నల్గొండ ఆధ్వర్యంలో
జాతిపిత మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాలు నల్గొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనైనది.
క్లాక్ టవర్ సెంటర్లో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్ గారు ప్రాంభించి మహాత్మా గాంధీ ఆశయాలను అనుగుణంగా అందరం ఆదిశగా కృషి చేయాలని ఆర్యవైశ్య సంఘం చేస్తున్న అన్నదానం కార్యక్రమం చాలా ఆభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు యామా మురళి, గౌరవ అధ్యక్షుడు భూపతి రాజు, ప్రోగ్రాం కన్వీనర్లు, నాంపల్లి నరసింహ, ఓంప్రసాద్, బెలిదే వెంకన్న, గుండా కరుణాకర్, వీరెల్లి సతీష్, గుబ్బ శ్రీనువస్ , జిల్లా అధ్యక్షుడు తెడ్ల జోవహర్ బాబు , ప్రధాన కార్యదర్శి వనామా మనోహర్, వీరెల్లి శేఖర్, మొరిశెట్టి నాగేశ్వర్ రావు, చిలకల గోవర్ధన్, యమా దయాకర్, కోటగిరి దైవదీనం, కోటగిరి చంద్రశేకేర్, నల్గొండ శ్రీనివాస్, భూపతి లక్ష్మీనారాయణ, పారుపల్లి వెంకన్న, వందనపు వేణు, అర్ధం శ్రీనివాస్, యామా శ్యామ్, వనామా శ్యామ్ ప్రసాద్, వనమా రమేష్, ఒరుగంటి పరమేష్, బుక్క ఈశ్వర్, మిట్టపల్లి నవీన్, సోమా దీప్తి, నాంపల్లి భాగ్య, తదితరులు పాల్గొన్నారు. దాదాపు 3500 మందికి అన్న సంతర్పణ చేయడం జరిగింది.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment