Posts

విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలి - జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Image
విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలి.... భవిష్యత్ లో ఏమి కావాలో పాఠశాల లోనే నిర్ణయించుకోవాలి.... విద్యార్థులకి తెలుగు, ఇంగ్లిష్ భాష లపై పట్టు సాధించాలి..... జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ సూర్యాపేట:  విద్యార్థులు ప్రతి సబ్జెక్టు ఇష్టం తో చదివి మంచి మార్కులు తెచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకాక్షించారు. గురువారం సూర్యాపేట మండలం టేకుమట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ను సందర్శించి పదవ తరగతి విద్యార్థులతో,సిబ్బందితో మాట్లాడినారు..ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యతను, వ్యక్తులు చేసే వృత్తి ద్వారా సమాజంలో గుర్తింపు పొందుతారని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించి భవిష్యత్తును రూపొందించడానికి పాఠశాల స్థాయి నుండే కష్టపడాలని తెలిపారు. విద్యార్థులకి తెలుగు, ఇంగ్లిష్ భాషలపై పట్టు సాధించాలని తెలిపారు.  బోధనా పద్ధతులు,భాషా నైపుణ్యాలను పొందడంలో విద్యార్థుల పురోగతి సాధించాలని,విద్యార్థులు క్రమంగా మెరుగుపడుతున్నప్పటికీ, నెమ్మదిగా నేర్చుకునేవారికి...

జీహెచ్ఎంసి పురోగతిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలు మరువలేనివి - అదనపు కమిషనర్ రఘు ప్రసాద్

Image
 జీహెచ్ఎంసి పురోగతిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలు మరువలేనివి - అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ *పదవీ విరమణ పొందిన 18 మంది జిహెచ్ఎంసి అధికారులు, ఉద్యోగులకు ఆత్మీయ సత్కారం* *హైదరాబాద్, జులై 31, 2025:*   జీహెచ్ఎంసి పురోగతిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల  సేవలు మరువలేనివని అదనపు కమిషనర్ (హెల్త్ , శానిటేషన్) రఘు ప్రసాద్ అన్నారు. గురువారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పదవీ విరమణ పొందిన వివిధ స్థాయిలోని 18 మంది అధికారులు, ఉద్యోగులకు అదనపు కమిషనర్ (హెల్త్, శానిటేషన్) రఘు ప్రసాద్, అదనపు కమిషనర్ లు వేణు గోపాల్, గీతా రాధిక, సీపీఆర్ఓ మహమ్మద్ ముర్తుజా, పిఆర్ఓ మామిండ్ల దశరథం లతో కలిసి శాలువా, పూల దండలతో సత్కరించారు. గిఫ్ట్ లను బహుకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ (హెల్త్, శానిటేషన్) రఘు ప్రసాద్ మాట్లాడుతూ... ప్రతి ఉద్యోగికి తాము అందించిన సేవలతోనే గుర్తింపు లభిస్తుందని అన్నారు. పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులందరూ తమ ఉద్యోగ జీవితంలో ఎంతో నిబద్ధత, అంకిత భావంతో సేవలందించారన్నారు. వారి కృషి, అందించిన సేవలు తమ సహచర ఉద్యోగులకు  స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు...

గణేష్ చతుర్థిని భక్తితో తో బాటు బాధ్యతతో జరుపుకోండి - TGPCB

Image
 గణేష్ చతుర్థిని భక్తితో తో బాటు బాధ్యతతో జరుపుకోండి తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (TGPCB) ఆగస్టు 27, 2025 నుండి జరిగే గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా పర్యావరణ అనుకూల విగ్రహ నిమజ్జనం కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) జారీ చేసిన సవరించిన మార్గదర్శకాలు తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (TGPCB), కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) సమన్వయంతో, పర్యావరణ అనుకూలమైన గణేష్ చతుర్థి పండుగను నిర్ధారించడానికి సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. విగ్రహ నిమజ్జనానికి సంబంధించి పెరుగుతున్న పర్యావరణ ఆందోళనల దృష్ట్యా, CPCB ఈ క్రింది కీలక ఆదేశాలను జారీ చేసింది. ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లేదా ఇతర బయోడెగ్రడబుల్ చెందని పదార్థాలకు బదులుగా సహజ బంకమట్టితో తయారు చేసిన పర్యావరణ అనుకూల విగ్రహాలను ఉపయోగించాలి.నీటి వనరుల రసాయన కాలుష్యాన్ని తగ్గించడానికి విగ్రహాలను చందనం (గంధం), పసుపు, గెరువా (ఎర్ర ఓచర్) వంటి బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ రంగులతో అలంకరించాలి. స్థానిక అధికారులు విగ్రహ నిమజ్జనం కోసం ప్రత్యేకంగా తాత్కాలిక కృత్రిమ చెరువులు లేదా ట్యాంకులను సృష్టించి నిర్వహించాలి. సహజ జల వనరులను రక్షించడానికి...

ఉత్తర తెలంగాణకు మహాసభ అధ్యక్ష పదవి రావాల్సిందే - కోలేటి రమేశ్ డిమాండ్

Image
 ఉత్తర తెలంగాణకు మహాసభ అధ్యక్ష పదవి రావాల్సిందే -   కోలేటి రమేశ్ డిమాండ్ పెద్దపల్లి:  ప్రస్తుతం జరుగనున్న తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల్లో మహాసభ బైలాస్ ప్రకారం ఈసారి ఉత్తర తెలంగాణకు అధ్యక్ష పదవి రావల్సిందేనని పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య గౌరవ అధ్యక్షులు కోలేటి రమేశ్ డిమాండ్ చేశారు. మనకు దక్కాల్సిన పదవిని సైతం వారు దక్కకుండా చేస్తు తిరిగి దొడ్డదారిలో అధికారం సంపాదించుకొవాలని చూస్తున్న విషయం... దానిపై పలువురు నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించిన సంగతి తెలిసిందనని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో మన హక్కులను కాపాడుకోవడానికి, మన హక్కులను సంపాదించుకోవడానికి గాను “ ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు చెందిన వారికి మాత్రమే ఈసారి మహాసభ అధ్యక్షపదవి ” దక్కాలని, ఇందుకు గాను అందరం కలిసి, సమిష్టిగా పెద్దపల్లి నుండి ఉత్తర తెలంగాణ నినాదం ఎత్తుకోవడం జరుగుతుందనీ, మీ అందరితో మనస్సువిప్పి మాట్లాడుకోవడానికి గాను అత్యవసర సమావేశాన్ని వైశ్యభవన్, పెద్దపల్లి లో 27-07-2025, ఆదివారం ఉదయం 10-30 లకు ఏర్పాటు చేయడం జరిగిందనీ. పెద్దపల్లి జిల్లాలోని మండల ఆర్యవైశ్య సంఘాల అద్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క...

కళ్యాణదుర్గం చరిత్రలో అతిపెద్ద అవినీతి తిమింగలం..

Image
 కళ్యాణదుర్గం చరిత్రలో అతిపెద్ద అవినీతి తిమింగలం..   ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఐదు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్టర్ నారాయణస్వామి..  సబ్ రిజిస్టర్ కార్యాలయానికి నారాయణ స్వామి తీసుకొని వచ్చి విచారణ జరుపుతున్న ఏసిబీ అధికారులు... ఇంకా భారీ స్థాయిలో జరిగిన అవినీతిపై విచారణ..  జిల్లాలో దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉందని వినికిడి..

TGPCB పై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కమిషన్

Image
 TGPCB పై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కమిషన్  హైద్రాబాద్: గూఢచారి: 25.07.2025. మల్కాజిగిరి, హైదరాబాద్‌లోని 'M/s. మాత కేటరర్స్' అనే అనధికారిక వాణిజ్య కాంటీన్ కార్యకలాపాలు పర్యావరణ కాలుష్యానికి, ఆరోగ్య హానికీ కారణమవుతున్నాయని, పలు మార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చెర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ PVN కాలనీవాసులు దాఖలు చేసిన కేసులో(HRC నెం. 635/2025) తేదీ 08 జులై 2025న గౌరవ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ ఆధ్వర్యంలో) తుది తీర్పు ద్వారా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వం వారికి ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలమేరకు మెంబెర్ సెక్రటరీ, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) వారి స్పందన (చట్టబద్ధ బాధ్యతను నిర్వర్తించకుండ, కేవలం సంబంధిత EE వారి నివేదికను పంపడం)పై, కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. Hyderabad, dt.25.07.2025. Hon'ble Telangana Human Rights Commission (presided by Justice Dr. Shamim Akhtar) has issued directions to the Chief Secretary, Government of Telangana through its final judgment dated 08 July 202...

ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడానికి జర్నలిజం వారధి - సమాచార ప్రత్యేక కమిషనర్ ప్రియాంక

Image
  ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడానికి జర్నలిజం వారధి - సమాచార ప్రత్యేక కమిషనర్ ప్రియాంక  ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడానికి జర్నలిజం వారధి అని, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సమాచార ప్రత్యేక కమిషనర్ ప్రియాంక అన్నారు.  గురువారం నాంపల్లి మీడియా అకాడమీలో రంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జర్నలిస్టుల ప్రయోజనం కోసం అవసరమైన సౌకర్యాలను అందించడంలో మీడియా అకాడమీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని, అకాడమీకి అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని ఆమె అన్నారు. పాత రోజుల్లో వార్తలను అందించే పద్ధతి చాలా కష్టంగా ఉండేదని, కానీ ఇప్పుడు వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వార్తల సమాచారం అందరికీ సెకన్లలో చేరుతుందని ఆమె అన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల మధ్య జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు అందించడంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైనదని ఆమె అన్నారు. ఈ సమాజంలో ఏమి జరిగిందో ప్రజలకు నిజచిగా నిక్కచ్చితంగా, నిజాయితీగా తెలియజేయాలని, మీరు అందించే సమాచారం ఆధారంగానే ప్రజల...