్ఐ - రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టివేత*

Image
 *ఏసీబీ వలలో టోలిచౌకీ ఎస్ఐ - రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టివేత* *హైదరాబాద్, సెప్టెంబర్ 1:* లంచం డిమాండ్ చేసిన టోలిచౌకీ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కాడు. గోల్కొండ జోన్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టోలిచౌకీ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ *ఆర్. పాండు నాయక్* రూ.10,000 లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. *ఏం జరిగింది?* ఫిర్యాదుదారుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై అతనిపై కేసు నమోదు చేయకుండా, కుటుంబ సభ్యుల మధ్య విషయాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు, అతని పాస్‌పోర్టును సీజ్ చేయకుండా ఉండేందుకు అధికారిక సహాయం చేస్తానని చెప్పి ఎస్ఐ పాండు నాయక్ రూ.10 వేలు డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు వల వేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడి నుండి తడిసిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ తెలిపింది. కేసు దర్యాప్తులో ఉందని, భద్రతా కారణాల వల్ల ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచినట్లు ప...

*టీజీపీసీబీలో 11 ఏళ్ల సేవలు పూర్తి చేసుకున్న వై. భాస్కర్ చారికి ఘన వీడ్కోలు*

Image
 *టీజీపీసీబీలో 11 ఏళ్ల సేవలు పూర్తి చేసుకున్న వై. భాస్కర్ చారికి ఘన వీడ్కోలు* *హైదరాబాద్, సెప్టెంబర్ 1:* తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) లో 11 సంవత్సరాల పాటు సెక్యూరిటీ పర్సన్ గా నిబద్ధతతో సేవలందించిన వై. భాస్కర్ చారి పదవీ విరమణ సందర్భంగా సనత్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ చారి అందించిన సేవలను అధికారులు, ఉద్యోగులు కొనియాడారు. ఆయనను శాలువాతో సత్కరించి, పదవీ విరమణ అనంతర జీవితం సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీజీపీసీబీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అరుణ, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (OUSEA) అధ్యక్షుడు సి. మధు గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆర్. నవీన్ గౌడ్, రాజా రమేష్, బాబు గౌడ్, రఘు, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

*ఘనంగా ప్రారంభమైన ఎల్‌ఐసీ 70వ వార్షికోత్సవ వేడుకలు - జ్యోతి ప్రజ్వలన చేసిన యెర్రం విజయ్ కుమార్*

Image
 *ఘనంగా ప్రారంభమైన ఎల్‌ఐసీ 70వ వార్షికోత్సవ వేడుకలు - జ్యోతి ప్రజ్వలన చేసిన యెర్రం విజయ్ కుమార్* *హైదరాబాద్, సెప్టెంబర్ 1:* భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) 70వ వార్షికోత్సవ వేడుకలు సైఫాబాద్ లోని సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జోనల్ మేనేజర్ శ్రవణ్ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వాసవి కన్స్ట్రక్షన్స్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త యెర్రం విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎల్‌ఐసీ గ్యారెంటీకి, విశ్వాసానికి, ఆర్థిక భద్రతకు ప్రతీక అని, 70 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని శతాబ్ది వైపు సాగాలని ఆకాంక్షించారు. తమ కుటుంబం ఏళ్లుగా ఎల్‌ఐసీతో అనుబంధం కలిగి ఉందని తెలిపారు. జోనల్ మేనేజర్ శ్రవణ్ రమేష్ మాట్లాడుతూ 2047 నాటికి ప్రతి భారతీయుడికి జీవిత బీమా రక్షణ అందించడమే లక్ష్యమని, ఏడు దశాబ్దాలుగా కోట్లాది మంది విశ్వాసాన్ని నిలబెట్టుకున్న సంస్థ ఎల్‌ఐసీ అని అన్నారు. సెప్టెంబర్ 1 నుండి 8 వరకు బీమా వారోత్సవాలు జరుగుతా...

*స్థానిక పత్రికలతోనే సమాజ నిర్మాణం* - సంఘ్ క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ జీ

Image
  *స్థానిక పత్రికలతోనే సమాజ నిర్మాణం* ప్రపంచానికి దిశానిర్దేశం చేసేలా భారత్‌ను విశ్వగురువుగా మలిచేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రతిపాదించిన పంచపరివర్తన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఉత్తమ భారతీయ సమాజాన్ని రూపొందించుకోవలసిన అవసరం ఉందని సంఘ్ క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ జీ పేర్కొన్నారు. భాగ్యనగర్‌లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో "సమాచార భారతి" సంస్థ ఆధ్వర్యంలో ''స్థానిక పత్రికలు - సమాజ నిర్మాణం'' అంశంపై ఆదివారం జరిగిన ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో ఆయన ప్రధానవక్తగా పాల్గొన్నారు. సంఘ్ క్షేత్ర ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయుష్ జీ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణలోని పలు జిల్లాల నుంచి 30కి పైగా వివిధ స్థానిక పత్రికల సంపాదకులు, పాత్రికేయులు పాల్గొని విశేష స్పందన కనబరిచారు. సంఘం ప్రధానంగా మార్పును, పరిణామాన్ని కోరుతున్నదని, ఇవి వ్యక్తి నుంచి ప్రారంభం కావాలని, దేశ నిర్మాణం లక్ష్యంగా ఇటువంటి వ్యక్తి నిర్మాణం అనేది సంఘ్ శాఖలలో జరుగుతున్నదని భరత్ కుమార్ వివరించారు. ఇలాంటి వ్యక్తులతో కూడిన కుటుంబమే దేశానికి వెన్నెముక అన్నారు. సంఘ్ ప్రస్తుతం 90 వేల...

“ముస్లింలు ఉండకూడదని భావించే వ్యక్తి హిందువు కాదు” -న్యూయార్క్‌ నుంచి మోహన్‌ భాగవత్‌ కీలక సందేశం

Image
“ముస్లింలు ఉండకూడదని భావించే వ్యక్తి హిందువు కాదు” -న్యూయార్క్‌ నుంచి మోహన్‌ భాగవత్‌ కీలక సందేశం వైవిధ్యమే భారత్‌ బలం.. మానవత్వం ఒక్కటే: మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ న్యూయార్క్‌, ఆగస్టు 30: అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో జరిగిన “One World, One Humanity” కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌సంఘ్‌చాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భాగవత్‌ ప్రపంచ మానవాళికి ఏకత్వం, వైవిధ్యానికి గౌరవం, పరస్పర సామరస్యంపై కీలక సందేశం ఇచ్చారు. మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 6,000 మందికి పైగా భారతీయ-అమెరికన్‌ సమాజ సభ్యులు, ఇంటర్‌ఫెయిత్‌ నాయకులు హాజరైనట్లు పీటీఐ నివేదించింది. “ముస్లింలు ఉండకూడదనుకునే వ్యక్తి హిందువు కాదు” భాగవత్‌ ప్రసంగంలో అత్యంత ప్రాధాన్యం పొందిన వ్యాఖ్య ఇదే. భారత్‌లో ముస్లింలు ఉండకూడదని భావించే వ్యక్తి “హిందువుగా ఉండడం మానేస్తాడు” అని ఆయన అన్నారు. 2018లో ఢిల్లీలో తాను నిర్వహించిన ఉపన్యాస కార్యక్రమాన్ని గుర్తుచేసుకున్న భాగవత్‌, అక్కడ పాల్గొన్న కొందరు ముస్లిం సోదరులు “మీరు హిందూ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు.. ముస్లింల పరిస్థితి ఏమిటి?”...

*నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి - వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ* *ఘటనపై HRC కి ఫిర్యాదు చేసిన జిల్లా వాసి నవీన్ కుమార్ మల్లేపల్లి*

Image
 *నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి - వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ* *ఘటనపై HRC కి ఫిర్యాదు చేసిన జిల్లా వాసి నవీన్ కుమార్ మల్లేపల్లి* *నల్లగొండ:* జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. *అసలేం జరిగింది?* కంబంపాటి కవిత అనే మహిళ రెండవ కాన్పు కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాన్పు అనంతరం శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు సకాలంలో స్పందించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. *HRC కి ఫిర్యాదు* ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త *నవీన్ కుమార్ మల్లేపల్లి* రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా జరుగుతున్న శిశు మరణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధిత కుటుంబాని...