*ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం: ఏబీవీపీ*
*ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం: ఏబీవీపీ*
*ఎంజీయూలో కాగడాల ర్యాలీ నిర్వహించిన ఏబీవీపీ శ్రేణులు*
*నల్గొండ:* పది తొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీన దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయిందని ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ కో కన్వీనర్ మౌనేశ్వర్ చారి పేర్కొన్నారు.
ఎమర్జెన్సీకి నిరసనగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో గురువారం కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మౌనేశ్వర్ చారి మాట్లాడుతూ అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించి రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాసిందని విమర్శించారు. పత్రికా స్వేచ్ఛను అణచివేసి, రాజకీయ ప్రత్యర్థులను అక్రమంగా అరెస్టు చేసి జైళ్లలో నిర్బంధించిందని తెలిపారు.
ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, సమావేశాలు నిర్వహించే హక్కు, ప్రజాస్వామ్య విలువలు ఆ కాలంలో తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో వేలాది మంది ప్రజాస్వామ్య పరిరక్షకులు, విద్యార్థి నాయకులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు నిర్బంధాలను ఎదుర్కొన్నారని చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని ఆయన అన్నారు. యువతకు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
పది తొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున జరిగిన ఎమర్జెన్సీని స్మరించుకుంటూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి, జిల్లా కన్వీనర్ సూర్య, స్టేట్ హాస్టల్ కో కన్వీనర్ సంపత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్, రామావత్ సతీష్, యూనివర్సిటీ విద్యార్థి నాయకులు విజయ్, వెంకటేష్, నరసింహ, అక్షిత్, తరుణ్, మల్లిఖార్జున్, సాయి, సతీష్, రాజేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment