Posts

ఆర్టీఐ షాక్: పంచాయతీ కార్యదర్శికి రూ. 20 వేల జరిమానా విధించిన తెలంగాణ సమాచార కమిషన్!

Image
  ఆర్టీఐ షాక్: పంచాయతీ కార్యదర్శికి రూ. 20 వేల జరిమానా విధించిన తెలంగాణ సమాచార కమిషన్! హైదరాబాద్: సమాచార హక్కు చట్టం (RTI) అమలులో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి అధికారైనా మూల్యం చెల్లించుకోక తప్పదని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ (SIC) మరోసారి స్పష్టం చేసింది. భవన నిర్మాణ అనుమతులపై సకాలంలో సమాచారం అందించని నల్గొండ జిల్లాకు చెందిన ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (PIO) కమ్ పంచాయతీ కార్యదర్శికి కమిషన్ రూ. 20,000 భారీ జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని బాధితుడైన దరఖాస్తుదారునికి నష్టపరిహారంగా చెల్లించాలని, అలాగే కోరిన రికార్డులను తక్షణమే అందజేయాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే..? (పేలుడు పదార్థాల నిల్వ ఆరోపణలు) నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం, ఇర్కిగూడెం గ్రామానికి చెందిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఓ ప్రైవేట్ కంపెనీ నిర్మించిన భవనాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా 'పేలుడు పదార్థాలను' నిల్వ ఉంచారని, ఇది స్థానిక ప్రజల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించిందని కె. కృష్ణ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ నేపథ్యంలో, సదరు నిర్మాణానికి గ్రామ పంచాయతీ నుండి చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయో...

*జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక డ్రైవ్* *ఒకే రోజు 283 ఆక్రమణలు తొలగింపు*

Image
 *జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక డ్రైవ్*   *ఒకే రోజు 283 ఆక్రమణలు తొలగింపు* *హైదరాబాద్:* పాదచారుల సౌకర్యం, ట్రాఫిక్ సాఫీగా సాగడం మరియు పట్టణ రవాణా మెరుగుదలలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో శనివారం ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ట్రాఫిక్ మరియు లా & ఆర్డర్ పోలీసులతో సమన్వయం చేసుకుని పాదచారుల మార్గాలు, రహదారి అంచులపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. ప్రతి జోన్‌లో ఒక ప్రధాన రహదారిని ఎంపిక చేసి, సంబంధిత సర్కిళ్ల సిబ్బందిని సమీకరించి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, చీఫ్ సిటీ ప్లానర్ మరియు సంబంధిత జోనల్ కమిషనర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ విభాగం మరియు ఇతర విభాగాల సిబ్బంది ఈ డ్రైవ్‌లో పాల్గొన్నారు. *ఐదు ప్రధాన ప్రాంతాల్లో తొలగింపు* శంషాబాద్ సర్కిల్-18లో ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ నుంచి మిషన్ కంపౌండ్ వరకు 15 శాశ్వత, 56 తాత్కాలిక ఆక్రమణలు తొలగించారు. చార్మినార్ సర్కిల్-29లో ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి రిలయన్స్ ట్రెండ్స్ వరకు ఫుట్‌పాత్,...

TGPCBలో పరిశ్రమల భద్రతపై కీలక సమావేశం

Image
  TGPCBలో పరిశ్రమల భద్రతపై కీలక సమావేశం అగ్ని ప్రమాదాల నివారణకు LDAR అధ్యయనంపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్, జూన్ 20 (గూఢచారి): పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలను తగ్గించడం, రసాయన లీకేజీలను నియంత్రించడం, వాతావరణ కాలుష్యాన్ని నివారించడం లక్ష్యంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) శనివారం కీలక సమావేశాన్ని నిర్వహించింది. TGPCB సభ్య కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీర్స్ (IIChE) నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ (MoEF) గుర్తింపు పొందిన ప్రయోగశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో Leak Detection and Repair (LDAR) అధ్యయనం ప్రాముఖ్యత, పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాల కారణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. IIChE నిపుణులు మాట్లాడుతూ ప్రతి పరిశ్రమలో అర్హత కలిగిన సాంకేతిక సిబ్బంది ఉండాలని, రసాయనాల నిర్వహణ, లీకేజీల గుర్తింపు, నియంత్రణ, అలాగే Volatile Organic Compounds (VOCs) వాతావరణంలోకి విడుదల కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యోగులకు నిరంతర శిక్షణ ఇవ్వాలని సూచించారు. అలాగే...

చార్మినార్‌లో అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం; కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం*

*చార్మినార్‌లో అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం; కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం* హైదరాబాద్, జూన్ 19, 2026: ఆహార కల్తీ మరియు అసురక్షిత ఆహార పద్ధతులపై నిరంతర నిఘాలో భాగంగా, హెచ్-ఫాస్ట్ (హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్) బృందం, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO)తో కలిసి చార్మినార్‌లోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక ఫాస్ట్ ఫుడ్ గోదాముపై ఆకస్మిక దాడి నిర్వహించింది. నమ్మకమైన సమాచారం మేరకు, ఈ బృందం చార్మినార్‌లోని పంచ్ మొహల్లా, న్యూ లాడ్ బజార్‌లో ఉన్న ‘మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’ ప్రాంగణాన్ని తనిఖీ చేసింది. ఈ తనిఖీలో, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే విధంగా అత్యంత అపరిశుభ్రమైన మరియు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలను తయారు చేయడం మరియు నిల్వ చేయడం జరుగుతున్నట్లు గుర్తించారు. • నిర్బంధ FSSAI లైసెన్స్ లేకుండా నిర్వహించడం. • నిషేధించబడిన/కృత్రిమ ఆహార రంగులను (MSK లయన్ గ్రీన్ మరియు రాస్ప్‌బెర్రీ రెడ్) ఉపయోగించడం. • పాడైపోయిన మరియు ప్రమాదకరమైన వంట నూనెను పదే పదే ఉపయోగించడం. • నీటి విశ్లేషణ ధృవీకరణ (Wat...

మేడిపల్లి లేఅవుట్ ప్రీ-బిడ్ సమావేశానికి భారీ స్పందన

Image
 *మేడిపల్లి లేఅవుట్ ప్రీ-బిడ్ సమావేశానికి భారీ స్పందన*   *200 మందికి పైగా భావి బిడ్డర్ల హాజరు* *హైదరాబాద్:* హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో ప్రతిపాదిత మేడిపల్లి లేఅవుట్‌కు సంబంధించి 16.6.2026న ప్రాజెక్టు స్థలంలో ప్రీ-బిడ్ సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది.  ఈ సమావేశానికి 200 మందికి పైగా భావి బిడ్డర్లు ఉత్సాహంగా హాజరై, 24.6.2026న జరిగే ఈ-వేలంపై విశేష ఆసక్తిని వ్యక్తం చేశారు. సమావేశంలో హెచ్‌ఎండీఏ అధికారులు, నిపుణులు బిడ్డర్ల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్ వై. సుదర్శన్ మేడిపల్లి లేఅవుట్ ముఖ్యాంశాలను వివరించగా, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఎ. రవీందర్ రెడ్డి లేఅవుట్ ప్రణాళికా అంశాలు, అభివృద్ధి ప్రతిపాదనలపై స్పష్టత ఇచ్చారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. సత్యప్రసాద్ స్థలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించి, సాంకేతిక సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఈ-వేలం ప్రక్రియ, నమోదు విధానం, బిడ్డర్ల భాగస్వామ్య మార్గదర్శకాల గురించి ఎంఎస్‌టీసీ ప్రతినిధి సిద్ధార్థ్ వివరించారు.  కేపీఎంజీ ప్రతినిధి కళ్యాణ్ మేడిపల్లి లేఅవుట్ ప్రత్యేకతలు,...

ఘనంగా రావికంటి రామయ్య జయంతి

Image
 ఘనంగా రావికంటి రామయ్య జయంతి ... మంథని : మంత్రకూట వేమన, ప్రజాకవి,  రావికంటి రామయ్య గుప్త 90వ జయంతి  వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి.‌ మంథనిలోని వారి కాంస్య విగ్రహానికి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మంథని మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు శశి భూషణ్ కాచే, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి కొమురవెల్లి విజయ్ కుమార్, ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు ఎల్లంకి వంశీధర్ , రావికంటి రామయ్య తనయుడు, సీనియర్ జర్నలిస్ట్ రావికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.‌ అనంతరం మంథని విద్యార్థి యువత వ్యవస్థాపకుడు కొండేల మారుతి ఆధ్వర్యంలో రావికంటి రామయ్య గుప్త సంస్మరణ సభ జరిగింది. ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల నియమితులైన కొమురవెల్లి విజయ్ కుమార్ ను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.‌  ... రామయ్య కీర్తి అజరామరం : మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్  ... కవిత్వం, సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్య పరిచిన రావికంటి రామయ్య కీర్తి అజరామరంగా నిలిచిపోతుందని మంథని మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీ...

“వీరి వీరి గుమ్మడి పండు... వీరి పేరు ఏమి?” – TGPCBలో ‘ఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్' డిప్యుటేషన్‌ల ఆట మళ్లీ మొదలా?

Image
“వీరి వీరి గుమ్మడి పండు... వీరి పేరు ఏమి?” – TGPCBలో ‘ఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్'  డిప్యుటేషన్‌ల ఆట మళ్లీ మొదలా? ట్రాన్స్‌ఫర్లు ఒక వైపు... డిప్యుటేషన్లు మరో వైపు! తెలంగాణ పీసీబీలో అక్రమ డిప్యుటేషన్‌లకు సర్వం సిద్ధమనే ప్రచారం! హైదరాబాద్: “వీరి వీరి గుమ్మడి పండు... వీరి పేరు ఏమి?” అనే పాటలో చివరి చరణం “ఎక్కడి వాళ్లు అక్కడ గప్ చుప్"  అన్నట్లుగా, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB)లో బదిలీలు జరిగినా కొందరు ఉద్యోగులు, అధికారులు మళ్లీ తమకు అనుకూల ప్రాంతాలకే డిప్యుటేషన్‌ల ద్వారా చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా డిప్యుటేషన్ అనేది శాఖ అవసరాల కోసం, ప్రత్యేక నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమైనప్పుడు మాత్రమే ఇవ్వాల్సిన పరిపాలనా విధానం. కానీ TGPCBలో మాత్రం కొందరి వ్యక్తిగత అవసరాలు, పలుకుబడులు, పరిచయాల ఆధారంగా డిప్యుటేషన్‌లు జరుగుతున్నాయనే విమర్శలు ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో GHMC పరిధిని ఒకే యూనిట్‌గా పరిగణిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పలువురిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. అయితే ఆ తర్వాత కొందరు ప్రభావశీలులు అడ్మినిస్ట్రేషన్...