Posts

జ‌ర్న‌లిజానికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌గా ఉంటాం-పొంగులేటి

Image
  *జ‌ర్న‌లిజానికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌గా ఉంటాం* *అక్రిడిటేష‌న్ కార్డులు త‌గ్గుతాయ‌నే ప్ర‌చారం వాస్త‌వం కాదు* *గ‌తంలో కంటే ఎక్కువ‌గానే  అక్రిడిటేష‌న్ల మంజూరు*  *ఏకార్డుకైనా అన్ని ప్ర‌యోజ‌నాలు వ‌ర్తిస్తాయి* *జ‌ర్న‌లిస్టు సంఘాల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాం* *జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తాం* *జ‌ర్న‌లిస్టుల ఇండ్ల స్ధ‌లాల కోసం కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తాం* *14 జ‌ర్న‌లిస్టు సంఘాల‌తో స‌మావేశం నిర్వ‌హించిన* ... *రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార‌, పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి* *హైద‌రాబాద్‌*:- జర్న‌లిజం గౌర‌వాన్ని నిల‌బెట్టి ఆ వృత్తికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టులంద‌రికీ గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అన్నివిధాలా అండ‌దండ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార‌, పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఏ ఒక్క‌రి గౌర‌వాన్ని త‌గ్గించాల‌ని గాని, చిన్న‌బుచ్చాల‌నిగాని త‌మ‌  ప్ర‌భుత్వ ఉద్దేశ్యం కాద‌ని స్ప‌ష్టం చేశారు.       జీవో 252 ప...

*ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి రాజగోపాల్ ను కలసిన, టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్-2843) నేతలు*

Image
  *ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి రాజగోపాల్ ను కలసిన, టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్-2843) నేతలు* - జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశాన్ని జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి ద్వారా తెలుసుకున్న ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఖమ్మం, జనవరి 09: ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపుల అంశంలో నెలకొన్న అనిశ్చితిపై న్యాయ సహకారం అందించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్  (టిడబ్ల్యూజేఎఫ్- హెచ్-2843) జిల్లా కమిటీ బృందం జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి.రాజగోపాల్‌ ను ఆయన చాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి. రాజగోపాల్ కు ముందస్తు శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ భేటీలో జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు మంజూరైన ఇండ్ల స్థలాల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర అనిశ్చితిని సృష్టిస్తున్నాయని జడ్జి దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్‌లో న్యాయ నిపుణులు జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై చేసిన సూచనలు, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఉ...

ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Image
  ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి గూఢచారి, సూర్యాపేట, 9 జనవరి :  09.01.2026న, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (ఎం)లోని గనుగబండ (వి) గ్రామ పంచాయతీకి చెందిన పంచాయతీ కార్యదర్శి ఎఓ బర్పాటి కృష్ణ, ఫిర్యాదుదారుని నుండి అధికారిక సహాయం కోసం అంటే "ఫిర్యాదిదారుని కొత్తగా నిర్మించిన ఇంటికి ఇంటి నంబర్ కేటాయించడానికి" రూ. 6,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు నల్గొండ రేంజ్ యూనిట్ ఎసిబికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. లంచం మొత్తాన్ని ఎఓ వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.  అందువల్ల, AO ని అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లిలోని SPE మరియు ACB కేసుల కోర్టు గౌరవనీయులైన Ist Addl. ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నారు . కేసు విచారణలో ఉంది.

ఏసీబీకి చెక్కిన కాకతీయ యూనివర్సిటీ ఎస్ఐ

Image
 ఏసీబీకి చెక్కిన కాకతీయ యూనివర్సిటీ ఎస్ఐ హన్మకొండ, గూఢచారి, జనవరి 8: హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శ్రీకాంత్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పేకాట కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోకుండా.. కేసును తేలిక చేసి, అతనికి అనుకూలంగా వ్యవహరించేందుకు ఎస్సై శ్రీకాంత్ రూ. 15వేల నగదును డిమాండ్ చేశారు. బాధితుడిని పదేపదే వేధిస్తూ డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో చేసేదేం లేక సదరు వ్యక్తి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్ని గురువారం బాధితుడి నుంచి ఎస్సై శ్రీకాంత్ 15 వేల లంచం తీసుకుంటున్న సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. కేయూ ఎస్సై శ్రీకాంత్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం జి...

జర్నలిస్టు వద్ద లంచం తీసుకొని ఏసీబీ కి చిక్కిన పంచాయతీ అధికారులు

Image
జర్నలిస్టు వద్ద లంచం తీసుకొని  ఏసీబీ కి చిక్కిన పంచాయతీ అధికారులు గూఢచారి, షాద్నగర్:   ఈదులపల్లి వద్ద నిర్మాణం పనులకు లంచం 2.50 లక్షల లక్ష్యం, లక్షన్నర చెల్లించినా అందని అనుమతులు, ఏసీబీని ఆశ్రయించిన జర్నలిస్ట్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్న జిల్లా ఏసీబీ శాఖ డిఎస్పి ఆనంద్.   *షాద్ నగర్ లో సంచలనం*  సింహం పడుకుంది కదా అని దాని తలను దువ్వెనతో దువ్వాలని చూడకూడదు.. తొక్కుతున్నది తోకే కదా అని పాము జోలికి వెళ్ళకూడదు.. అలాంటిది షాద్ నగర్ లో ఒక దిన పత్రికకు పాత్రికేయుడుగా పనిచేస్తున్న వ్యక్తిని నిర్భయంగా లంచం అడిగి, కాగితాలు ఇవ్వకుండా వేధించి చివరికి ఏసీబీ అధికారులకు బుక్ అయ్యారు.. షాద్ నగర్ నియోజకవర్గంలో నందిగామలో సంచలనం ఇది. జర్నలిస్ట్ దెబ్బకు రంగంలోకి దిగిన ఎసిపి శాఖ డిఎస్పి ఆనంద్ లంచం ఆశించిన నందిగామ ఎంపీడీవో సుమతి, ఎంపీఓ ధీర్ సింగ్, వీఆర్వో చెన్నయ్యలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి లంచావతారాలకు తెరదించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..  *జరిగిన కథ..*  షాద్ నగర్ పరిధిలో ఓ ప్రముఖ దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్న జర్నలిస్టు నందిగామ మండలం ఈదులపల్లి పరిధ...

ACB నెట్ లో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్

Image
ACB నెట్ లో  ఎండోమెంట్ ఇన్స్పెక్టర్  గూఢచారి, హైద్రాబాద్ 7 జనవరి :  07.01.2026న, ఎండోమెంట్ శాఖ కమిషనర్ బొగ్గులకుంట హైదరాబాద్‌లోని 2వ అంతస్తులో ఉన్న ఎండోమెంట్ శాఖ అసిస్టెంట్ కమిషనర్, హైదరాబాద్ తెలంగాణ కార్యాలయం వద్ద నిందితుడైన అధికారి ఆకవరం కిరణ్ కుమార్, ఇన్‌స్పెక్టర్. ఎండోమెంట్ తన కార్యాలయ ప్రాంగణం పక్కన సిటీ రేంజ్-1లోని ACB సిబ్బందికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు, అంటే RC నంబర్ E/944/2021 ప్రకారం, బాగ్ అంబర్‌పేట్‌లోని భూమికి సంబంధించి ఫిర్యాదుదారునికి సర్వే నివేదికను జారీ చేయడానికి, ఫిర్యాదుదారుని నుండి రూ. 1.50,000/- లంచం మొత్తాన్ని చెల్లించమని డిమాండ్ చేసి, లంచం మొత్తాన్ని రూ. 50,000/- చెల్లించమని అతను డిమాండ్ చేశాడు. AO వద్ద నుండి తీసుకున్న కళంకిత లంచం మొత్తం రూ. 50,000/- అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.  అందువల్ల, AO ని అరెస్టు చేసి, గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తి SPE & ACB కేసుల ముందు హాజరుపరుస్తున్నారు . కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచారు .

అందరివాడు' కు ఆత్మీయ సన్మానం*

Image
  *'అందరివాడు' కు  ఆత్మీయ సన్మానం* -ఆర్యవైశ్య మహాసభ వేదికగా సేవా సంకల్పం -టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తికి సత్కారం ఖమ్మం, జనవరి 5 ఖమ్మం గుట్టల బజార్‌ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవ్యాలయం ప్రాంగణంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యవర్గ సమావేశం, అధ్యక్షులు పసుమర్తి చంద్రరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి ఆర్యవైశ్య సమాజానికి చెందిన నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడంతో సభకు విశేష ప్రాధాన్యత లభించింది. ఐక్యతే బలమనే భావన సమావేశమంతా ప్రతిధ్వనించింది. సమావేశంలో ఇటీవల ఎన్నికైన గ్రామపంచాయతీ ఆర్యవైశ్య చైర్మన్లు, వార్డు సభ్యులు, చాంబర్ ఆఫ్ కామర్స్, జూబ్లీ క్లబ్, వివిధ దేవాలయాల పాలకవర్గాలకు ఎన్నికైన ఆర్యవైశ్య ప్రతినిధులను వేదికపై ఘనంగా సత్కరించారు. బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రయోజనాలకంటే సమాజ హితానికే ప్రాధాన్యం ఇవ్వాలని, సమిష్టి కృషితోనే ఆర్యవైశ్య సమాజానికి గౌరవం పెరుగుతుందని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా తెలంగాణ వర్...